Alekhya Chitti Pickles Issue: మొత్తానికి అలేఖ్య పాపని ఏడిపించేశారు కదరా.. వెక్కి వెక్కి ఏడుస్తున్న చిట్టి (వీడియో వైరల్)

అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ తీవ్ర దుమారం రేపింది. ఈ వివాదంతో అలేఖ్య చిట్టి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో వైరల్‌గా మారింది. నాన్న ఉన్నా ధైర్యంగా ఉండేదని ఆ వీడియోలో అలేఖ్య చెబుతుంది.

New Update
Alekhya Chitti crying after Alekhya Chitti Pickles Issue Video goes viral

Alekhya Chitti crying after Alekhya Chitti Pickles Issue Video goes viral

గత మూడు రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ సోషల్ మీడియాలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. పికిల్స్ రేటు ఎక్కువగా ఉందన్న పాపానికి అలేఖ్య.. తన కస్టమర్లపై బూతులతో విరుచుకుపడింది. ముష్టి పచ్చళ్లే కొనలేనపుడు మీకు పెళ్లం ఎందుకు?.. లవర్ ఎందుకు అంటూ బూతుపురాణం మొదలెట్టింది. అందుకు సంబంధించిన ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో అలేఖ్య చిట్టిపై నెట్టింట దుమారం రేగింది. 

ఇది కూడా చూడండి: మీరు సరిగా పని చేయడం లేదు..కుక్కల్లాగా నడవండి..ఉద్యోగులకు వేధింపులు!

వెక్కి వెక్కి ఏడ్చిన అలేఖ్య

దీంతో ట్రోలర్స్, మీమర్స్ అలేఖ్య చిట్టి పికిల్స్‌ను టార్గెట్ చేశారు. వరుసగా ట్రోల్స్, మీమ్స్‌తో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు. దీంతో బిజినెస్‌ను మూసేసి అలేఖ్య చిట్టి అన్నింటికి కాస్త బ్రేక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న వ్యతిరేఖతకు ఆమె కుంగిపోతుంది. తాజాగా ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చూడండి: వాట్సాప్‌ వీడియో కాల్స్ చేసుకునే వారికి గుడ్‌న్యూస్.. కొత్తగా 3 ఫీచర్లు!

ఇది కూడా చూడండి: సగానికి పైగా విద్యార్థి వీసాల్లో కోత..తెలుగు రాష్ట్రాల వారివే ఎక్కువ

ఇలాంటి సమయంలో నాన్న ఉంటే కొంచెం ధైర్యంగా ఉండేదాన్ని అంటూ ఏడుస్తుంది. పక్కనే తన సోదరి అలేఖ్య కన్నీళ్లు తుడుస్తూ ఏడవకు.. ఏడవకు అంటూ ఆమెను ఓదార్చుతుంది. ప్రస్తుతం అందుక సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు కామెంట్లు చేస్తున్నారు. నోరు జారక ముందు ఆ ఆలోచన ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరొకరేమో.. అయిందేదో అయిపోయింది అని రాసుకొచ్చారు. 

ఇది కూడా చూడండి: అదుపుతప్పి బావిలో పడ్డ ట్రాక్టర్.. ఏడుగురు మహిళా కూలీలు మృతి

(alekhyaa chitti pickle | alekhya chitti pickles audio leaked | alekhya chitti pickles controversy | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య

శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా…. తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. కల్యాణకట్టలో స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

New Update
anna lezhneva

anna lezhneva

Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారి దర్శనార్థం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నలేజినోవా తిరుమలకు చేరుకున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకోగా తిరుమలలోని గాయత్రి అతిథి గృహంలో బస చేశారు. గాయత్రి అతిథి గృహం వద్దకు చేసుకున్న అన్నలేజినోవాకు టీటీడీ అధికారులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం క్షేత్ర సంప్రదాయం నియమాలను పాటించారు.  ముందుగా ఆలయ మాడ వీధుల్లోకి చేరుకుని శ్రీ భూ వరహా స్వామి ఆలయంకు చేరుకున్నారు. అనంతరం శ్రీ భూ వరహా స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

Also read: మావోయిస్టులతో చర్చలు..మోడీ, అమిత్ షాకు పీస్ డైలాగ్ కమిటీ కీలక లేఖ

భూ వరహా స్వామి దర్శనం అనంతరం కళ్యాణకట్టకు చేరుకున్నారు. కల్యాణకట్టలో స్వామి వారికి మొక్కుల చెల్లించుకున్నారు. ఆ దేవదేవుడికి  తలనీలాలు సమర్పించారు. అటు ఆతరువాత నేరుగా శ్రీ గాయత్రి నిలయం కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేసి రేపు వేకువజామున ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గత గత వారం సింగపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.  

Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్

మార్క్ శంకర్ కు వారం రోజులు సింగపూర్ లో ప్రత్యేక వైద్య సేవలు అందించారు. ఘటన నుంచి పూర్తిగా కోలుకున్నాడు మార్క్ శంకర్. దీంతో బాబు క్షేమం కోసం శ్రీవారికి ఆపద మొక్కులు మొక్కుకున్నారు అన్నలేజినోవా. ఆపద నుంచి శ్రీవారు మార్క్ శంకర్ ను కాపాడటంతో నేడు తిరుమలకు వచ్చి మొక్కులు సమర్పించుకొనడానికి తిరుమలకు వచ్చారు అన్నలేజినోవా. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడటంతో స్వామి వారికి దర్శించుకొని  మొక్కులు చెల్లించుకోనున్నారు.

Also Read: Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ.. 2 రోజుల పాటు ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్

 

Advertisment
Advertisment
Advertisment