AP Govt Jobs: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. వయోపరిమితి పెంపుపై కీలక నిర్ణయం!

ఏపీలోని నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త  చెప్పింది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయో పరిమితిని సడలించింది. యూనిఫామ్ సర్వీసెస్ కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కు 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది.

New Update
AP Government Jobs

AP Govt Jobs

ఏపీలోని నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త  చెప్పింది. ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు వయో పరిమితిని సడలించింది. యూనిఫామ్ సర్వీసెస్ కు రెండేళ్లు, నాన్ యూనిఫామ్ సర్వీసెస్ కు 34 నుంచి 42 ఏళ్లకు పెంచింది. సెప్టెంబర్ 30లోపు జరిగే పరీక్షలకు ఈ సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీపీఎస్సీతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పరీక్షలకు సైతం ఈ వయోపరిమితి పెంపు వర్తించనుంది.  

గ్రూప్-2పై కీలక ప్రకటన

ఇదిలా ఉంటే.. ఏపీలో గ్రూప్-2 అభ్యర్థులు ఈ నెల 10లోగా పోస్టు, జోనల్/జిల్లా ప్రాధాన్యాలను నమోదు చేసుకోవాలని ఏపీపీఎస్సీ సూచించింది. ఇందుకోసం మంగళవారం నుంచి వెబ్సైట్లో అవకాశం కల్పించినట్లు తెలిపింది. గత నెలాఖరులో గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. హారిజాంటల్ రిజర్వేషన్ అమలుపై సోమవారం జారీ చేసిన ప్రకటనలో ఏపీపీఎస్సీ కార్యదర్శి వివరణ ఇచ్చారు. హారిజాంటల్ రిజర్వేషన్ కేటగిరి కింద కేటాయించిన పోస్టులకు మహిళలు, దివ్యాంగులు, మాజీ సైని కులు, క్రీడాకారుల్లో అర్హులైన అభ్యర్థులు లేకుంటే.. ఆ ఖాళీలను నిబంధనల ప్రకారం మాత్రమే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment