Suryalanka Beach : కేంద్రం గుడ్‌ న్యూస్.. ఏపీలోని ఆ బీచ్‌కు మహర్దశ..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్రాభివృద్ధికి వరుస శుభవార్తలు చెబుతోంది. పలు ప్రాజెక్టులకు అవసరమైన నిధులను విడుదల చేస్తోంది. అందులో భాగంగా మరో  శుభవార్త వినిపించింది. సూర్యలంక బీచ్ అభివృద్ధికి నిధులు విడుదల చేసింది.

New Update
Suryalanka Beach

Suryalanka Beach

Suryalanka Beach: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్రాభివృద్ధికి వరుస శుభవార్తలు చెబుతోంది. పలు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులను విడుదల చేస్తోంది. అందులో భాగంగా మరో  శుభవార్త వినిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి నిధులు విడుదల చేసింది. స్వదేశీ దర్శన్ పథకం 2.0 కింద ఏపీలోని సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.97.52 కోట్లు విడుదల చేసినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ నిధులతో పాటుగా మరిన్ని నిధులతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సూర్యలంక బీచ్‌ రూపురేఖలు మారుస్తామని కందుల దుర్గేష్ వెల్లడించారు.

Also Read: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!

మరోపైపు కందుల దుర్గేష్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సూర్యలంక బీచ్‌కు నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ క్రమంలోనే కేంద్రం నుంచి సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు విడుదల కావటం విశేషం.

Also Read:  పోలీసులు కాదు రాక్షసులు.. పసివాడిపై థర్డ్ డిగ్రీ.. ప్రాణం పోయేలా కొట్టి!

సూర్యలంక బీచ్‌నే బాపట్ల బీచ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. బంగాళాఖాతం తీరంలో ఉండే ఈ బీచ్‌కు వారాంతాల్లో పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. బాపట్లకు సుమారుగా 9 కిలోమీటర్ల దూరంలో ఈ సూర్యలంక బీచ్ ఉంటుంది. పర్యాటకుల కోసం ఇక్కడ రిసార్టులు కూడా నిర్మించారు. సూర్యలంక బీచ్ ఉదయం, సాయంత్రం వేళల్లో చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే సముద్రస్నానం చేయడానికి, సూర్యాస్తమయం ఆస్వాదించడానికి అనువైన ప్రదేశం. పర్యాటకుల కోసం ఇక్కడ జెట్ స్కీయింగ్, బోటింగ్, ఇతర క్రీడలు కూడా అందుబాటులో ఉన్నాయి. చల్లటి వాతావరణం, ప్రకృతి అందాలు చూసేందుకు ఈ బీచ్ ఉత్తమమైన ప్రదేశం.

Also Read: వినియోగదారులకు షాక్.. పెరిగిన పాల ధరలు.. ఎంతంటే ?

ఇక సూర్యలంక బీచ్‌కు సమీపంలోనే బాపట్ల భావనారాయణస్వామి ఆలయం, గుంటూరు నగరం ఉంది. సూర్యలంక బీచ్‌కు రావాలంటే బాపట్లకు చేరుకుని అక్కడి నుంచి బస్ లేదా కారులో సూర్యలంక బీచ్‌కు చేరుకోవచ్చు. అలాగే గుంటూరురైల్వే స్టేషన్ నుంచి కూడా సులభంగా చేరుకోవచ్చు. సూర్యలంక బీచ్‌ను ఏడాదిలో ఎప్పుడైనా సందర్శించవచ్చు. కానీ మార్చి నుంచి జూన్ అలాగే నవంబర్ నుంచి మధ్య మంచి వాతావరణం ఉంటుందని స్థానికులు చెప్తున్నారు.

Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala : ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

New Update
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanam

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉత్సవమూర్తులకు అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గం. వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. 9గం. నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకాన్ని, పురస్కరించుకుని, రాత్రి 8 నుంచి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!


ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం :


ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 8న శ్రీరామ పట్టాభిషేకం :


ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌సంతోత్సవం, ఆస్థానం నిర్వహించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 10 నుండి 12 వరకు తెప్పోత్సవాలు :


శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు