జగన్ కు బిగ్ షాక్.. మరో కీలక నేత ఔట్.. ఈ నెలలోనే జంప్?

ఏపీలో ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత మర్రి రాజశేఖర్ YCPని వీడేందుకు సిద్ధం అయ్యారు. చిలకలూరిపేట నియోజకవర్గ బాధ్యతలను మరోసారి విడుదల రజినికే అప్పగించడంతో అయన అసంతృప్తిగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే ఆయన TDPలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

New Update
YS Jagan Vidadala Rajini Marri Rajashekhar

YS Jagan, Vidadala Rajini, Marri Rajashekhar (File Photos)

ఏపీలో అధికారానికి దూరమైన వైసీపీకి కీలక నేతలు వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి, వాసిరెడ్డి పద్మ, కిలారి రోశయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ తదితర కీలక నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నేత మర్రి రాజశేఖర్ కూడా వైసీపీని వీడడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న మర్రి పార్టీని వీడితే గుంటూరు జిల్లాలో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నమ్మిన బంటుగా పేరున్న మర్రి రాజశేఖర్.. 2004లో చిలకలూరిపేట నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2009 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ తనయుడు జగన్ వెంట నడిచారు.

2014 నుంచి కష్టాలు..

వైసీపీ ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ సారథిగా వ్యవహరించారు. టీడీపీ ప్రభావం అత్యధికంగా ఉండే గుంటూరు జిల్లాలో పార్టీ అభివృద్ధికి ఆయన కృషి చేశారన్న పేరు ఉంది. అయితే.. 2014 ఎన్నికల్లో ఆయన మరోసారి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి వైసీపీలో మర్రి రాజశేఖర్ కు కష్టాలు మొదటయ్యాయి. అనంతరం టీడీపీ నుంచి వచ్చి చేరిన విడదల రజినికి చిలకలూరిపేట పార్టీ బాధ్యతలు అప్పగించారు జగన్. మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీని చేసి మంత్రిగా తన పక్కన కూర్చోబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు జగన్. 

కానీ మంత్రిని చేస్తానన్న మాటను మాత్రం నిలబెట్టుకోలేదు. మరోవైపు విడదల రజినికి మంత్రి పదవిని ఇచ్చారు. అయితే.. ఎన్నికల సమయంలో రజినిని ఇక్కడి నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి పంపించింది వైసీపీ. దీంతో మర్రి రాజశేఖర్ కు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ గుంటూరు మేయర్ ను తీసుకువచ్చి ఇక్కడ పోటీకి దించారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో మర్రి రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

అయితే.. ఇప్పటికైనా పార్టీ నియోజకవర్గ పగ్గాలు తనకు అప్పగిస్తారని ఆయన భావించారు. కానీ మళ్లీ విడదల రజినికే ఛాన్స్ ఇచ్చారు జగన్. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మర్రి ఇక పార్టీ వీడడమే బెస్ట్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఆయనతో మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే మరికొన్ని రోజుల్లోనే ఆయన టీటీడీ కండువా కప్పుకునే అవకాశం ఉందని నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CM Chandrababu: ఇవాళే అకౌంట్లోకి రూ.20 వేలు.. AP సర్కార్ కొత్త పథకం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మత్స్యకారుల ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ డబ్బులు నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలో జమచేయనున్నారు.

New Update
Matsyakara sevalo scheme

Matsyakara sevalo scheme

ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. తాజాగా కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని బుడగట్లపాలెం గ్రామంలో ‘‘మత్స్యకార సేవలో’’ అనే పథకాన్ని ప్రారంభించారు. సముద్రంలో చేపల వేటపై ఆధారపడిన కుటుంబాలకు అండగా ఈ ‘‘మత్స్యకార సేవలో’’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఒక్కో కుటుంబానికి రూ.20,000

ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇందులో భాగంగానే ఇవాళ ప్రారంభించిన సభలో సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధిదారులకు రూ.20,000 చెక్కును అందజేశారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు అంటే దాదాపు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేట నిషేం. కాబట్టి ఆ సమయంలో మత్స్యకారులు వారి జీవనోపాధి కోల్పోతారు. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

దానిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం.. వేటలేని కాలంలో మత్స్యకారులకు జీవనోపాధిని కొనసాగించడానికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తుంది. కాగా గత ప్రభుత్వం మత్స్యకారుల కుటుంబాలకు రూ. 10,000 సహాయాన్ని అందించింది. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వారికి రూ. 20,000 సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,29,178 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.258 కోట్లు కేటాయించింది.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

cm-chandra-babu | ap cm chandra babu naidu | Matsyakara sevalo | srikakulam

Advertisment
Advertisment
Advertisment