Agniveer: ఏపీలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఎక్కడంటే?

ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి నోటిఫికేషన్ వెల్లడైంది. కడపలోని(Guntur) డీఎస్ఏస్టేడియంలో ర్యాలీ నిర్వహించబోతున్నారు. నవంబర్10 నుంచి 15 వరకు ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో 13 జిల్లాల అభ్యర్థులు మాత్రమే పాల్గొనే ఛాన్స్ ఉందని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

New Update
gunturu rally

రాష్ట్రంలో నిరుద్యోగ యువతుకు గుడ్ న్యూస్. ఎప్పట్నుంచో అగ్నివీర్ లో చేరాలనుకుంటున్న వారు ఇక సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఏపీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెన్త్ ట్రేడ్స్‌మెన్, అగ్నివీర్ 8th ట్రేడ్స్ మెన్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండిః మనిషి మాంసం తింటా అంటున్న మహిళా అఘోరి.. అసలు చట్టం ఏం చెబుతోంది?

ర్యాలీ ఎప్పుడు

ఈ ర్యాలీని కడపలోని డీఎస్ఏ స్టేడియంలో నిర్వహించబోతున్నట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. నవంబర్ 10 నుంచి 15 తేదీ వరకు ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా ఈ ర్యాలీలో 13 జిల్లాల్లోని అభ్యర్థులు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి:  రేవంత్‌ దూకుడు.. బడ్జెట్లో వెయ్యికోట్లు..మూసీ కాంట్రాక్టు పొంగులేటికే?

ఈ జిల్లా అభ్యర్థులకు మాత్రమే చాన్స్

అందులో కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, అనంతపురం, ప్రకాశం, పల్నాడు, బాపట్ల, చిత్తూరు, నంద్యాల, సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు చెందిన అభ్యర్థులు మాత్రమే హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు కచ్చితంగా అడ్మిట్ కార్డులు తీసుకురావాలని అన్నారు.

Also Read:  కిలో వెండి అక్షరాల లక్ష రూపాయలు!

02.12.2024 నాటి నోటిఫికేషన్ ప్రకారం www.joinindinaarmy.nic.inలో పొందుపరచిన అన్ని డాక్యుమెంట్స్ ను తీసుకురావాలన్నారు. అయితే ఈ ర్యాలీలో అభ్యర్థులకు ఫిజికల్ టెస్ట్ లో భాగంగా 1600 మీటర్ల రన్నింగ్ నిర్వహిస్తారు. అందులో దాదాపు 1000 మంది చొప్పున అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఆర్మీ శిక్షణ ఇవ్వనున్నారు. అందువల్ల ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. 

ఇది కూడా చదవండి: కరీంనగర్‌లో ఈఎస్ఐ హాస్పిటల్.. బండి విజ్ఞప్తికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Government good news : రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టులు భర్తీ

ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
Special Education Teachers |

Special Education Teachers |

AP Government good news : ఏపీలో టీచర్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 మందిని స్కూల్ అసిస్టెంట్ల పోస్టుల్లో నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రాథమిక స్థాయిలో 1136 స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ పోస్టుల భర్తీకి, సెకండరీ స్థాయిలో 1124 స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ ప్రత్యేక ఉపాధ్యాయులు ఆటిజం, మానసిక వైకల్యం వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు విద్యను బోధించడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ

డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయబడనుంది. ఈ ప్రక్రియ ద్వారా, విద్యార్థుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నియామక ప్రక్రియలో అభ్యర్థుల విద్యా అర్హతలు, అనుభవం, ప్రత్యేక అవసరాలపై అవగాహన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా అభివృద్ధికి ఎంతో కీలకం. ఈ ఉపాధ్యాయులు, విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను అర్థం చేసుకుని, వారికి అనుకూలమైన పాఠ్యక్రమాలను రూపొందిస్తారు. వారు విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడంలో, వారి నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో, సమాజంలో సమానంగా ఉండేందుకు గల అవసరమైన నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు.

Also Read:  Tv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే!

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థుల విద్యా హక్కులను పునరుద్ధరించడానికి తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయంగా చెప్పవచ్చు. విద్యా రంగంలో సమానత్వాన్ని ప్రోత్సహించడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకం ద్వారా, ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమగ్రతను పెంచాలని ఆశిస్తోంది. ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకం, రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి దోహదపడనుంది. ఈ నిర్ణయం, ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులకు మరింత సౌలభ్యంగా ఉంటుంది. ఈ నిర్ణయం ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలను అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తోంది.ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఈ ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.

Also Read: Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

Also Read: Group 1: గ్రూప్-1 అవకతవకలపై పోరాటం చేస్తాం.. TGPSCపై కేసు వేస్తా: రాకేశ్ రెడ్డి

    Advertisment
    Advertisment
    Advertisment