అంబాజీపేటలో జగన్ ప్రచారం-LIVE
అంబాజీపేటలో వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
అంబాజీపేటలో వైసీపీ అధినేత జగన్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీ కొని నలుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న శ్రీను, కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ సీఎం కావడం కోసం చేసిన ప్రయత్నం కారణంగా తాను ఐదేళ్లు జైల్లో మగ్గానని ఆవేదన వ్యక్తం చేశారు.
AP: టీడీపీకి రాజీనామా చేసిన యనమల కృష్ణుడు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 42 ఏళ్లు పార్టీ కోసం పని చేసిన తనను.. తణుకు టికెట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును ఓడించేందుకు... మరోసారి జగన్ను సీఎం అయ్యేందుకు కృషి చేస్తానని అన్నారు.
పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు మద్దతుగా ఆయన అన్న కుమారుడు, ప్రముఖ హీరో వరుణ్ తేజ్ ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్లాసు గుర్తుకు ఓటేసి మా బాబాయ్ ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఆయన ప్రచారం లైవ్ ను ఈ వీడియోలో చూడండి.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబాయ్ పవన్ కళ్యాణ్ తరుపున ప్రచారం చేసేందుకు పిఠాపురం చేరుకున్నారు. ముందుగా శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు.
పిఠాపురంలో కోట్ల విలువైన మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిఠాపురం, జగ్గయ్యచెరువు, కుమార్పురం, పద్మశాలిపేట, శ్రీదత్తనగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మద్యం నిల్వలు దొరికాయి. వీటి విలువ దాదాపు కోటికిపైగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
AP: డ్రైవర్ను చంపిన ఎమ్మెల్సీ ఆనంద్ బాబుపై ఇప్పటి వరకు చర్యలు లేవని అన్నారు పవన్. వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని.. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్పు కనిపిస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతోందని పేర్కొన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా పిఠాపురంలో మెగా ఫ్యామిలీ ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది. మే 5న నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం. రాంచరణ్, వరుణ్తేజ్ కూడా త్వరలో ప్రచార రంగంలోకి దిగనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.