జనసేన కీలక నిర్ణయం.. కిరన్‌ రాయల్‌ను పార్టీకి దూరంగా ఉంచుతూ ఆదేశాలు

ఓ మహిళను మోసం చేశారంటూ తిరుపతి జనసేన పార్టీ ఇంఛార్జ్‌ కిరణ్‌ రాయల్‌పై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు ఆయన్ని దూరంగా ఉంచుతూ జనసేన తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

New Update
Kiran Royal

Kiran Royal

జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ కార్యక్రమాలకు కిరణ్ రాయల్‌ను దూరంగా ఉంచుతూ ఆదేశాలు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా తిరుపతి జనసేన పార్టీ ఇంఛార్జ్‌ కిరణ్‌ రాయల్‌పై వ్యక్తిగత ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జనసేన ఈ నిర్ణయం తీసుకుంది. ఆయనపై ఉన్న ఆరోపణలపై క్షుణ్ణంగా విచారించి నిర్ణయం తీసుకునే వరకు పార్టీ నుంచి దూరం చేస్తున్నట్లు ప్రకటన జారీ చేసింది. 

Also Read: ఛత్తీస్‌గఢ్‌లో 31 మంది మావోయిస్టులు మృతి.. అమిత్ షా సంచలన ప్రకటన

అలాగే ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించి.. సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగత విషయాలను పక్కకు పెట్టాలని జనసేన శ్రేణులకు సూచనలు చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా.. కిరణ్ రాయల్ చేసిన మోసం గురించి చెబుతూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో సంచనలం రేపిన సంగతి తెలిసిందే. 

Also Read: సూర్యాస్తమయం తర్వాత మహిళలను అరెస్టు చేయొచ్చు.. హైకోర్టు సంచలన తీర్పు

రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కొట్టేసి తనను ఆర్థిక ఇబ్బందుల్లో పడేశాడని.. అందుకే తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు లక్ష్మీ అనే మహిళ ఆ వీడియోలో మాట్లాడింది. ఆ తర్వాత బాధిత మహిళతో కిరణ్ రాయల్ సన్నిహితంగా ఉన్న మరో వీడియో కూడా బయటపడింది. దీంతో ఆయన ఇంటిని మహిళలు ముట్టడించారు. కిరణ్ రాయ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన.. ఆయన్ని పార్టీకి దూరంగా ఉంచుతూ ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: టాలీవుడ్ To పాలిటిక్స్ ఎవరిని వదలని మస్తాన్ సాయి: టోటల్ లిస్ట్ ఆడియో వైరల్!

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vizianagaram : చెల్లికి ఆస్తిలో వాటా.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్ది గుద్ది చంపిన కొడుకు!

ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నకొడుకు తల్లిదండ్రులను దారుణంగా హత్య చేశాడు. ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో రాజశేఖర్‌ అనే యువకుడు పలుమార్లు తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. తాజాగా మరోసారి వాగ్వాదం జరగడంతో ట్రాక్టర్‌తో గుద్ది చంపేశాడు.

New Update
vizianagaram man

vizianagaram man

ఏపీలోని విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం ఓ కొడుకు కన్న తల్లిదండ్రులనే హతమార్చాడు. కని పెంచిన ప్రేమను మరచి.. కసాయివాడిలా ప్రవర్తించాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

ట్రాక్టర్‌తో గుద్ది హత్య

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం నడిపూరికల్లాలులో అప్పలనాయుడు, జయ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఒక కుమార్తె, కుమారుడు రాజశేఖర్ ఉన్నారు. అయితే తమ వాటాలోని సగం ఆస్తిని గతంలో తమ కూతురి పేరుమీద రాశారు తల్లిదండ్రులు. అప్పటి నుంచి రాజశేఖర్ తన తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

తాను ఉంటుండగా.. తన చెల్లికి వాటా ఇవ్వడమేంటని కోపంతో రగిలిపోయాడు. ఇదే విషయంపై రాజశేఖర్ తన తల్లిదండ్రులతో గత కొంతకాలంగా గొడవలు పడుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి సాగుతున్న ఈ వివాదం.. తాజాగా ఉగ్రరూపం దాల్చింది. తమ కుమార్తెకు ఇచ్చిన భూమిని రాజశేఖర్ స్వాధీనం చేసుకుని చదును చేస్తున్నాడు. అదే సమయంలో తల్లిదండ్రులు అతడిని అడ్డుకున్నారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తన కోపాన్ని ఆపుకోలేక కొడుకు రాజశేఖర్.. తండ్రి అప్పలనాయుడు (55), తల్లి జయ (45)లను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడు. ఈ విషయం తెలిసి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. దీంతో ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

crime news | latest-telugu-news | telugu-news | AP Crime | ap-crime-news

Advertisment
Advertisment
Advertisment