/rtv/media/media_files/2024/10/20/CDUkyDWbGkjuiOdexZjU.jpg)
Free Gas Cylinders: ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించిన సందర్భంగా లబ్ధిదారులకు మరో కీలక ప్రకటన చేశారు. మహిళలు తొలుత డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండానే సిలిండర్ అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం లబ్దిదారులు డబ్బులు చెల్లిస్తే రెండు రోజుల్లో ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోందని అన్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల డైరెక్ట్ గా ఉచిత సిలిండర్ ఇవ్వలేకపోతున్నట్లు తెలిపారు. త్వరలోనే వాటిని పరిష్కరించి ఉచిత సిలిండర్ అందేలా చేస్తామని చెప్పారు. కాగా సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా నిన్న సీఎం చంద్రబాబు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మావోయిస్టుల హెచ్చరిక!
ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరి...
కాగా మొదటి గ్యాస్ సిలిండర్ అక్టోబర్ 31 నుండి మార్చి 31 లోగా బుక్ చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 48 గంటల్లోగా ఇంటికి గ్యాస్ సిలిండర్ అందేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ సబ్సిడీ మొత్తం లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తామన్నారు. ఈ పథకం పొందాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుండి జులై 31 లోగా రెండో సిలిండర్ బుక చేసుకునేలా అవకాశం కల్పించినట్లు చెప్పారు.
డిసెంబర్ 1 నుండి మార్చి 31 లోగా 3 వ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని అన్నారు. ఏడాదికి దాదాపు రూ.2,684.75 కోట్లు ఈ పథకానికి కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. ఆర్థిక ఇబ్బందులూ ఉన్న ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారని అన్నారు. కాగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం అని అన్నారు.
Also Read: వైఎస్ ఫ్యామిలీ రెండు ముక్కలు.. వారందరి సపోర్ట్ జగన్ కే!
Also Read: చౌటుప్పల్లో ఘోర ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు, స్పాట్ లోనే భార్య భర్తలు
AP News: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ అండగా ఉంది.. పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు!
అమరావతి రాజధానికి మోదీ సర్కార్ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. ఏపీకి కేంద్ర సహాయంపై ఓ వీడియో రిలీజ్ చేశారు.
Purandeshwari
AP News: అమరావతి రాజధానికి మోడీ సర్కార్ సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. ఇందులో భాగంగానే రూ. 2500కోట్లు కేంద్రం అమరావతిలో మౌలిక వసతుల కల్పనకు కేటాయించిందని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి 20వేల కోట్లు కేంద్రం మంజూరు చేసినట్లు వెల్లడించా. 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో డబుల్ ఇంజన్ సర్కార్ కు ప్రజలు పట్టం కట్టారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు. అమరావతి నిర్మాణానికి, అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని మోడీ చెప్పినట్లు గుర్తు చేస్తూ వీడియో రిలీజ్ చేశారు.
Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం..
వరల్డ్ బ్యాంకు ద్వారా 15వేల కోట్లు, హడ్కో కింద 11వేల కోట్లు ఏపీకి అందించడానికి నిర్ణయం చేశారు. హడ్కో కింద 11వేల కోట్ల రూపాయలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో నేడు ఒప్పందం చేసుకున్నారు. 15వేల కోట్లు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు కలిపి 13వేల 600కోట్లు ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1400కోట్లు అందిస్తుంది. ఈ 15వేల కోట్లు మొబలైజేషన్ లో 25శాతం గ్రాంట్ కింద ఇస్తామని కేంద్రం చెప్పిన విధంగా ఇటీవల 4వేల 285 కోట్లు కేంద్రం అందించింది. కేంద్రం నుంచి వచ్చే సహకారాన్ని అందిపుచ్చుకుంటూ అమరావతిని అద్భుతంగా అభివృద్ది చేయాలని కోరుతున్నాను అని పురంధేశ్వరి వివరించారు.
Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్ఫోన్స్ ఎగుమతి
bjp-purandeswari | amaravathi | telugu-news | today telugu news
వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి
Life Style: 20-20-20 ఫార్ములా ఎప్పుడైనా ట్రై చేశారా? స్క్రీన్స్ ముందు ఉండేవారికి ఇది చాలా ముఖ్యం
Murder : ములుగు జిల్లాలో దారుణం.. గొడ్డలితో నరికి గిరిజన యువకుడిని హత్య
రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్
Iphone 15 Price Drop: ఐఫోన్ 15పై బిగ్గెస్ట్ డిస్కౌంట్ భయ్యా.. వదిలారో మళ్లీ మళ్లీ రాదు!