Alekhya Chitti Pickles Issue: అలేఖ్య చిట్టి సంచలన వీడియో రిలీజ్..

గత రెండు రోజులుగా అలేఖ్య చిట్టి పికెల్స్ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. ఈ వివాదంపై అలేఖ్య క్షమాపణలు తెలిపింది. ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. ‘నేను తప్పు చేశాను. ఇప్పటి వరకు ఎవర్నైతే తిట్టానో వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను’ అని పేర్కొంది.

New Update
Alekhya Chitti say sorry to customers after Alekhya Chitti Pickles Issue

Alekhya Chitti say sorry to customers after Alekhya Chitti Pickles Issue

గత రెండు రోజులుగా అలేఖ్య చిట్టి పికెల్స్ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో సెన్సేషనల్‌గా మారింది. పచ్చళ్ల రేటు ఎక్కువగా ఉందని అడిగినందుకు అలేఖ్య కస్టమర్లపై బూతులతో రెచ్చిపోయింది. నోటికి వచ్చినట్లు మాట్లాడిన ఆడియోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అలేఖ్యపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. 

Also Read: చైనా కంగారుపడింది..సుంకాలపై స్పందించిన ట్రంప్

కస్టమర్లే మా దేవుళ్లు అని వీడియోలలో చెప్తూనే.. నిజ జీవితంలో అలేఖ్య బూతులతో రెచ్చిపోయిందని ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా మీమ్స్, ట్రోలింగ్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. వీడియోల్లో కనిపించే అలేఖ్య వేరు.. రియల్ లైఫ్‌లో అలేఖ్య వేరు అంటూ మండిపడుతున్నారు. జీవితంలో ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలే తప్ప తలపొగరు చూపించకూడదని హితవు పలుకుతున్నారు. 

Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

అయితే ఈ వివాదాన్ని సర్దుమనిగించేందుకు అలేఖ్య అక్కా, చెల్లెలు రంగంలోకి దిగారు. అలేఖ్య అలా బూతులు తిట్టడం వెనుకున్న ఆంతర్యాన్ని  వారు తెలిపారు. వారు ఎంత వివరణ ఇచ్చినప్పటికీ.. సోషల్ మీడియాలో ట్రోల్స్ ఆగడం లేదు. నెటిజన్లు ఏ మాత్రం కన్విన్స్ అవ్వడం లేదు. అలేఖ్యకు సంబంధించిన పాత వీడియోలను బయటకు తీసి వైరల్ చేస్తున్నారు. 

 Also read: గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!

ఈ నేపథ్యంలో వారు తమ బిజినెస్‌ను మూసుకోవలసిన పరిస్థితి వచ్చింది. వెబ్‌సైట్, యాప్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అనేక సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసుకున్నారు. వారి బిజినెస్‌కు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కాంట్రవర్సీ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే మళ్లీ బయటకు రావాలని చూస్తున్నట్లు సమాచారం. 

Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!

నన్ను క్షమించండి

అయితే ఈ వివాదాన్ని త్వరగా క్లోజ్ చేసేందుకు డైరెక్ట్‌గా అలేఖ్య రంగంలోకి దిగింది. తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరింది. ఈ మేరకు తాను ఒక వీడియో రిలీజ్ చేసింది. ‘‘నేను తప్పు చేశాను. ఇప్పటి వరకు ఎవర్ని అయితే తిట్టానో.. వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను’’ అంటూ ఆ వీడియోలో పేర్కొంది. మరి ఇప్పటికైనా అలేఖ్య చిట్టి వ్యవహారం కంట్రోల్ అవుతుందో లేదో చూడాలి. 

(alekhyaa chitti pickle | alekhya chitti pickles audio | alekhya chitti pickles controversy | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TTD: ఒంటిమిట్ట రాములోరి గుడికి.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు!

ఒంటిమిట్టలో కొలువై ఉన్న సీతారాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ మేరకు టీటీడీ స్పెషల్ ప్యాకింగ్‌తో సిద్ధం చేశారు.మొత్తం 70వేల లడ్డూలను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.

New Update
Tirupati Laddu

ఒంటిమిట్ట శ్రీ సీతారాముల‌ కళ్యాణానికి వచ్చే భ‌క్తుల‌కు టీటీడీ తీపికబురు చెప్పింది. శుక్రవారం జరిగే కళ్యాణానికి వచ్చే భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రెడీ అయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో లడ్డూల ప్యాకింగ్‌ నిర్వహించారు. డిప్యూటీ ఈవో శివప్రసాద్‌, ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది తిరుమలలో శ్రీ‌వారి సేవ‌కులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు. 

Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

 ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండరామ స్వామి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30  మధ్య  జరిగే  శ్రీ సీతా రాముల‌ కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ఉచిత ప్రసాదంగా అందజేయబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఒంటిమిట్ట లో ఈ నెల 11వ తేదీన జరుగనున్న రాముల వారి కల్యాణం ఏర్పాట్లను టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మంతో కలసి అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. 

Also Read: Sai Sudarshan: చెండాడేశాడు భయ్యా.. చుక్కలు చూపించిన సుదర్శన్- ఎంత స్కోర్ చేశాడంటే?

ఈ సందర్భంగా శుక్రవారం శ్రీకోదండరామ స్వామి కల్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నసందర్భంగా, ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. ముందుగా ఒంటిమిట్టలోని టీటీడీ అతిథి గృహాం వద్ద ముఖ్యమంత్రి బస చేసే గదులలో ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ కోతలు లేకుండా అప్రమత్తంగా ఉండాలని, పరిసర ప్రాంతాలలో పచ్చదనం, పుష్పాలంకరణలు తాజా పుష్పాలతో ఏర్పాటు చేయాలన్నారు.

అటు తర్వాత టీటీడీ అతిథి గృహం నుంచి ఆలయం వరకు పరిసర ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పెండింగ్ పనులు పూర్తి చేయాలన్నారు. ఆలయంలోపుల ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో నిల్వ వున్న సామాగ్రి, వస్తువులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయం అంతా కలియ తిరిగారు. ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు విద్యుత్ కాంతులు, పుష్పలంకరణలలో రాజీ లేకుండా నాణ్యంగా పనులు చేపట్టాలని కోరారు. 

అధికారులు సమన్వయంతో జిల్లా యంత్రాంగం, టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. భక్తులు అందరికి అన్నప్రసాదాలు, స్వామివారి కళ్యాణ తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, త్రాగునీరు, మజ్జిక పంపిణీ చేస్తామని చెప్పారు. భక్తుల రద్దీకి తగ్గట్లు జిల్లా రెవిన్యూ, పోలీసు, స్థానిక పంచాయతీ, టీటీడీ అధికారులు సమిష్టిగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. 

Also Read:  Badminton: ఆసియా ఛాంపియన్ షిప్ లో పీవీ సింధు మొదటి విజయం

Also Read: Ap Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలలో వానలే ..వానలు!

kadapa | sita rama kalyanam at vontimitta | vontimitta kalyanam | vontimitta-kodandaram | vontimitta ramalayam | vontimitta sitarama kalyanam | vontimitta sita rama kalyanam | ttd | laddu

Advertisment
Advertisment
Advertisment