/rtv/media/media_files/2024/11/22/HPv4t3Buues9egyAi2v8.webp)
రేషన్ బియ్యం అక్రమాలపై విచారణకు స్పెషల్ సిట్ వేయడం సంతోషంగా ఉందని APCC చీఫ్ షర్మిళ అన్నారు. మరి సోలార్ విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన రూ.1750 కోట్ల ముడుపులపై విచారణ ఎక్కడని ఆమె ప్రశ్నించారు. బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ.. అదానీ అక్రమ డీల్ పై ఎందుకు పెట్టలేక పోతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగారు.
అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా ? మాజీ ముఖ్యమంత్రి స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే, నిజాలు నిగ్గు తేల్చే బాధ్యత మీది కాదా? అని షర్మిళ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదానీకి అమ్ముడుపోయారా అని ఆమె అంది. తీగ లాగితే మాజీ ముఖ్యమంత్రితో పాటు అదానీని సైతం అరెస్టు చేయాల్సి వస్తుందని భయపడుతున్నారా అని విమర్శించారు.
నోరు విప్పకుండా, విచారణ చేయకుండా మౌనంగా ఉండేందుకు అదానీ మీకు ఎంత లంచాలు ఆఫర్ చేశారని సీఎం చంద్రబాబును అడిగారు. TDP ప్రతిపక్షంలో ఉండగా.. SECIతో చేసుకున్న ఒప్పందంలో భారీ అవినీతి అన్నారు. ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్ షర్మిళ. టెండర్లు లేకుండా అదానీకి కాంట్రాక్టులు కట్టబెట్టడం అంటే పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లకదా అని ఆమె ఆరోపించారు.
ఇది కూడా చూడండి: సంధ్య థియేటర్ ఘటనపై ఎట్టకేలకు స్పందించిన బన్నీ.. బాధిత కుటుంబానికి 25 లక్షల సాయం
గుజరాత్ లో రూ.1.99లకు దొరికే సోలార్ విద్యుత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.2.49లకు ఎలా కొన్నారని ఉద్యమాలు చేశార కదా.. ఇప్పడు 25 ఏళ్ల పాటు డీల్ అంటే రాష్ట్ర ప్రజల నెత్తిన లక్ష కోట్ల అదనపు భారం పడిందని ఆమె చెప్పారు. ఇది ప్రజలను అదానీ కోసం నిలువునా దోచి పెట్టడం అని వివరించారు. ఈ డీల్ రద్దు చేయాలని ఇప్పటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ద్వారా హైకోర్టులో కేసు కూడా వేపించారు.
ఇప్పుడు వారే అధికారంలో వచ్చాక నిజాలు నిగ్గు తేలుస్తాం అని.. గొప్ప గొప్ప మాటలు చెప్పారు. మరి ఇప్పుడేమైందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని, తక్షణమే అదానీతో చేసుకున్న సోలార్ పవర్ ఒప్పందాలు రద్దు చేయాలని షర్మిళ డిమాండ్ చేశారు.
ఇది కూడా చూడండి: Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య