AP : దొంగలుగా మారిన పోలీసులు.. రూ. 25 లక్షలు రీకవరీ చేసి..

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో పోలీసులే దొంగలుగా మారారు. ఓ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.. మొత్తం రూ.25 లక్షలు రీకవరీ చేసి.. అందులో రూ. 6 లక్షలు కొట్టేశారు. విషయం బయటకు రావడంతో ఐదుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు.

New Update
AP : దొంగలుగా మారిన పోలీసులు.. రూ. 25 లక్షలు రీకవరీ చేసి..

NTR District : ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ (Nandigama) లో దొంగతనాలను అరికాట్టాల్సిన పోలీసులే దొంగలు (Thieves) గా మారిన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా దొంగ నుంచే సొమ్ము నొక్కేశారు. వివరాల్లోకి వెళితే..  ఖమ్మం జిల్లా రైతులు ఈ నెల 17న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌కు ఓ లారీలో మిర్చి లోడ్‌ చేసి.. మైలవరానికి చెందిన డ్రైవర్‌ షేక్‌ ఖయీంకి ఇచ్చి పంపారు. క్లీనర్‌గా నందిగామ మండలం సోమవరం గ్రామానికి చెందిన పల్లెపోగు కోటేశ్వరరావు అనే వ్యక్తి వెళ్లాడు.

మిర్చి సరకు విక్రయించగా వచ్చిన రూ. 25 లక్షలు తీసుకుని వారు తిరిగి బయలు దేరారు. ఈ నెల 21న పాల్వంచ జంక్షన్‌ వద్ద క్లీనర్‌ కోటేశ్వరరావు లారీ దిగి వెళ్లిపోయాడు. నందిగామ మండలం జొన్నలగడ్డ వద్దకు వచ్చాక డ్రైవర్‌ ఖయీంకు అనుమానం వచ్చి చూసుకోగా లారీలో ఉంచిన డబ్బు కనిపించలేదు. దీనిపై డ్రైవర్‌ నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు జొన్నలగడ్డ చెక్‌పోస్టు వద్ద క్లీనర్‌ కోటేశ్వరరావును పట్టుకున్నారు.

Also Read: ఫార్మా బాధితులను పరామర్శించిన జగన్.. మా హయాంలోనే ఎక్కువ ప్రమాదాలు అంటూ..

అయితే, పోలీసులు అతడి వద్ద రూ. 25 లక్షలు స్వాధీనం చేసుకొని, అందులో రూ. 6 లక్షలు కొట్టేసి.. మిగిలిన రూ. 18.52 లక్షలు మాత్రమే దొరికినట్లు వారిపై అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ACP రవికిరణ్‌ నందిగామలో మాట్లాడుతూ.. చోరీ సొత్తు రూ. 18.52 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కానీ, లారీ డ్రైవర్ ఖయీం, రైతులు మాత్రం రూ. 25 లక్షలు చోరీకి గురైనట్లు వాపోయారు.

దీంతో క్లీనర్‌ కోటేశ్వరరావును విచారించగా, అసలు విషయం బయటపడింది. పోలీసులే రూ. 6 లక్షలు తీసుకున్నారని చెప్పాడు. వారిని విచారించగా, రూ.3.95 లక్షలు అప్పగించినట్లు సమాచారం. మిగిలిన మొత్తం గురించి ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కేసులో దొంగ నుండే సొమ్ము కొట్టిసేని ఐదుగురు పోలీసులను నిందితులుగా చేర్చి వారిని సస్పెండ్‌ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Bank Merger: మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్..

కేంద్ర ప్రభుత్వం 2025 మే 1వ తేదీ నుంచి "ఒకే దేశం – ఒకే ఆర్‌ఆర్‌బీ" విధానాన్ని అమలు చేయనుంది. ఈ నాలుగో దశలో.. దీని కింద 11 రాష్ట్రాల్లో ఉన్న 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నాయి.

