APSRTC: పండుగ వేళ ఆర్టీసీఅదిరిపోయే శుభవార్త..!

పండుగ వేళ ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.డాల్ఫిన్‌ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో 10 శాతం రాయితీతో టికెట్లు బుక్​ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

New Update
APSRTC గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ పై 10 శాతం డిస్కౌంట్!

APSRTC: పండగల సీజన్‌ మొదలైపోయింది. దీంతో స్కూళ్ల కు సెలవులు వచ్చేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు సొంతూర్లకు వెళ్దామా అని ఎదురు చూసే వారు ముందుగానే రైళ్లకు, బస్సులకు టికెట్లు బుక్‌ చేసుకునేందుకు రెడీ అయిపోతున్నారు.  ఈ సమయంలో బస్సుల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో బస్సుల సంఖ్య పెంచడం, టికెట్ ధరలు పెంపు, తగ్గింపులు సాధారణమే. 

ఈ క్రమంలోనే 10 శాతం రాయితీ అందిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ డాల్ఫిన్‌ క్రూయిజ్, అమరావతి బస్సులు ప్రయాణికులకు ఓ శుభవార్తను చెప్పింది. విజయవాడ టు హైదరాబాద్, బెంగళూరు నడుపుతున్న ఏపీఎస్‌ ఆర్టీసీ డాల్ఫిన్‌ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు ఆదివారం , శుక్రవారం  మినహా మిగిలిన రోజుల్లో టిక్కెట్ ఛార్జీలపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా ప్రజా రవాణాధికారి ఎం.వై దానం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు అమరావతి, డాల్ఫిన్‌ క్రూయిజ్ బస్సుల్లో ఎంజీబీఎస్‌కు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 770 ఉండగా, మిగిలిన రోజుల్లో 700 రూపాయలు, తదుపరి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం సాధారణ ఛార్జీ 830 రూపాయలు ఉండగా మిగిలిన రోజుల్లో రూ. 750గా నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు.అమరావతి మల్టీ యాక్సిల్‌ బస్సుల్లో ఆదివారం మెజిస్టిక్‌ బస్టేషన్‌ వరకు సాధారణ ఛార్జీ రూ.1870, మిగిలిన రోజుల్లో రూ.1700, ఆపై ప్రాంతాలకు ఆదివారం సాధారణ ఛార్జీ 1930, మిగిలిన రోజుల్లో రూ. 1750 గా రాయితీ కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.

హైదరాబాద్‌ టు విజయవాడ : హైదరాబాద్‌ టు విజయవాడ జర్నీ చేసేవారికి శుక్రవారం రోజు సాధారణ ఛార్జీ, మిగిలిన రోజుల్లో రాయితీ ఛార్జీ వసూలు చేస్తారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వెన్నెల స్లీపర్‌ ఏసీ బస్సుల్లో ఆదివారం మెజిస్టెక్‌ బస్‌ స్టేషన్‌ వరకు సాధారణ ఛార్జీ రూ. 2,170 ఉండగా, మిగిలిన రోజుల్లో 1970, ఆపై ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం రూ. 2210, మిగిలిన రోజుల్లో రూ. 2010 గా ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Also Read: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలే...వర్షాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment