/rtv/media/media_files/2025/02/18/4rq4prfTGiMLUZbAFZXZ.jpg)
Vallabhaneni Vamsi
Vallabhaneni Vamsi : కిడ్నాప్, దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరిస్తున్నారు. సాంకేతిక ఆధారాలన్నీ పక్కాగా తీసుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్ రాయదుర్గం(Hyderabad Rayadurgam)లో వంశీ నివసిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ వద్ద సీసీ కెమెరాల్లో ఫుటేజీని తీసుకున్నారు. ఇందులో పలు కీలక ఆధారాలు లభించాయి. సత్యవర్ధన్ను విశాఖకు తీసుకెళ్లి తొలుత చేబ్రోలు శ్రీనుకు చెందిన ఫ్లాట్లో ఉంచారు. అనంతరం హోటల్కు తరలించారు. ఈ రెండుచోట్లా సీసీ కెమెరాల్లో వంశీ అనుచరులు సత్యవర్ధన్ను తీసుకెళ్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. వీటిని విజయవాడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం స్వాధీనం చేసుకుంది.
Also Read: సీఈసీ ఎంపికపై కమిటీ భేటి.. ఆయనకే బాధ్యతలు అప్పగిస్తున్నారా ?
మరోవైపు వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో టీడీపీ కీలక ఆధారాలు బయట పెట్టింది. పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో టీడీపీ సీసీ ఫుటేజ్ ని భయట పెట్టింది. హైదరాబాద్ లోని రాయదుర్గంలో వల్లభనేని వంశీ నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ లోని సీసీ ఫుటేజ్ తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. ఈ ఫుటేజ్ వంశీ కేసులో కీలకంగా మారింది.సత్యవర్ధన్ తో కలిసి వంశీ లిఫ్ట్ లో వెళుతున్న ఫుటేజ్ను టీడీపీ విడుదల చేసింది. వంశీతో పాటు ఆయన అనుచరులు సత్యవర్ధన్ను తన ఇంటికి తీసుకెళ్తున్న దృశ్యాలు అందలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈనెల 11న 9.53 నిమిషాలకు వెళ్తున్నట్లు సీసీ ఫుటేజ్లో రికార్డయింది.
Also Read: బాలరాముడికి భారీగా విరాళాలు.. అమోధ్య రామమందిరం ఆదాయం దేశంలోనే
ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు..
ఈ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితుడు వంశీని 10 రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి ఇంకా చాలా విషయాలు వెలికితీయాల్సి ఉందని, చాలా మంది నిందితులు దొరకలేదని ఆ పిటిషన్లో వివరించారు. పిటిషన్లో సాంకేతిక దోషాలున్నాయని న్యాయాధికారి చెప్పడంతో వెనక్కి తీసుకుని, సరిదిద్ది మళ్లీ దాఖలు చేశారు. అనంతరం ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేయాలని న్యాయాధికారి ఆదేశించారు. కేసు నాలుగో ఏసీజేఎం కోర్టు నుంచి ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు సోమవారం బదిలీ అయింది.
Also Read: ఏపీలో భారీగా జీబీఎస్ కేసులు.. ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సంచలన ప్రకటన!
Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?
MLC kavitha: పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం... ఎమ్మెల్సీ కవిత సంచలనం!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ వ్యాఖ్యలపై స్పందనేంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు.
kavitha-pawan
MLC kavitha: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ వ్యాఖ్యలపై స్పందనేంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు. దురదృష్టవశాత్తూ పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారని..చేగువేరా ఆదర్శాలు నచ్చిన వ్యక్తి ఇప్పుడు రైటిస్ట్ (బీజేపీ మద్దతుదారు) ఎలా అయ్యారని కవిత ప్రశ్నించారు.
Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..
పార్టీ పెట్టిన 15 ఏళ్లకు పవన్ ఎమ్మెల్యే అయ్యారని.. వైసీపీ మినహా దాదాపు ఏపీలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయన్న కవిత... రేపు తమిళనాడు వెళ్లి హిందీ ఇంపోజ్ చేయబోమనైనా ఆయన చెప్పొచ్చు అని ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
పవన్ కల్యాణ్ అభిమానులు ఫైర్!
అయితే కవిత కామెంట్స్ పై జనసేన నేతలు, పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఊతికారేస్తున్నారు. కవితకు ఏ అర్హత ఉందని పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. గతంలో లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టైన విషయాన్ని గుర్తుచేస్తూ ఇలాంటి స్కామ్ లు చేస్తేనే సీరియస్ పొలిటీషియన్ అన్నట్లా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
Also Read: కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి.. రేవంత్కు బండి సంజయ్ కౌంటర్
Also Read: Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!
Vishwambhara: విశ్వంభర ఫస్ట్ సాంగ్ దింపుతున్నారు.. గెట్ రెడీ!
Madya Pradesh: ఊళ్ళో నీటి కరువుతో భర్తను వదిలేసిన భార్య!
చెప్పిన మాట వినలేదని.. కన్న కూతురిని గొంతు గోసి.. దారుణానికి ఒడిగట్టిన తల్లి?
🔴Live News Updates: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు
జైలులోని 15 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్