AP Politics: పవన్ కన్నా చంద్రబాబే బెటర్.. వైసీపీ సంచలన ట్వీట్!

అబద్ధాలు చెప్పడంలో పవన్ తన గురువు చంద్రబాబునే మించిపోయాడని YCP సెటైర్లు వేసింది. రోడ్లు నిర్మాణం విషయంలో YCP, కూటమి ప్రభుత్వాలు పెట్టిన ఖర్చులో తేడాలను వివరిస్తూ ఈ రోజు పవన్ చేసిన ట్వీట్ కు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. పవన్ వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది.

New Update
Jagan Pawan Chandrababu

Jagan Pawan Chandrababu

గోరంతను కొండంతగా చేసి చూపించడంలో చంద్రబాబు నాయుడిని పవన్ కల్యాణ్‌ మించిపోయాడని వైసీపీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఈ రోజు ఉదయం పవన్ కల్యాణ్‌ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో ఏపీ పంచాయతీ రాజ్ శాఖ కింద కేవలం 1800 కిలో మీట్లర్లు మాత్రమే సీసీ రోడ్లు నిర్మించారన్నారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 3,750 కి.మీ మేర సీసీ రోడ్లను నిర్మించారన్నారు. ఇంకా గత ఐదేళ్ల పాలనలో కేవలం 268 మినీ గోకులాలు ఏర్పాటు చేస్తే తాము ఆరు నెలల్లోనే 22,500 నిర్మించామన్నారు. ఇంకా పీవీటీజీ ఆవాసాల కోసం గత వైసీపీ సర్కార్ కేవలం రూ.91 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కానీ తమ ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే రూ.750 కోట్లు వెచ్చించిందన్నారు. ఈ ట్వీట్ పై వైసీసీ రియాక్ట్ అయ్యింది. అబ‌ద్ధాలు, అస‌త్యాల‌ను ప్రచారం చేయ‌డంలో పవన్ తన గురువు చంద్రబాబును మించిన శిష్యుడయ్యాడని సెటైర్లు వేసింది.
ఇది కూడా చదవండి: తిరుమల టికెట్ల డబ్బులతో రోజాకు బెంజ్ కారు.. జేసీ సంచలన ఆరోపణలు!

కొత్త రోడ్లు వేయలేదు..

ఏపీలో కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన తర్వాత రోడ్లలో గుంత‌లను పూడ్చడమే కానీ కొత్త రోడ్లు వేసింది శూన్యమేనన్నారు. ఈ ప్రభుత్వం గుంత‌లు పూడ్చడానికి ఖర్చు చేసింది కేవ‌లం రూ.860 కోట్లు మాత్రమేనన్నారు. కొత్త రోడ్ల నిర్మాణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుందన్నారు. పీపీపీ విధానంలోనే కొత్త రోడ్లను నిర్మిస్తామని ఈ ప్రభుత్వం ప్రకటించి తద్వారా వాహనదారుల నుంచి భారీగా టోలు ఫీజులు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. ఆ ముసుగులో టీడీపీ పెద్దలే కాంట్రాక్టర్లుగా మారి టోలు బాదుడుకు సిద్ధపడుతున్నారు. 
ఇది కూడా చదవండి: పేదలకు చేయూత.. సంక్రాంతి పండక్కి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

రూ.43 వేల కోట్లు ఖర్చు..

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఏడాది కోవిడ్‌కు పోగా కేవ‌లం 4 ఏళ్లలో రోడ్ల నిర్మాణానికి  రూ.43 వేల కోట్లు ఖ‌ర్చు చేసిందన్నారు. రోడ్ల మరమ్మతుల కోసం రూ.4,648 కోట్లు ఖర్చను తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని వైసీపీ తన పోస్ట్ లో పేర్కొంది. రోడ్ల గుంతలు పూడ్చటం మాత్రమే కాదు.. వాటితో పాటు పెద్ద సంఖ్యలో జగన్‌ సర్కారు కొత్త రోడ్లను నిర్మించిందని తెలిపింది. ఇప్పటికైనా పవన్  కల్యాణ్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని సూచించింది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య

శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా…. తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. కల్యాణకట్టలో స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

New Update
anna lezhneva

anna lezhneva

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు.  ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి  తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని  మొక్కులు చెల్లించుకోనున్నారు.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

 

Advertisment
Advertisment
Advertisment