Alekhya Chitti Pickles Issue: చావుబతుకుల్లో అలేఖ్య చిట్టి.. చిన్న పిల్లయ్యా- ఎమోషనల్ వీడియో

అలేఖ్య చిట్టి హాస్పిటల్‌లో చేరింది. బ్రీతింగ్ ఇష్యూతో ICU వార్డులో కొట్టిమిట్టాడుతుంది. తన చెల్లికి సీరియస్‌గా ఉందని సుమీ ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కూడా కష్టంగా ఉందంటూ తెలిపింది. దయచేసి ట్రోలింగ్ ఆపండంటూ వేడుకుంది.

New Update

గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదమే నడుస్తోంది. ఆమె తిట్టిన బూతులు, ఆమె చేసిన బాగోతమే వైరల్ అవుతోంది. మీ పచ్చళ్లు రేటు ఎక్కువగా ఉన్నాయి అన్నందుకు అలేఖ్య చిట్టి బూతులతో రెచ్చిపోయింది. 

Also Read: పోలీసులకు లొంగిపోయిన 26 మంది మావోయిస్టులు

ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు.. రేటు ఎక్కువ అంటున్నావు అంటే మీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముందు కెరియర్ పై ఫోకస్ పెట్టు.. అంటూ నోటికొచ్చిన బూతులతో రెచ్చిపోయింది. అది కాస్త వైరల్‌ కావడంతో మీమ్స్, ట్రోలింగ్స్ మొదలయ్యాయి. దీంతో అలేఖ్యతో పాటు తన అక్కా, చెల్లిని కూడా బయటకులాగారు. 

Also Read: తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

వీరి ముగ్గురిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. వారికి కౌంటర్ ఇస్తూ విమర్శలు చేస్తున్నారు. తాము చేసింది తప్పేనని.. ఇకపై అలా చేయమని.. ఎవరినైతే తిట్టామో వారికి క్షమాపణలు చెబుతున్నామంటూ ముగ్గురు అక్కా చెల్లెల్లు వీడియోలు రిలీజ్ చేశారు. అయినా వారిపై ట్రోలింగ్స్ ఆగలేదు. ఇక ఈ విమర్శలకు గురైన అలేఖ్య చిట్టి తీవ్ర మనస్థాపంతో అనారోగ్యబారిన పడింది. 

Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!

ICUలో అలేఖ్య చిట్టి

అలేఖ్య చిట్టి ప్రస్తుతం హాస్పిటల్‌‌లో ఉంది. ఆమెను ICU వార్డ్‌లో ఉంచారు. అందుకు సంబంధించిన వీడియోను అలేఖ్య అక్క సుమీ (సుమ) సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలేఖ్య చిట్టికి సీరియస్‌‌గా ఉందని.. ఆమె హాస్పిటల్లో ICU బెడ్‌పై ఉందని తెలిపింది. బ్రీతింగ్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో చేరినట్లు పేర్కొంది. తన చెల్లికి ఆక్సిజన్ తీసుకోవడం కూడా చాలా- కష్టంగా ఉందంటూ ఎమోషనల్ వీడియోను సుమీ రిలీజ్ చేసింది. 

Also Read: క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

అలేఖ్య చెల్లి ఆరోగ్యం అస్సలు బాలేదని తెలిపింది. సారీ చెప్పినా ట్రోలింగ్ చేస్తున్నారని ఆవేదన చెందింది. దయచేసి ట్రోలింగ్ ఆపండి అంటూ నెటిజన్లను వేడుకుంది. మా నాన్న చనిపోయి 3 నెలలు కూడా కాలేదని.. ఇంకో చావు మా ఇంట్లో జరుగుతుందని భయం వేస్తోందని సుమీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ గా మారింది. 

(alekhyaa chitti pickle | alekhya chitti pickles audio | alekhya chitti pickles controversy | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment