AP Registrations : రిజిస్ట్రేషన్లపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఏపీలో రిజిస్ట్రేషన్లు ఇకపై స్లాట్ బుకింగ్ విధానంలో జరగనున్నాయి. జిల్లాల్లోని రిజిస్ట్రార్ కేంద్రాల్లో శుక్రవారం నుంచి స్లాట్‌ బుకింగ్‌ విధానం అమల్లోకి రానుంది. అధికారిక వెబ్‌సైట్‌‌ లేదా కార్యాలయాల్లో క్యూఆర్‌కోడ్‌ స్కాన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు.

New Update
AP Registrations

AP Registrations

రిజిస్ట్రేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు స్లాట్ విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. జిల్లాలోని అన్ని రిజిస్ట్రార్ కేంద్రాల్లో శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్లు స్లాట్‌ బుకింగ్‌ విధానంలోనే కొనసాగుతాయి. స్లాట్‌ బుకింగ్‌లకు డిజిటల్‌ క్యూ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌‌ను పాటించాలి.

ఇది కూడా చూడండి: Trump Tarriffs:ప్రతీకార సుంకాల పై ట్రంప్ కీలక ప్రకటన..భారత్‌ కు ఎంత శాతం విధించారంటే..!

ఇది కూడా చూడండి: Digital arrest: రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్‌ని కూడా వదలని కేటుగాళ్లు.. రూ.3.4 కోట్లు మోసం

స్లాట్ బుకింగ్ బట్టి రిజిస్ట్రేషన్..

స్లాట్ టైమ్ బట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంతకు ముందు మంచి, చెడు ముహూర్తాలు చూసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు. ఈ స్లాట్ బుకింగ్ వల్ల ఇకపై అలా జరగదు. అయితే పబ్లిక్‌ డేటా ఎంట్రీ (పీడీఈ) పద్దతి ద్వారా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్‌‌లోకి వెళ్లి లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్యూఆర్‌కోడ్‌ స్కాన్ అందుబాటులో ఉంటుంది. ఇలా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.

ఇది కూడా చూడండి:  UPI: నిలిచిపోయిన యూపీఐ సేవలు...ఇబ్బందుల్లో వినియోగదారులు

ఈ సమయాల్లో మాత్రమే..

గతంలో సమయం సందర్భం లేకుండా అర్థరాత్రి కూడా రిజిస్ట్రేషన్లు చేసేవారు. కానీ ఇకపై అలా జరగదు. రాష్ట్రంలోని 26 జిల్లా ప్రధాన సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్యలో రిజిస్ట్రేషన్‌ కోసం స్లాట్ బుకింగ్ కోసం అపాయింట్‌మెంట్ పొందవచ్చు. 

ఇది కూడా చూడండి: Maoist: వారికి శిక్ష తప్పదు.. రేణుక ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment