AP : నేడే వారాహి విజయభేరి మోగించనున్న పవన్!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నాలుగు రోజులు పిఠాపురంలోనే బస చేయనున్నారు. పురోహుతిక అమ్మవారిని దర్శించుకుని శక్తిపీఠంలో వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురం నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. నాలుగు రోజులు పిఠాపురంలోనే బస చేయనున్నారు. పురోహుతిక అమ్మవారిని దర్శించుకుని శక్తిపీఠంలో వారాహికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్ తగిలింది. పార్టీలో కీలకనేతగా ఉన్న పితాని బాలకృష్ణ.. జనసేన క్రీయాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఆయన ఇక్కడ నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్నారు. రేపటి నుంచి ఏప్రిల్ 12వరకు పవన్ తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పూర్తి షెడ్యూల్ కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
అనపర్తిలో తెలుగు తమ్ముళ్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. అసెంబ్లీ సీటు బీజేపీకి కేటాయించడంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు భగ్గుమంటున్నారు. టీడీపీ కరపత్రాలను జెండాలను పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. టికెట్ నల్లమిల్లికే ఇవ్వాలని ఆందోళన చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. పొత్తులో భాగంగా మొదట నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించారు. అయితే, ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా ములగపాటి శివ కృష్ణంరాజును ప్రకటించడంతో నల్లమల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ పై రూ. 10 కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు రాజమండ్రి వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్. అభివృద్ధి పనుల్లో 25 శాతం కమీషన్లు తీసుకుంటున్నానని కరపత్రాలు పంచుతూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. తాజాగా బీజేపీ మరో అసెంబ్లీ సీటు కోసం డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. సోము వీర్రాజు కోసం అనపర్తికి బదులుగా రాజమండ్రి సిటీ లేదా రూరల్లో ఏదో ఒకటి బీజేపీ అడుగుతున్నట్లు తెలుస్తోంది.
ఏలూరులో టీడీపీకి బిగ్ షాక్ తగిలే ఛాన్స్ కనిపిస్తోంది. మాజీ ఎంపీ మాగంటి బాబు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో వైసీపీ నేతలతో మాగంటి మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. పుట్టా మహేష్ యాదవ్కు టీడీపీ ఎంపీ టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.
టీడీపీకి బీజేపీ బిగ్ షాక్ ఇచ్చింది. అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా సోము వీర్రాజు పేరు ప్రకటించింది. దీంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ఇప్పటికే అనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీ కేటాయించింది. అయితే, టీడీపీ అభ్యర్థిని కాదని బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది.