Half Day Schools : స్కూల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఆ రోజు నుంచే ఒంటిపూట బడులు

చలికాలం అలా వెళ్లిందో లేదో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడు భగభగలాడుతున్నాడు. దీంతో సామాన్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఒకవైపు అన్ని తరగతుల పరీక్షలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం ఒంటిపూట బడి మీదా ఫోకస్‌ పెట్టింది.

New Update
Half Day Schools

Half Day Schools

Half Day Schools : చలికాలం అలా వెళ్లిందో లేదో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే బానుడు భగభగలాడుతున్నాడు. దీంతో సామాన్యులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఒకవైపు అన్ని తరగతుల పరీక్షలు దగ్గరపడుతుండటంతో ప్రభుత్వం ఒంటిపూట బడి మీదా ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే రంజన్‌ పండగ నేపథ్యంతో తెలంగాణ రాష్ట్రంలోని ఉర్దూ విద్యార్ధులకు ఒంటి పూట బడులు ప్రారంభమైనాయి. మరో వారం రోజుల్లో అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు పెట్టే అవకాశం ఉంది. 

Also Read: చిరుత, సింహం పిల్లలతో ప్రధాని మోదీ.. వీడియో వైరల్

అటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ ఎండల తీవ్రంగా నానాటికీ పెరుగుతుంది. మార్చి ప్రారంభం ముందు నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసిందట. అయితే ఎండల తీవ్ర పెరుగుతున్నందున ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. 

Also Read: రాష్ట్ర ప్రభుత్వాలు అందులో విఫలమయ్యాయి.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దీంతో మార్చి 15 నుంచే ఒంటి పూట బడులు ప్రారంభమయ్యే ఛాన్స్‌ కనిపిస్తుంది. మరోవైపు మునుపెన్నడు లేనివిధంగా ఈ సారి ఎండ‌లు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుంద‌ని, వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేస్తోంది. వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. ఒంటిపూట బడులు వీలైనంత త్వరగా ప్రారంభించాలనే ఆలోచనలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్నాయి.

Also Read: Software Engineer:  గోవాలో పెళ్లి.. హైదరాబాద్లో సూసైడ్.. ఆర్నెళ్లకే నవవధువు జీవితం నాశనం!

కాగా గతేడాదిలో మార్చి 18వ తేదీ నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి మార్చి 15వ తేదీ నుంచే ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తే.. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఒంటిపూట బడులు నిర్వహిస్తారు. దీంతో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకే తరగతులు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఇక ఒంటిపూట బడులపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఏపీ లాగే 15 నుంచే ఒంటిపూట బడులు నిర్వహిస్తారా? లేక ఆ తర్వాతనా అనేది తేలాల్సి ఉంది.

Also Read: Bangladesh: బంగ్లాదేశ్ యూటర్న్.. భారత్ తో సంబంధం తప్ప వేరే దారి లేదంటూ ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Krishna River : పండుగ పూట విషాదం...కృష్ణానదిలో ఈతకు వెళ్లి..

పండగ సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానాల కోసం కృష్ణ నదిలోకి దిగారు. ఈత రాకపోవడంతో ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు

New Update
Krishna River Tragedy

Krishna River Tragedy

Krishna River :   శ్రీరామ నవమి వేళ కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ముగ్గురు చిన్నారులు కృష్ణా నదిలో దిగి గల్లంతైన ఘటన అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో చోటు చేసుకుంది. పండగ సందర్భంగా మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానాల కోసం కృష్ణ నదిలోకి దిగారు. మత్తి వర్ధన్(16), మత్తి కిరణ్(15), మత్తి దొరబాబు(15).. ఆదివారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. అయితే ముగ్గురు బాలురు కూడా ఆలా ఈతకొడుతూ లోతును గమనించకుండా ముందుకు వెళ్లారు.

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు! 

 బాలురు స్నానానికి వెళ్లిన సమయంలో అయితే వారితోపాటు పెద్దలెవ్వరూ లేకపోవడంతో వీరంతా ఈత కొట్టుకుంటూ నది లోపలికి వెళ్లి మునిగిపోయారు. ముగ్గురికీ కూడా పూర్తిగా ఈత రాకపోవడం, లోతు మీదా అవగాహనలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. చిన్నారుల అరుపులు విని స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. అయినా పరిస్థితి అప్పటికే చేయిదాటి పోయింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు.. స్థానికులు, గజ ఈతగాళ్ల సహాయంతో ముగ్గురు చిన్నారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

కాగా, అతి కష్టం మీద మత్తి కిరణ్ మృతదేహం లభ్యమైంది. దీంతో పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తమ కుమారులు నదిలో పడిపోడవంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి. ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మరోవైపు గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు గల్లంతు కావడంతో మోదుముడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

Advertisment
Advertisment
Advertisment