ఏపీలో ఉద్రిక్తత.. అదానీ క్యాంపుపై ఎమ్మెల్యే వర్గీయుల రాళ్ల దాడి!

ఏపీలో అదానీ క్యాంపుపై రాళ్ల దాడి జరిగింది. రాగిగుంటలో కొత్తగా నిర్మిస్తున్న పంపు స్టోరేజీ విద్యుత్ ప్లాంట్, సిబ్బందిపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడిచేసి వాహనాల అద్దాలు పగలకొట్టారు. దీనిపై సీఎం చంద్రబాబు ఫైర్ అయినట్లు తెలుస్తోంది.

author-image
By srinivas
New Update
eerer

AP News: ఏపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జమ్మలమడుగు నియోజకవర్గం రాగిగుంట గ్రామంలోని అదానీ క్యాంపుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు, కుటుంబసభ్యులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కంపెనీ క్యాంపు, సిబ్బందిపై దాడిచేసి అద్దాలు పగలకొట్టారు. వాహనాలు, యంత్రాలను ధ్వంసం చేశారు. తమ ఎమ్మెల్యేకు చెప్పకుండా పనులెలా మొదలుపెడతారంటూ ఆదినారాయణరెడ్డి కుటుంబసభ్యులు శివనారాయణరెడ్డి, రాజేశ్‌రెడ్డిలు తమ అనుచరులతో కలిసి పంప్ షెడ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. దీంతో ఆ సంస్థ ప్రతినిధులు తాళ్ల ప్రొద్దుటూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేమగా కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై రుషికేశ్వర్‌రెడ్డి తెలిపారు. 

1000 మెగావాట్ల సామర్థ్యంతో పంపు స్టోరేజీ..

ఈ మేరకు రాగిగుంట వద్ద 470 ఎకరాల విస్తీర్ణంలో 1000 మెగావాట్ల సామర్థ్యంతో పంపు స్టోరేజీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ఆధాన్ సంస్థ ప్రారంభించింది. ఇందులో భాగంగానే క్యాంపు ఏర్పాటు చేసుకొని యంత్రాలతో నీళ్ల చదును పనులు మొదలుపెట్టింది. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు శివనారాయణరెడ్డి, రాజేశ్‌రెడ్డి తమ అనుచరులను వెంటపెట్టుకుని వచ్చి అదానీ సంస్థ ప్రతినిధులతో గొడవకు దిగారు. తమకు సమాచారం ఇవ్వకుండా పనులు ఎందుకు ప్రారంభించారంటూ సిబ్బందితో గొడవపడి.. ఆ తర్వాత రాళ్లతో దాడి చేశారు. అయితే డబ్బుల కోసమే ఈ దాడికి తెగపడ్డారని అదానీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: నిండా ముంచిన సువర్ణ భూమి.. లాభాల ఆశ చూపి రూ.200 కోట్లు స్వాహా!

చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. 

అయితే ఈ దాడిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యవహారం గురించి ఆరా తీసిన బాబు..   ఆదినారాయణరెడ్డి ఫ్యామిలీని సీఎంవోకు పిలిపించి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి అభివృద్ధి, ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తుంటే పారిశ్రామికవేత్తలను బెదిరించడం ఏమిటంటూ మందలించినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: అగ్రస్థానంలో హైదరాబాద్‌.. ఢిల్లీ, ముంబైని మించి ఆర్థికాభివృద్ధి!

ఇదిలా ఉంటే.. స్థానికులకు ఉద్యోగాలివ్వడంతోపాటు తమ వాహనాలను అద్దెకు తీసుకోవాలని అడగడానికి వెళ్లినట్లు ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. దీనిపై అదానీ సంస్థ ప్రతినిధులు బీజేపీ, కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక ఈ నియోజకవర్గ పరిధిలో సిమెంట్‌ కర్మాగారాలు, జిందాల్‌ సంస్థకు చెందిన పరిశ్రమలున్నాయి.

Also Read: Holidays: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లకు 4 రోజులు సెలవులే సెలవులు!

Also Read: TG-TET: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తు గడువు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment