Aghori First Marriage: అందుకే పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నా: మొదటి పెళ్లిపై అఘోరీ సంచలన వీడియో!

అఘోరీ తన మొదటిపెళ్లి వార్తలపై స్పందించింది. ‘‘రాధ అనే మహిళ నాపై తప్పుడు ప్రచారం చేస్తుంది. నాకు ఆమెతో పెళ్లే కాలేదు. ఆమె మొదటి భర్త చనిపోతే డిప్రెషన్ నుంచి కోలుకునేలా చేశాను. అందుకోసమే తాళి కడతా అన్నాను. కానీ కట్టలేదు. ఆధారలుంటే చూపించండి’’ అని తెలిపింది.

New Update

అఘోరీ ఎపిసోడ్ రచ్చకెక్కింది. ఇప్పటి వరకు అఘోరీ-శ్రీవర్షిణి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు అఘోరీయే నా మొదటి భర్త అంటూ ఓ మహిళ మీడియా ముందుకు రావడం సంచలనంగా మారింది. అఘోరీ  తననే మొదట పెళ్లి చేసుకున్నాడని.. ఆ తర్వాతే శ్రీవర్షిణీని పెళ్లి చేసుకున్నాడని ఆ మహిళ చెబుతోంది. 

Also Read : కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

వర్షిణీని పెళ్లి చేసుకుంటానన్న విషయం చెప్పి.. గత నెల మార్చిలో తన వద్దకు వచ్చి మెడలో ఉన్న తాళిని తీసుకుని వెళ్లిపోయాడని పేర్కొంది. అది మాత్రమే కాకుండా ఆమెతో అఘోరీ మాట్లాడిన ఒక ఆడియో కాల్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై అఘోరీ తాజాగా స్పందించింది. 

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

అఘోరీ ఫస్ట్  రియాక్షన్

‘‘రాధ అనే మహిళ ఒక లాయర్. ఆమెకు గతంలో మ్యారేజ్ అయింది. ఆమె భర్త వేరొకరితో వెళ్లిపోయాడు. దీంతో ఆమె తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఆ డిప్రెషన్ లోకి వెళ్లిన తర్వాత నాకు ఫోన్ చేసి జరిగిన విషయాలన్నీ నాకు చెప్పింది. తన భవిష్యత్తును కాపాడమని కోరింది. తనకు కాస్త తోడుండమని చెప్పింది.

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

అలా నన్ను అప్రోచ్ అయిన తర్వాత.. నేను ఆమెను కలిసాను. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పచ్చి అబద్దాలు. నేను ఆమెకు తాళి కట్టాను అనేది పూర్తిగా అవాస్తవం. నేను జనవరి 1న మధ్య ప్రదేశ్ లో ఉన్నాను. ఇప్పుడు ఆమె నామీద చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలు. నేను తాళి కట్టాను అని చెబుతుంది. దానికి ఏమైనా ప్రూఫ్స్ చూపించండి. పసుపు తాడు కడితే పెళ్లి కాదు.. ప్రూఫ్స్ ఉంటే చూపించండి. మరో విషయం ఏంటంటే.. ఆమె నా ఆడియో రికార్డింగ్ ఒక్కటే పెడుతుంది. మరి ఆమె మాట్లాడింది ఎందుకు పెట్టడం లేదు. 

Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!

స్వామి నువ్వు నాకు తోడుండు. నీకు ఆశ్రమం కడతాను. నన్ను కాపాడుకో అని ఆమె నాతో చెప్పింది. ఇవన్నీ ఏ ఉద్దేశంతో అన్నావు. నేను లవ్ యు మిస్ యు అనేది కామన్ గా ఉపయోగించే పదం. అందరినీ ప్రేమగా చూసుకోవడం కోసమే నేను అలా మాట్లాడతాను. అయినా ఆమె ఇప్పటి వరకు బయటకు రానిది.. ఇప్పుడు నేను వర్షిణీని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు ఎందుకు వచ్చింది. ఆమె డిప్రెషన్ లో చచ్చిపోతా అన్నప్పుడు సర్లే తాళి కడతాను అని చెప్పానే తప్ప.. తాళి కట్టలేదు.’’ అని అఘోరీ చెప్పుకొచ్చింది.

(Aghori Sri Varshini Lov | Aghori First Wife | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori Arrest: అఘోరీకి బిగ్ షాక్.. సంగారెడ్డి సబ్ జైలుకు తరలింపు- 14 రోజులు అక్కడే

అఘోరీకి చేవెళ్ల కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు (కంది జైలు) తరలించారు. అదే సమయంలో అఘోరీ నుంచి వర్షిణీని వేరు చేసి భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.

New Update

లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

14 రోజుల రిమాండ్

విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి భరోసా సెంటర్ అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇదే విషయంపై అఘోరీ తరఫు లాయర్ మాట్లాడుతూ.. ‘‘కోర్టులో ఇప్పుడు వాదోపవాదనలు ఏం జరగలేదు.  కోర్టు కేవలం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించి పూర్వపరాలు పరిశీలించి కేసు వాదించాలా లేదా అనేది జరుగుతుంది. కోర్టు తరఫున అడ్వకేట్‌ను పెట్టుకునే స్థోమత లేనివారికి కోర్టు నన్ను అపాయింట్ చేసింది. బెయిల్ గురించి ఇప్పుడే చెప్పలేం. కేసుకు సంబంధించి అన్నీ పరిశీలించిన తర్వాత ఒక టైం పడుతుంది. ’’ అని చెప్పుకొచ్చారు. 

కేసు ఏంటంటే?

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరీపై చీటింగ్ కేసు పెట్టింది. 6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది అఘోరీ .

క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరీ. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది.

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

aghori Arrest | lady aghori arrest | Lady Aghori Sri Varshini | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment