ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఐరిస్‌ హాజరు!

ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్ధుల హాజరుకు ఐరిస్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. డిగ్రీ, పీజీ విద్యార్థులందరికీ ఐరిస్‌ హాజరును అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

New Update
sea

IRIS Attends: ఏపీ గవర్నమెంట్ మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్ధుల హాజరుకు ఐరిస్‌ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై డిగ్రీ, పీజీ కోర్సులు చదివే విద్యార్థులందరికీ ఐరిస్‌ హాజరు అమలు చేయబోతున్నట్లు తెలిపింది. ఈ మేరకు డిగ్రీ, పోస్టుగ్రాడ్యుయేషన్‌ చదివే విద్యార్థులందరికీ ఐరిస్‌ హాజరును అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

విద్యాసంస్థల్లో వివరాలు ఉండటం లేదు..

ఈ ఐరిస్ విధానం ద్వారా ఎంతమంది విద్యార్ధులు తరగతులకు హాజరవుతున్నారు? ఎంతమంది రెగ్యులర్‌గా కాలేజీలకు వస్తున్నారనే విషయాలను తెలుసుకునేందుకు ఈ విధానం ఉపకరిస్తుందని స్పష్టం చేసింది. గతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ విధానంలో విద్యార్థుల హాజరు నమోదుచేసినప్పటికీ.. ఇటీవల ఈ విధానాన్ని నిలిపివేశారు. మరోవైటు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎలాంటి వివరాలు ఉండటం లేదు. దీంతో అన్నింటికీ ఐరిస్‌ హాజరు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
యాప్‌ ద్వారా ముఖ గుర్తింపు హాజరు నమోదుచేయనుంది.

ఒకేసారి ముగ్గురు, నలుగురి హాజరు..

తరగతిలో యాప్‌ ఆన్‌ చేసి, విద్యార్థి వద్ద పెడితే వివరాలు ప్రత్యక్షమవుతాయి. వాటిని ఓకే చేస్తే హాజరు నమోదు పూర్తవుతుంది. ఒకేసారి ముగ్గురు, నలుగురి హాజరు నమోదుచేసేలా ప్రభుత్వం యాప్‌ను తీసుకొస్తోంది. అంతేకాకుండా బోధన రుసుముల చెల్లింపునకు కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన కారణంగా విద్యార్థులకు ఆ స్థాయిలో హాజరు ఉండేలా ప్రైవేటు యాజమాన్యాలు నిబంధనలు తుంగలో తొక్కుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. 

Also Read: బెయిల్ కోసం ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ దరఖాస్తు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Amzath Basha Brother Arrest in mumbai : మాజీ డిప్యూటీ సీఎంకు షాక్.. ముంబైలో తమ్ముడు అరెస్ట్..

అధికార పార్టీ ఎమ్మెల్యేలను నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు వరుసగా జైలు పాలవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత అంజద్ బాషాకు షాక్ తగిలింది. ఆయన తమ్ముడు అహ్మద్ బాషాను కడప పోలీసులు ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు.

New Update
Amzath Basha Brother Arrest in mumbai

Amzath Basha Brother Arrest in mumbai

Amzath Basha Brother Arrest in mumbai : అధికార పార్టీ ఎమ్మెల్యేలను నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు వరుసగా జైలు పాలవుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత అంజద్ బాషాకు షాక్ తగిలింది. ఆయన తమ్ముడు అహ్మద్ బాషాను కడప పోలీసులు ముంబయిలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనను ముంబయి నుంచి కడపకు తీసుకువస్తున్నారు. రేపు కడప కోర్టులో హాజరు పరచనున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, శ్రీనివాసులురెడ్డిని దూషించారనే ఫిర్యాదులతో పాటుగా ఓ స్థలం విషయంలో దాడి చేశారనే ఆరోపణలపై అహ్మద్ బాషా మీద కేసులు ఉన్నాయి. అహ్మద్ బాషాపై లుక్‌ అవుట్‌ నోటీసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబయి ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కడప పోలీసులకు అప్పగించారు. అహ్మద్ బాషా కువైట్ వెళ్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నట్లు తెలిసింది. అహ్మద్ బాషాపై కడపలో కేసు నమోదైంది. వినాయకనగర్‌లోని ఓ స్థలం విషయంలో దాడిచేశారని ఫిర్యాదు రావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.


Also read :  డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఈ కేసుతో పాటుగా కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలను అసభ్యకర పదజాలంతో దూషించారంటా అహ్మద్ బాషాపై కేసులు ఉన్నాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో నేత శ్రీనివాసుల రెడ్డిపై పోలీసు స్టేషన్‌లోనే దాడి చేసేందుకు అహ్మద్ బాషా యత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కడప పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ముంబయి నుంచి కడపకు తీసుకువస్తున్నారు. సోమవారం కడప కోర్టులో అహ్మద్ బాషాను హాజరు పరిచే అవకాశముంది.

Also Read :  దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

మరోవైపు పోలీస్ స్టేషన్‌ నుంచి తన అనుచరుణ్ని అంజాద్ బాషా బలవంతంగా తీసుకెళ్లడం శనివారం సంచలనం రేపింది. కడప పట్టణంలోని రాజారెడ్డి వీధి, బుడ్డాయపల్లెకు చెందిన కొంతమంది మహిళల వద్ద మహేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి రూ.50 లక్షలు అప్పు తీసుకున్నారు. అయితే అప్పు తీసుకుని 13 ఏళ్లు దాటినా తిరిగి చెల్లించలేదు. దీంతో అప్పు ఇచ్చిన మహిళలు నిలదీయగా.. ఆ డబ్బులను ఇబ్రహీం మియా అనే వ్యక్తికి ఇచ్చానని చెప్పారు. ఇబ్రహీం మియా కోసం మహిళలు గాలించగా పాత బస్టాండు వద్ద శుక్రవారం కనిపించాడు. దీంతో మహిళలు ఇబ్రహీం మియాను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కడప ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

అయితే ఇబ్రహీం మియా అంజాద్ బాషా అనుచరుడని తెలిసింది. దీంతో అంజాద్ బాషా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఇబ్రహీం మియాను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మహిళలు.. అంజాద్‌ బాషా ఇంటికి వెళ్లి ధర్నాకు దిగారు. వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో పోలీసులు ఇరువర్గాల పైనా కేసులు నమోదు చేశారు. తనపై దాడి చేశారని ఇబ్రహీం మియా ఇచ్చిన ఫిర్యాదుతో మహిళలపై కేసు నమోదు చేశారు. అలాగే డబ్బులు ఇవ్వాలని అడిగితే అసభ్యకరంగా మాట్లాడాడని మహిళలు ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీం మియాపైనా కేసు నమోదైంది.

Also Read : Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

 

Advertisment
Advertisment
Advertisment