New Update
banks

banks

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. నాలుగో విడత బ్యాంకుల విలీనంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 'ఒకే దేశం.. ఒకే ఆర్‌ఆర్‌బీ' ప్రణాళికను త్వరలో అమలులోకి తీసుకురాబోతుంది. దీని వల్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఏకీకరించి, ఒక్కో రాష్ట్రంలో సింగిల్‌ గ్రామీణ బ్యాంక్‌గా మార్చేయనున్నారు. దీంతో, దేశంలో ప్రస్తుతం ఉన్న 43 ఆర్‌ఆర్‌బీల సంఖ్య 28కి తగ్గనుంది. 2025 మే 1 నుంచి ఈ నాలుగో విడత బ్యాంకుల ఏకీకరణ అమల్లోకి రానుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

Also Read: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

ఈ నోటిఫికేషన్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో 4, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో తలో 3, బిహార్, గుజరాత్, జమ్ము అండ్ కశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌లలో తలో 2 RRB లు ఏకీకరణ కానున్నాయి. ఈ ప్రక్రియ తర్వాత, ఆయా రాష్ట్రాల్లో ఒక్కో గ్రామీణ బ్యాంక్ మాత్రమే ఉండనుందని సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్‌లు ఏకీకరణ అనంతరం 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్'గా మారనున్నాయి. మిగతా బ్యాంకుల పేర్లు కనిపించవు. ఈ బ్యాంక్ ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ బ్యాంక్‌గా వ్యవహరిస్తుంది. అదే విధంగా, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లోనూ ఒక్కో ఆర్‌ఆర్‌బీ మాత్రమే ఉండబోతుంది.

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

ఈ ఏకీకరణ ద్వారా  ప్రజా ప్రయోజనాలు, గ్రామీణ బ్యాంకుల ప్రయోజనాల దృష్ట్యా రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్, 1976ను అనుసరించి ఈ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 43 ఆర్‌ఆర్‌బీలు 21,856 శాఖలతో 26 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నాయి. ఈ బ్యాంకులు 28.3 కోట్ల మంది డిపాజిటర్లు, 2.6 కోట్ల మంది రుణగ్రహీతలకు రుణాలు అందజేస్తున్నాయి. ఏకీకరణతో, ఈ బ్యాంకులు మరింత బలమైన, సమర్థవంతమైన సంస్థలుగా మారి, గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సేవలను మెరుగుపరుస్తాయని అధికారులు అనుకుంటున్నారు.

చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతి వృత్తులవారికి రుణాలు అందించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ఈ బ్యాంకుల లక్ష్యం. ఒకప్పుడు దేశంలో 196 ఆర్‌ఆర్‌బీలు ఉండగా, 2004-05 నుంచి 2020-21 వరకు మూడు దశల్లో జరిగిన ఏకీకరణల వల్ల ఆ సంఖ్య 43కు తగ్గింది. ప్రస్తుతం చేపడుతున్న నాలుగో దశ ఏకీకరణతో ఈ సంఖ్య 28కి చేరనుంది. ఆర్‌ఆర్‌బీల్లో కేంద్ర ప్రభుత్వం 50 శాతం, స్పాన్సర్ బ్యాంక్ 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది, నాబార్డ్  పర్యవేక్షిస్తుంది.

ఆర్‌ఆర్‌బీలు గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను అందించడంతో పాటు, MGNREGA కార్మికుల వేతనాల చెల్లింపు, పెన్షన్ పంపిణీ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అంతేకాకుండా, లాకర్ సౌకర్యాలు, డెబిట్-క్రెడిట్ కార్డులు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, UPI సేవలను కూడా అందిస్తాయి. ఏకీకరణతో, ఈ సేవలు మరింత సమర్థవంతంగా, విస్తృతంగా అందుబాటులోకి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Also Read: Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది

Also Read: Waqf Amendment Act: అమలులోకి వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2025.. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం

banks | merge | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment