MLC Nagababu : అన్నయ్యా.. ఇది నాకెంతో స్పెషల్.. నాగబాబు ఎమోషనల్ ట్వీట్!

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన.. తమ్ముడు నాగబాబుకు ఆత్మీయ అభినందనలు అంటూ చిరు తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే చిరు పోస్ట్ పై నాగబాబు స్పందించారు.  మీ ప్రేమ, తోడ్పాటుకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన పెన్‌ నాకు ఎంతో ప్రత్యేకమని బదులిచ్చారు నాగబాబు.

New Update
nagababu mlc

nagababu mlc

సినీ నటుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవి ఆయనను అభినందించారు.  ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన.. తమ్ముడు నాగబాబుకు ఆత్మీయ అభినందనలు అంటూ చిరు తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే చిరు పోస్ట్ పై నాగబాబు స్పందించారు.  మీ ప్రేమ, తోడ్పాటుకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన పెన్‌ నాకు ఎంతో ప్రత్యేకం. నా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ పెన్‌ ఉపయోగించడం గౌరవంగా భావించా అని నాగబాబు ట్వీట్ చేశారు.   ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు

ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు చేత మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నాగబాబు తన సతిమణీతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును రాష్ట్ర సచివాలయంలో కలిశారు.   ఈ సందర్భంగా నాగబాబును సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించి, వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఆయనకు బహూకరించారు. అంతకుముందు చంద్రబాబును శాలువాతో సత్కరించిన నాగబాబు దంపతులు సీఎంకు పుష్పగుచ్ఛం అందజేశారు.  తనకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లకు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. వారి సూచనలకు అనుగుణంగా తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానని నాగబాబు వెల్లడించారు.  

Also read :  Teacher crime: ముద్దులు పెడుతూ డబ్బులు వసూలు.. లేడీ టీచర్ అరాచకాలు!

Also read : Ameenpur : కలిపిన గెట్ టు గెదర్.. చిగురించిన అక్రమ సంబంధం.. సంసారం నాశనం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Anakapalli Fire Accident: అనకాపల్లిలో దారుణం.. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు- స్పాట్‌లో 5గురు మృతి

అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది.

New Update
Fire Accident  in america

Fire Accident in Anakapalli Kailasapatnam

అనకాపల్లిజిల్లా కైలాసపట్నంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే వారిని సమీప హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలంలో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తుంది. 

Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..

AP Inter Students Suicide

ఇదిలా ఉంటే ఇవాళ ఏపీలో మరికొన్ని విషాదాలు చోటుచేసుకున్నాయి. ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్రంలో విషాదకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ముగ్గురు విద్యార్థులు దారుణమైన నిర్ణయాలు తీసుకుని ఆత్మహత్యలకు పాల్పడ్డారు. విశాఖపట్నం జిల్లా కొండపేటకు చెందిన చరణ్ తేజకు సెకండియర్ ఫిజిక్స్‌లో కేవలం 10 మార్కులే రావడంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

ఇదిలా ఉంటే .. నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలంలో ఫస్ట్ ఇయర్‌లో ఫెయిలైన చిన్న మస్తాన్ అనే విద్యార్థి కూడా జీవితాన్ని అర్థారతంరంగా ముగించుకున్నాడు. నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం ప్రాంతంలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలు విద్యార్థుల మానసిక ఒత్తిడిని, సమాజంలో ఉన్న అణచివేత వాతావరణానికి అద్దం పడుతున్నాయి.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

కర్నూలు జిల్లా ఆదోనిలో ఇద్దరు సబ్జెక్టుల్లో ఫెయిలైన ఓ బాలిక ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటనలు చూస్తే, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై సమాజం, విద్యా సంస్థలు మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంత ఉందో తెలుస్తోంది.

(fire accident | anakapalli | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment