Alla Nani : టీడీపీలోకి వైసీపీ కీలక నేత..చంద్రబాబు గ్రీన్ సిగ్నల్...

ఏపీలో అధికారం కోల్పొయిన వైసీపీ కి మరో షాక్‌ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారికంగా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితం వైసీపీ పార్టీకి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

New Update
Alla Nani

Alla Nani

Alla Nani  :  ఏపీలో అధికారం కోల్పొయిన వైసీపీ కి మరో షాక్‌ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారికంగా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని మూడు నెలల క్రితం పార్టీకి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి ఎవరికీ అందుబాటులో లేని ఆళ్ల నాని టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిల్ ఎక్కబోతున్నారని కార్యకర్తలు స్పష్టం చేస్తు్న్నారు. నిజానికి మూడు రోజుల క్రితమే ఆయన టీడీపీలో చేరుతారని ప్రచారం సాగింది. అయితే నాని చేరికను పలువురు టీడీపీ నేతలు వ్యతిరేకించడంతో చేరిక వాయిదా పడింది. అయితే తాజాగా చంద్రబాబు ఆయన చేరికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ సభ్యత్వం తీసుకున్న నాని అన్ని అనుకూలిస్తే రేపు చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆళ్ల నాని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.

Also Read: పార్లమెంటులో కొత్త ఐటీ బిల్లు-2025ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్

గత కొన్ని నెలలుగా ఆయన టీడీపీలో చేరతారని టాక్ నడుస్తోంది. అయితే నాని చేరికపై టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆయన చేరికతో కేడర్‌లో మరింత అసంతృప్తి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ ఆలోచనలో పడింది. దీంతో ఇప్పటికే పలుమార్లు ఆళ్ల నాని టీడీపీలో చేరిక అంశం వాయిదా పడుతూ వచ్చింది. మరోమారు నానిని పార్టీలోకి తీసుకోవాలా వద్దా అనే విషయంపై అధిష్టానం పునరాలోచనలో పడింది. కానీ మొత్తానికి ఆళ్ల నాని టీడీపీ నేతలతో చర్చలు జరపగా.. గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వకపోయినా.. పార్టీలో స్వచ్ఛందంగా చేరేందుకే నాని ఓకే చెప్పినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

 ఆళ్ల నాని చేరిక అంశంపై టీడీపీలో మొదటి నుంచి చర్చ నడుస్తూనే ఉంది. 2024 ఎన్నికల్లో ఏలూరులో 60 వేలకు పైగా మెజారిటీతో గెలిచిన టీడీపీకి వైసీపీ నాయకుల అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. గతంలో అధికారంలో ఉండగా.. టీడీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన ఆళ్ల నాని.. ఇప్పుడు టీడీపీలో చేరడానికి ఎలా ఓకే చెబుతామని ఏలూరులో పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆళ్ల నాని 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జగన్ ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఆళ్ల నానికి ఏలూరు నుంచి వైసీపీ టికెట్ ఇచ్చారు జగన్. ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆళ్ల నాని.. జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా రెండున్నరేళ్ల పాటూ పనిచేశారు. ఇక గత ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొదట్లో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ చివరకు తెలుగు దేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడంతో సైకిల్ ఎక్కబోతున్నట్టు క్లారిటీ వచ్చింది. 

Also Read :  ముందుకూ, వెనక్కూ ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్లు

Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime News : అక్క ఇంటికే కన్నం వేసిన చెల్లెలు...లక్షల విలువచేసే బంగారంతో…

ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో దుర్భిద్ధి పుట్టింది. దాంతో అక్క ఇంటికే కన్నం వేసిందో చెల్లెలు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది సంఘటన.

New Update
Nidadavole Police Station

Nidadavole Police Station

AP Crime News : ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు.. మరోవైపు సొంత అక్క ఆర్థికంగా బాగుండంతో దుర్భిద్ధి పుట్టింది. దాంతో అక్క ఇంటికే కన్నం వేసిందో చెల్లెలు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి చోరీ కేసును ఛేదించారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగింది సంఘటన. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిడదవోలులోని ఎంవీనగర్ దానమ్మ గుడివద్ద గల లలితదేవి అనే మహిళ ఇంట్లో చోరీ జరిగింది. సుమారు రూ.12,50,000 విలువ చేసే బంగారంతో పాటు రూ.10000 నగదు చోరికి గురైంది. లలితదేవి బయటకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం, ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటంతో పాటు నగలు చోరీ జరిగినట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి క్లూస్ సేకరించారు.

Also Read: 'ప్రభాస్'ని పక్కన పెట్టి అలియా భట్ తో నాగ్ అశ్విన్ మూవీ..!

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

కాగా పోలీసులు అన్ని రకాలుగా విచారించి చోరి చేసింది లలితాదేవి చెల్లెలే అని నిర్ధారించారు. ఇటీవల నిడదవోలులోని అక్క ఇంటికి వచ్చిన చెల్లెలు లక్ష్మీ శైలజ. అప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న శైలజ అక్క ఇంట్లో డబ్బు, బంగారం చూడగానే దుర్భిద్ది పుట్టింది. దీంతో మరో రోజు పగడ్భందిగా ప్లాన్ చేసింది. చేసి అక్క బావ ఇంట్లో లేనప్పుడు చూసి మరో ఇద్దరు సాయంతో అక్క ఇంట్లో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడింది. అక్క ఇంటికి రాగానే ఇల్లంతా చిందర వందరంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా చెల్లెలును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మరో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుంచి నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment