Child Trafficking : పసికందులను విక్రయించే ముఠా అరెస్ట్‌

అమ్మ కడుపు నుంచి బయటకొచ్చి రోజులు కూడా కాలేదు.. ఆ పసికందులు అంగడి సరుకయ్యారు. తల్లిఒడిలో పెరగాల్సిన ఆ చిన్నారులను ఏకంగా దళారులు అమ్మేస్తున్నారు. నాలుగైదు రోజుల వయసు కూడా నిండని పిల్లలను విక్రయిస్తున్న ముఠాగుట్టును విజయవాడ పోలీసులు రట్టుచేశారు.

New Update
Child Trafficking

Child Trafficking

Child Trafficking: అమ్మ కడుపు నుంచి బయటకొచ్చి రోజులు కూడా కాలేదు.. ఆ పసికందులు అంగడి సరుకయ్యారు. తల్లిఒడిలో పెరగాల్సిన ఆ చిన్నారులను ఏకంగా దళారులు అమ్మేస్తున్నారు. నాలుగైదు రోజుల వయసు కూడా నిండని పిల్లలను విక్రయిస్తున్న ముఠాగుట్టును విజయవాడ పోలీసులు రట్టుచేశారు. ఆస్పత్రులలో పసి కందులను ఎత్తుకెళ్లి అమ్ముకునే ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్, పోలీసు టీం సంయుక్తంగా ఈ కీలక కేసు  మిస్టరీ ని చేధించినట్లు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. ముఠా సభ్యులైన సరోజిని, షేక్ ఫరీనా, షైదా బీ, కరుణ శ్రీ, శిరీష లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Also Read: పక్కన ఇద్దరుండగానే మూడో వాడికి ముద్దులు.. మద్యం మత్తులో యువతి హల్ చల్!

నిందితులనుంచి ముగ్గురు పసికందులను తీసుకొచ్చి కన్న తల్లులకు అప్పగించినట్లు వెల్లడించారు. సరోజిని ఇప్పటి వరకు ఏడుగురు పసి కందులను  అమ్మినట్లు గుర్తించామని రాజశేఖర్‌ బాబు తెలిపారు. వారిలో ముగ్గురిని గుర్తించి పసికందులను తీసుకొచ్చామన్నారు. జైలులో విజయలక్ష్మి, సరోజినిలకు పరిచయం ఏర్పడిందని తద్వారా ఈ అమ్మకాలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. పసికందులను లక్ష నుంచి మూడు లక్షల రూపాయలకు అమ్ముతున్నారని గుర్తించామన్నారు. అరెస్టు చేసిన సమయంలో వారి నుంచి నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Also Read: హిందూ అమ్మాయితో పెళ్లి.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన లాయర్లు!

భేటీ కిరణ్, అనిల్ అనే నార్త్ ఇండియన్స్ కి వారు  బిడ్డలను అమ్మినట్లు గుర్తించామన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్ లో పిల్లలను అమ్మినట్లు గుర్తించామని తెలిపారు. సరోజినికి మొదటి నుంచీ క్రిమినల్ హిస్టరీ ఉందన్న సీపీ. చదివింది ఏడో తరగతి అయినా దొంగతనాల్లో ఆరి తేరిందని తెలిపారు. గతంలో‌ కూడా  వారి పై అనేక కేసులు ఉన్నాయని,ఈ గ్యాంగ్ లో ఏడుగురు కీలక‌పాత్రధారులుగా ఉన్నారని సీపీ వివరించారు. ఐదుగురిని ఇప్పటి వరకు అరెస్టు చేశామని, త్వరలో మిగిలిన వారిని కూడా అరెస్టు చేసి.. ఈ పసి కందుల విక్రయాల వివరాలు పూర్తిగా అందిస్తామన్నారు. ఈ సందర్భంగా కేసును చేధించిన లతా రాయ్ ల, స్రవంతి టీం లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Also Read: ఈశా ఫౌండేషన్‌కు బిగ్‌ రిలీఫ్‌.. సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Also Read: తాగొచ్చి కొట్టేవాడు...ఇంటినుంచి గెంటేశాడు.. మానవ్ శర్మ భార్య సంచలన కామెంట్స్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTDలో నిజంగానే 100 ఆవులు చనిపోయాయా?: చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన!

TTD ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో 100 ఆవులు చనిపోయాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చైర్మన్ BR నాయుడు స్పష్టం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి కల్పిత ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను ఇక్కడివిగా చిత్రీకరిస్తున్నారన్నారు.

New Update
TTD Cows Death

TTD Chairman Reaction Over Cows Death

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిర్వహించబడుడున్న ఎస్వీ గోశాలలో దాదాపు 100 గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిన్న ఆరోపించిన విషయం తెలిసిందే. అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఆ ఆవులు చనిపోతున్నాయని.. ఇది మహా అపచారం అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆవులకు సంబంధించిన ఫొటోలను సైతం కరుణాకర్ రెడ్డి విడుదల చేశారు. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. కరుణాకర్ రెడ్డి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి కల్పిత ఆరోపణలు అత్యంత విషాదకరమన్నారు. శ్రీవారి సేవలో నిమగ్నమై, హిందూ ధర్మ పరిరక్షణకు అంకితభావంతో టీటీడీ ట్రస్ట్ బోర్డు చేపడుతున్న పుణ్య కార్యక్రమాల పట్ల కంటకింపుతో ఈ తరహా చర్యలకు దిగడం చాలా బాధాకరమనర్నారు.

గోమాతకు హిందూ ధర్మంలో ఉన్న ప్రాముఖ్యత అనన్య సాధారణమన్నారు. వేదకాలం నుంచే గోమాతను దేవతలతో పూజిస్తూ వస్తున్నామన్నారు. ఏ ఒక్క గోవు యొక్క మృతి కూడా సామాన్యంగా తీసుకోలేమన్నారు. కానీ సహజంగా తప్పని అనారోగ్యం, వృద్ధాప్యం, ప్రమాదాలు వంటి కారణాల వల్ల  గోవుల మృతి జరిగే అంశాన్ని రాజకీయంగ, అబద్ధ ప్రచారానికి వాడుకోవడం అత్యంత అధర్మమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతర ప్రాంతాల్లోని ఫొటోలను ఇక్కడివిగా..

ఇంకా దుర్మార్గంగా, ఇతర ప్రాంతాల్లో చనిపోయిన గోవుల ఫోటోలను టీటీడీ గోశాలకు చెందినవిగా  చిత్రీకరించి ప్రజలను మోసగించేందుకు చేస్తున్న కుట్ర బాధాకరమన్నారు. ఇలాంటి వదంతులను ప్రజలు గుర్తించి, అవాస్తవాలపై నమ్మకం కలిగి మోసపోవద్దని కోరారు. గోసేవా అంటేనే గోదేవి సేవ అని అన్నారు. ఈ పవిత్రమైన సేవను రాజకీయ లబ్ధి కోసం మచ్చలేసే ప్రయత్నాలను భక్తులందరూ తిరస్కరించాలన్నారు. శ్రీవారి ఆశీస్సులతో, హిందూ ధర్మ పరిరక్షణలో టీటీడీ చేపడుతున్న గోరక్షణ, గోపోషణ కార్యక్రమాలపై భక్తుల విశ్వాసం మరింత బలపడాలని ఆకాంక్షించారు. 

(br naidu ttd chairman | telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment