AP: ఆ ఊళ్లో సంక్రాంతి జరుపుకోరు..స్నానాలు కూడా చేయరు..ఎందుకంటే!

సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు. కానీ సంక్రాంతి పండగను జరుపుకోని ఓ గ్రామం ఉందని మీకు తెలుసా. అది కూడా ఏపీలోనే అనే విషయం తెలుసా..అసలు ఈ కథేంటి..ఆ ఊరు ఎక్కడ ఉందనే విషయాలు ఈ స్టోరీలో..

New Update
sankranti

sankrati

సంక్రాంతి పండగ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండగ.ఏపీలో ఈ పండుగను మరింత ఘనంగా, అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. వృత్తి ఉద్యోగాల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు, దేశ, విదేశాల్లో స్థిరపడిన వారంతా  ఈ పండగకు సొంతూర్లకు వచ్చి.. పండగ చేసుకుంటారు. రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, భోగి మంటలు, కోడి పందేలు, హరిదాసు కీర్తనలతో పల్లెల్లో సందడి వాతావరణం ఉంటుంది. 

Aslo Read: Sabarimala: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు

అయితే ఏపీలోని ఓ గ్రామం మాత్రం సంక్రాంతి పండగను జరుపుకోవడం లేదు. పండగ జరుపుకోవడం పక్కనపెడితే కనీసం స్నానాలు కూడా చేయరు. ఇళ్లు కూడా ఊడ్చుకోరు. .సంక్రాంతి పండగ అంటే పల్లెల్లో ఎంతో సందడి ఉండగా.. ఏపీలోని అనంతపురం జిల్లా పి.కొత్తపల్లి గ్రామంలో మాత్రం అసలు పండగ వాతావరణమే కనిపించదు. దేశమంగా సంక్రాంతి సంబరాల్లో మునిగిపోతుండగా.. పి.కొత్తపల్లి వాసులు మాత్రం మామూలు రోజుకంటే సాధారణంగా ఉంటారు.

 సంక్రాంతి పండగ ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టడం కాదు కదా.. ఆ రోజు కనీసం ఇంటిని కూడా ఊడ్వకపోవడం గమనార్హం. ఆత్మకూరు నుంచి కల్యాణదుర్గం వెళ్లే మార్గంలో ఈ పి.కొత్తపల్లి గ్రామం ఉంటుంది.ఈ క్రమంలోనే దాదాపు 300 కుటుంబాలు కమ్మ, బోయ, ఎస్సీ కుటుంబాలు ఉంటాయి. ఈ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం లేదు. సంక్రాంతిని ఎందుకు జరుపుకోవడం లేదంటే.. ఆ పి.కొత్తపల్లి గ్రామస్తులు తమ పూర్వీకులు చెప్పిన ఒక కథను ఒకదానిని చెబుతుంటారు.

Also Read: Horoscope : ఈ రాశివారికి వృత్తి ఉద్యోగాల్లో మంచి గుర్తింపు దక్కుతుంది!

వెళ్లిన వాళ్లు.. వెళ్లినట్లే..

చాలా సంవత్సరాల  క్రితం పి.కొత్తపల్లి గ్రామంలో కూడా అందరిలాగానే సంక్రాంతి పండగను జరుపుకునే వారని.. అయితే అలా ఒకసారి సంక్రాంతి పండగ కోసం సరుకులు కొనుగోలు చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి  ఆత్మకూరు సంతకు వెళ్లగా...అక్కడ ఉన్నట్టుండి ఆ వ్యక్తి అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచాడు.అయితే ఈ ఘటనను అందరూ సాధారణ ఘటనగానే భావించారు. కానీ ఆ తర్వాతి రోజు అలాగే సంతకు వెళ్లిన మరో ముగ్గురు కూడా అలానే మరణించారు. దీంతో ఆ గ్రామస్థుల్లో భయం మొదలైంది. ఆ తర్వాత వరుసగా పండగకు సంతకు వెళ్లిన వాళ్లు.. వెళ్లినట్లే ప్రాణాలతో తిరిగి రాకపోవడంతో వారికి సంక్రాంతి అంటే భయం మొదలైంది.

అప్పటి నుంచి సంక్రాంతి పండుగ చేసుకుంటే తమ గ్రామస్థులకు ఏదో ఒక అనర్థం జరుగుతుందని గ్రామవాసులు భయపడిపోయారు. అప్పట్నుంచి తమ ఊళ్లో సంక్రాంతి పండగను జరుపుకోవద్దని గ్రామపెద్దలు తీర్మానించుకున్నారు.అయితే ఎన్నో తరాలు మారినప్పటికీ.. అప్పుడు తమ గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని పి.కొత్తపల్లి గ్రామస్థులు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. 

తమ పూర్వీకులు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ వారు ఇప్పటికీ సంక్రాంతి పండుగ జరిగే మూడు రోజుల పాటు ఇల్లు, వాకిలిని శుభ్రం చేసుకోరు. ఇంటి ముందు ముగ్గులు వేయరు. పిండి వంటలు చేసుకోరు. కనీసం స్నానాలు కూడా చేయరు.

Also Read: Madhya Pradesh: ఇక నుంచి రాష్ట్రంలో ఆ పట్టణాల్లో మద్యం బంద్‌!

Also Read: South Korea: అభిశంసనకు గురైనా..ఆ అధ్యక్షుడి జీతం పెరిగిందోచ్‌!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య

శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా…. తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. కల్యాణకట్టలో స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

New Update
anna lezhneva

anna lezhneva

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు.  ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి  తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని  మొక్కులు చెల్లించుకోనున్నారు.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

 

Advertisment
Advertisment
Advertisment