Gannavaram Airport: గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో బుల్లెట్ల కలకలం

గన్నవరం విమానాశ్రయంలో గురువారం బుల్లెట్లు కలకలం రేపాయి. ఎయిర్ పోర్ట్ తనిఖీల్లో భాగంగా ఆర్య అనే పాసింజర్ దగ్గర రెండు బుల్లెట్లు గుర్తించారు చెకింగ్ సిబ్బంది. ఆర్యను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

author-image
By K Mohan
New Update
bullets

కృష్ణాజిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం బుల్లెట్లు కలకలం రేపాయి. ఎయిర్ పోర్ట్ తనిఖీల్లో భాగంగా ఆర్య అనే పాసింజర్ దగ్గర రెండు బుల్లెట్లు గుర్తించారు చెకింగ్ సిబ్బంది. డిసెంబర్ 5న ఉదయం గన్నవరం నుంచి ఆర్య ఢిల్లీ వెళ్తున్నాడు. చెకింగ్ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఆర్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చదవండి : Earthquake: కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే భూకంపం: భూగర్భ శాస్త్రవేత్త

గన్నవరం సిఐ బి.వి.శివప్రసాద్ ఈ విషయం గురించి మాట్లాడారు. పోలీసుల విచారణలో ఆర్య కేఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బీటెక్ సెకండియర్ చదువుతున్నట్లు తేలింది. లైసెన్స్ లేని బులేట్లు ఆర్య దగ్గర ఉండటం చట్టరీత్య నేరమని కేసు పెట్టి, ఆర్యపై ఎఫ్ఐఆర్ చేశారు. పోలీసులు ఈకేసులో దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Mexican Actress: మతాచారం పాటించి చనిపోయిన హీరోయిన్

 హర్యానాకు చెందిన ఆర్య జూలైలో చదువు నిమిత్తం ఆంధ్రప్రదేశ్ వస్తుండగా వాళ్ల తండ్రి బ్యాగ్గు తీసుకొచ్చానని పోలీసులకు చెప్పాడు. ఆర్య తండ్రి రోతు హర్యానాలో బ్యాంకు సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి లైసెన్స్ గన్ బుల్లెట్లు బ్యాగులో ఉన్నట్లుగా ఆర్య  చెప్పాడు. 

Also Read: కన్న తల్లిదండ్రులను, అక్కను కత్తితో పొడిచి పొడిచి.. ఎంత క్రూరంగా చంపాడంటే?

ఇది కూడా చదవండి: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇష్యూ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori Arrest: అఘోరీకి బిగ్ షాక్.. సంగారెడ్డి సబ్ జైలుకు తరలింపు- 14 రోజులు అక్కడే

అఘోరీకి చేవెళ్ల కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు (కంది జైలు) తరలించారు. అదే సమయంలో అఘోరీ నుంచి వర్షిణీని వేరు చేసి భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.

New Update

లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

14 రోజుల రిమాండ్

విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి భరోసా సెంటర్ అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇదే విషయంపై అఘోరీ తరఫు లాయర్ మాట్లాడుతూ.. ‘‘కోర్టులో ఇప్పుడు వాదోపవాదనలు ఏం జరగలేదు.  కోర్టు కేవలం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించి పూర్వపరాలు పరిశీలించి కేసు వాదించాలా లేదా అనేది జరుగుతుంది. కోర్టు తరఫున అడ్వకేట్‌ను పెట్టుకునే స్థోమత లేనివారికి కోర్టు నన్ను అపాయింట్ చేసింది. బెయిల్ గురించి ఇప్పుడే చెప్పలేం. కేసుకు సంబంధించి అన్నీ పరిశీలించిన తర్వాత ఒక టైం పడుతుంది. ’’ అని చెప్పుకొచ్చారు. 

కేసు ఏంటంటే?

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరీపై చీటింగ్ కేసు పెట్టింది. 6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది అఘోరీ .

క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరీ. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది.

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

aghori Arrest | lady aghori arrest | Lady Aghori Sri Varshini | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment