Gorentla Madhav: గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు.. హైటెన్షన్!

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మార్చి 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసు బాధితురాలి పేరును పేర్కొనడంతో ఆయనపై కేసు నమోదైంది.

New Update
Gorentla Madhav arrest

Gorentla Madhav arrest

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorentla Madhav) కు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు (Vijayawada Cyber Crime Police) షాక్ ఇచ్చారు. అనంతపురంలోని ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. మార్చ్ 5న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నవంబర్ రెండు 2024న గోరెంట్ల మాధవ్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పోక్సో కేసులో బాధితురాలి పేరును గోరంట్ల మాధవ్ ప్రస్తావించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 72, 79 BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read :  ఈ కష్టం పగోడికి కూడా రావొద్దు... పాకిస్తాన్ చెత్త రికార్డు!

ఈ విషయమై గోరంట్ల మాధవ్ స్పందించారు. కూటమి ప్రభుత్వం కావాలని తనపై కేసు పెట్టిందన ఆరోపించారు. చంద్రబాబు, పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నారో గుర్తు పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కేసు వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడుతానన్నారు. తన లీగల్ అడ్వైజర్ తో కలిసి విచారణకు వెళ్తానన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. ఏపీలో అంతర్యుద్ధం రాబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదన్నారు. 

Also Read :  గోవాలో పర్యాటకులు సంఖ్య ఎందుకు తగ్గిందంటే ?.. స్థానిక ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

Also Read :  మరిన్ని చిక్కుల్లో అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

Also Read :  SLBC టన్నెల్ కూలడానికి ప్రధాన కారణం అదే.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు!

నెక్స్ట్ అరెస్ట్ ఎవరు?

ఇప్పటికే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ఇప్పుడు విజయవాడ జైలులో ఉన్నారు. మరో వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో ఆయనను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాజాగా గోరెంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారు. దీంతో వైసీపీ వర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నెక్ట్స్ అరెస్ట్ ఎవరిది? అన్న అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirumala : ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం.. 7న శ్రీరామపట్టాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

New Update
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanam

Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా తిరుపతి శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో  ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తమన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌..  రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!

శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 6న శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు రంగ‌నాయ‌కుల మండ‌పంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ఉత్సవమూర్తులకు అర్చకులు రంగనాయక మండపంలో, వేదమంత్రోచ్ఛరణల నడుమ అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గం. వరకు హ‌నుమంత వాహ‌నసేవ జరగనుంది. 9గం. నుంచి 10 గంటల నడుమ బంగారువాకిలి చెంత శ్రీరామనవమి ఆస్థానాన్ని వేడుకగా నిర్వహించనున్నారు. ఏప్రిల్ 7న శ్రీ రామ పట్టాభిషేకాన్ని, పురస్కరించుకుని, రాత్రి 8 నుంచి 9 గంటల న‌డుమ బంగారువాకిలి చెంత ఆలయ అర్చకులు శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహించనున్నారు.

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!


ఏప్రిల్ 7న శ్రీ సీతారాముల కల్యాణం :


ఏప్రిల్ 7వ తేదీన ఉదయం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు అభిషేకం చేస్తారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు టిటిడి పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. రాత్రి 7 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్ 8న శ్రీరామ పట్టాభిషేకం :


ఏప్రిల్ 8న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

ఏప్రిల్ 9వ తేదీన సాయంత్రం 4 గంట‌ల‌కు వ‌సంతోత్సవం, ఆస్థానం నిర్వహించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 5 నుండి 6 గంట‌ల వ‌ర‌కు తిరువీధి ఉత్సవం జరుగనుంది.

ఏప్రిల్ 10 నుండి 12 వరకు తెప్పోత్సవాలు :


శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదుచుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

Also Read: Adolescence: ప్రధాని మెచ్చిన 'Adolescence' వెబ్ సీరిస్.. అన్ని స్కూళ్లలో ప్రదర్శించాలని ఆదేశం.. దాని ప్రత్యేకత ఇదే!

Advertisment
Advertisment
Advertisment