Kurnool మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లను ఎలా వేధించారంటే?

కర్నూలు మెడికల్‌ కాలేజీలో జూనియర్లను సీనియర్లు వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూటెంట్స్‌ని చెప్పినట్టు కళ్లజోళ్లు పెట్టుకోవాలని, మీసాలు, గడ్డాలు తీసేయాలని సీనియర్లు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థులు అంటున్నారు.

New Update
karnool

Karnool

Karnool: కర్నూలు మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ భూతం జడలువిప్పింది. తాము చెప్పినట్టే వినాలంటూ జూనియర్లను సీనియర్లు వేధిస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఎంబీబీఎస్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూటెంట్స్‌కి రోజురోజుకు వేధింపులు ఎక్కువయ్యాయి. ఫస్టియర్ తరగతులు ప్రారంభమైన వారం రోజులకే జూనియర్లను సీనియర్లు వేధిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. చెప్పినట్టు కళ్లజోళ్లు పెట్టుకోవాలని, మీసాలు, గడ్డాలు తీసేయాలని సీనియర్లు ఇబ్బంది పెడుతున్నారని జూనియర్‌ విద్యార్థులు అంటున్నారు.

కాలేజీ హాస్టల్‌లో భోజనం తెమ్మని ఒత్తిడి:  

మూడు రోజుల క్రితమే యాంటీ ర్యాగింగ్ పేరుతో మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినా మార్పు రాలేదు. ఇంతలోనే ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం అని జూనియర్లు అంటున్నారు. సీనియర్లు తాము చెప్పిన యాప్స్‌నే ఫోన్లలో వేసుకోవాలని, కాలేజీ హాస్టల్‌లో మెస్‌కి వెళ్లి భోజనం తెప్పించుకోవడంతో పాటు ప్లేట్లు కడగాలని ఒత్తిడి చేస్తున్నారని జూనియర్లు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: నడుంనొప్పి కంటిన్యూగా వస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు

అంతేకాకుండా హాస్టల్‌ళోనే సిగరెట్లు, మద్యం తాగుతూ ఇబ్బంది కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఫిర్యాదు చేస్తే అధికారులు వచ్చేలోపే అంతా అప్రమత్తం అవుతున్నారని జూనియర్లు అంటున్నారు. అయితే కర్నూలు మెడికల్‌ కాలేజీలో 14వ తేదీ నుంచి ఫస్టియర్‌ క్లాసులు ప్రారంభమయ్యాయి. సీనియర్లు తరగతిగదుల్లోకి గుంపులుగా వచ్చి ర్యాగింగ్‌ చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఈ రైలులో మీరు ఎంత తిన్నా ఫ్రీ.. పైసా కట్టక్కర్లేదు

యాజమాన్యానికి విజ్ఞప్తి..

గతంలో కాలేజీల్లో ర్యాగింగ్‌ బూతానికి ఎంతోమంది విద్యార్థులు బలయ్యారు. అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మా పిల్లలు మంచిగా చదువుకుని ఉన్నత ఉద్యోగం చేయాలి. కానీ ఇలా ర్యాగింగ్‌ వేధింపులతో విద్యార్థులని ఇబ్బంది పెడితే వారి భవిష్యత్‌కి.. చదువుకు ఆటంకం కలిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అంతేకాకుండా ర్యాగింగ్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుందంటున్నారు. జూనియర్లు సైతం కాలేజీకి రావాలంటే భయపడే పరిస్థితులు ఉంటున్నాయి. కాలేజీ యాజమాన్యాలు ర్యాగింగ్‌ను నివారించకపోతే, అరికట్టకపోతే పోలీసులను ఆశ్రయిస్తామని, కేసులు పెడతామని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి:  ఫ్యాట్‌ మొత్తం కరిగించే అద్భుతమైన పండ్లు ఇవే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizianagaram : చెల్లికి ఆస్తిలో వాటా.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్ది గుద్ది చంపిన కొడుకు!

ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నకొడుకు తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో రాజశేఖర్‌ అనే యువకుడు పలుమార్లు తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. తాజాగా మరోసారి వాగ్వాదం జరగడంతో ట్రాక్టర్‌తో గుద్ది చంపేశాడు.

New Update
vizianagaram man

vizianagaram man

ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ కొడుకు కన్న తల్లిదండ్రులనే హతమార్చాడు. కని పెంచిన ప్రేమను మరచి.. కసాయివాడిలా ప్రవర్తించాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

ట్రాక్టర్‌తో గుద్ది హత్య

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలులో అప్పలనాయుడు, జయ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఒక కుమార్తె, కుమారుడు రాజశేఖర్ ఉన్నారు. అయితే తమ వాటాలోని సగం ఆస్తిని గతంలో తమ కూతురి పేరుమీద రాశారు తల్లిదండ్రులు. అప్పటి నుంచి రాజశేఖర్ తన తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

తాను ఉంటుండగా.. తన చెల్లికి వాటా ఇవ్వడమేంటని కోపంతో రగిలిపోయాడు. ఇదే విషయంపై రాజశేఖర్ తన తల్లిదండ్రులతో గత కొంతకాలంగా గొడవలు పడుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి సాగుతున్న ఈ వివాదం.. తాజాగా ఉగ్రరూపం దాల్చింది. తమ కుమార్తెకు ఇచ్చిన భూమిని రాజశేఖర్ స్వాధీనం చేసుకుని చదును చేస్తున్నాడు. అదే సమయంలో తల్లిదండ్రులు అతడిని అడ్డుకున్నారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తన కోపాన్ని ఆపుకోలేక కొడుకు రాజశేఖర్.. తండ్రి అప్పలనాయుడు (55), తల్లి జయ (45)లను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడు. ఈ విషయం తెలిసి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

crime news | latest-telugu-news | telugu-news | AP Crime | ap-crime-news

Advertisment
Advertisment
Advertisment