AP: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ..హైటెన్షన్

కాకినాడ జిల్లాలో  హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.  అక్కడి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.  వైస్ ఛైర్మన్ పదవి కోసం టీడీపీ, వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ ఎన్నిక ఇప్పటికి మూడుసార్లు వాయిదా పడింది.

author-image
By Manogna alamuru
New Update
tension

High Tension At Tuni

తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. వైస్ ఛైర్మన్ పదవి కోసం టీడీపీ-వైసీపీ ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు చలో తుని పేరుతో వైసీపీ ఈరోజు బంద్ కు పిలుపునిచ్చింది. దీంతో రాజానగరంలో జక్కంపూడి రాజా ఇంటి దగ్గర ఉధృతి నెలకొంది. దీంతో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. తుని వెళ్ళొదద్దంటూ ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో వైసీపీ నేతలకు, పోలీసులకూ మధ్య  వాగ్వాదం జరిగింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అలాగే చైర్మన్ సుధారాణి ఇంటికి భారీగా చేరుకుంటున్న వైసీపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. మాజీమంత్రి కన్నబాబు, ముద్రగడ, వంగా గీతా, ద్వారంపూడిలను పోలీసులు  హౌస్ అరెస్ట్ చేశారు. 

తునిలో 144 సెక్షన్ అమలు..

ఇప్పటికే తుని మున్సిపల్ వైస్ ఛైర్మప్ ఎన్నికలుమూడుసార్లు వాయిదా పడ్డాయి. ఇక్కడ వైసీపీకి 18 మంది, టీడీపీకి 10 మంది సభ్యుల బలం ఉంది. దీంతో ఇరు పార్టీల మధ్యనా తీవ్ర పోటీ నెలకొంది.  మరోవైపు తునిలో సెక్షన్ 144 అమలు, ర్యాలీలకు అనుమతిలేదని పోలీసులు చెబుతున్నారు.  మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ 163(2) బీఎన్ఎస్ఎస్ చట్టం అమలు పర్చారు. ఐదుగురు వ్యక్తు కంటే ఎక్కువ గుమికూడద్దని ఆంక్షలు పెట్టారు. అలాగే ఆయుధాలు, కర్రలు, రాళ్లు, అగ్ని ప్రమాదాలు సంభవించే వస్తువులు, ఇతర ఆయుధాలు పట్టుకుని తిరగడాన్ని నిషేధించారు. ఈరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. 

నిన్న జరగాల్సిన తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. ఉదయం 11గంటలకు వైస్‌ చైర్మన్‌ ఎన్నిక జరగాల్సి ఉండగా, వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరు కాకుండా ఆ పార్టీకి చెందిన మున్సిపల్‌ చైర్మన్‌ ఇంట్లో నిర్బంధించారు. దీంతో ఎన్నిక నిలిచిపోయింది. అందుకే ఈరోజు అయినా ఎన్నికల జరుగుతుందో లేదో అని అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. 

Also Read: Hydra: అక్కడ ప్లాట్లు కొంటే పాట్లు తప్పవు...హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pawan: పవన్ ఇలాకా పిఠాపురంలో దారుణం.. దళితుల గ్రామ బహిష్కరణ.. పరిహారం అడగడమే పాపమా?

పవన్ ఇలాకా పిఠాపురం మల్లంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో పనిచేస్తూ కరెంట్ షాక్‌తో పల్లపు సురేష్ చనిపోయాడు. దీంతో న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగిన దళితులను అగ్రవర్ణ పెద్దలు గ్రామ బహిష్కరణ చేశారు. టిఫిన్, కిరాణ షాపు సరుకులు కూడా ఇవ్వట్లేదు.

New Update

Pawa Kalyan: ఏపీ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అగ్ర వర్ణాలు దళితులను గ్రామం నుంచి బహిష్కరించడం కలకలం రేపుతోంది. వస్తువులను విక్రయించరాదంటూ హుకుం జారీ చేయడంతో దుకాణదారులు అమ్మకాలు నిలిపివేశారు. ఓ ఇంటి దగ్గర విద్యుత్ పని చేస్తూ షాక్ తగిలి పల్లపు సురేష్ అనే వ్యక్తి చనిపోయాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు, దళితులు బాధితుడి కుటంబానికి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. దీంతో గ్రామం నుంచి బహిష్కరించారని దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్‌..ఒక్క క్లిక్ చాలు!

రంగంలోకి దిగిన ఆర్డీవో..

ఈనెల 16న అగ్రవర్ణానికి చెందిన వారి ఇంటి కరెంటు పనిచేస్తూ షాక్ తో పల్లపు సురేష్ చనిపోయాడు. సురేష్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ మల్లం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులు ధర్నా చేశారు. నష్టపరిహారంగా సుమారు రూ. 2 లక్షల 75 వేల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ తాము చేయని తప్పుకి నష్టపరిహారం ఎందుకు చెల్లించాలంటూ అగ్రవర్ణాల పెద్దలు వాదనకు దిగారు. దీంతో దళితులను దూరం పెట్టాలని నిర్ణయించగా.. వస్తువులను విక్రయించరాదంటూ అగ్రవర్ణాలు తీర్మానించాయి. ఆదేశాలు పాటించని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఇష్యూ మరింత ముదరడంతో పోలీసులు ఇరువర్గాలతో చర్చలు జరిపారు. స్వయంగా ఆర్డీవో రంగంలోకి దిగి దళితులు, అగ్రవర్ణాల వాదనలు విన్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చినట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో

pitapuram | dalith | village | issue | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment