AP Tenth Exams: ఏపీలో రేపటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. విద్యార్థులకు మంత్రి లోకేష్ కీలక సూచనలు!

ఏపీలో రేపటి నుంచి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న టెన్త్ విద్యార్థులకు మంత్రి లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని.. ఎలాంటి ఒత్తికి గురి కాకుండా ఎగ్జామ్స్ రాయాలని సూచించారు. సకాలంలో కేంద్రాలకు రావాలన్నారు.

New Update
Nara Lokesh all the best to tenth students

Nara Lokesh all the best to tenth students

ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీరు, సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులంతా చక్కగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఎటువంటి ఒత్తిడికి గురికావద్దన్నారు. ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే పరీక్ష సమయం ఇదన్నారు. ప్రశాంతంగా ఉండండి.. సమయాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పరీక్ష పూర్తి చేయాలని సూచించారు. మరో వైపు టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పరీక్షకు వెళ్లే విద్యార్థులకు పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. 
ఇది కూడా చదవండి: Nagababu: ఇక నాగబాబు కేరాఫ్ పిఠాపురం.. అన్నకు కీలక బాధ్యతలు అప్పగించిన పవన్!

మొత్తం 3,450 సెంటర్లు..

ఇదిలా ఉంటే.. ఏపీలో రేపటి నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ప్రతీరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఫిజిక్స్, బయోలజీ పరీక్షలు పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Sharmila Vs Pawan: జనసేన పార్టీకి కొత్త పేరు పెట్టిన షర్మిల.. సంచలన ట్వీట్!

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులు కలిపి మొత్తం 6.15 లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. వీరి కోసం 3,450 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 156 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌, 682 సిట్టింగ్‌ స్క్వాడ్‌ టీమ్స్ ను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. హాల్ టికెట్ల పంపిణీని ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP News: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. ఆ హామీకి గ్రీన్ సిగ్నల్!

ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అమరావతి నుంచి హైదరాబాద్‌కు రూ.25 వేల కోట్లతో చేపట్టే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

New Update
Prime Minister Modi visit AP on January 8th

Modi government good news to AP

AP News: NDA కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీపై మోదీ సర్కార్‌ వరాల జల్లు కురిపిస్తోంది. ఓ వైపు పోలవరం.. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణాలను ముందుకు తీసుకెళ్తుంది. ఇంకొవైపు రాష్ట్ర విభజన సమయం నుంచి పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం దిశగా అడుగులెస్తోంది. ఈ క్రమంలోనే ఏపీకి మరో గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్రం ప్రభుత్వం.  

5 వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్..

విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలు పెట్టింది. రాష్ట్ర విభజన వేళ నుంచి పరిష్కారం కాని సమస్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే అమరావతి నుంచి హైదరాబాద్‌కు  గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం డీపీఆర్‌ సిద్ధం చేయాలని హోంశాఖను ఆదేశించింది. మొత్తం 6 లైన్లలో దాదాపు 25 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: ఏం మనిషివిరా.. దారుణం.. అక్కనే చంపిన తమ్ముడు

అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే వస్తే కేవలం నాలుగు గంటల్లోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంటుంది. దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల మేర ప్రయాణం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ హైవేను అమరావతి నుంచి హైదరాబాద్‌కు ఏ రూట్‌లో ప్లాన్ చేశారన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతం అమరావతి నుంచి హైదరాబాద్‌కు రెండు రూట్‌లు ఉన్నాయి. విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు ఒక రూట్.. పల్నాడు జిల్లా మీదుగా హైదరాబాద్‌కు మరో రూట్ ఉంది.  ఇందులో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే ఏ రూట్‌ నుంచి వస్తుందనేది స్పష్టం కాలేదు.

ఇది కూడా చదవండి: పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ఇస్తే జరిగేది ఇదే

మరోవైపు ఇప్పటికే అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం భూ సేకరణ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందుకోసం కేంద్రం నిధులనూ మంజూరు చేసింది. ఇదే సమయంలో - ఏపీలో మరో రిఫైనరీని ఏర్పాటును పరిశీలించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖకు ఆదేశించింది కేంద్రం. అలాగే అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్ హైవేకు సంబంధించి వీలైనంత త్వరగా డీపీఆర్‌లు రూపొందించాలని సూచించింది.

 modi | chandrababu | today telugu news

Advertisment
Advertisment
Advertisment