పవన్ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలి: మంత్రి రోజా

పవన్ కళ్యాణ్ వల్ల ఎంత మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంస్థ.. పవన్ కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని రోజా..

New Update
పవన్ వల్ల ఎంతమంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలి: మంత్రి రోజా

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అమ్మాయిల అదృశ్యంపై చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపాయి. ఆంధ్రప్రదేశ్ లో బాలికలు, మహిళలపై కేంద్ర ప్రభుత్వం లెక్కలు బయటపెట్టడంతో మరోసారి అధికార పార్టీ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాయి. మంత్రులు, వైసీపీ నేతలు వరుసగా పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి ఆర్కే రోజా కూడా జనసేనానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఆర్కే రోజా.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వల్ల ఎంత మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంస్థ.. పవన్ కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.

మరోవైపు చంద్రబాబుపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. హెరిటేజ్ ల గంజాయి, నారావారి పల్లిలో ఎర్రచందనం దొరుకుతుందని ఆరోపణలు చేశారు. రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబే అంటూ మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సీమ ప్రాజెక్టులను పరిశీలించే అర్హత లేదని వ్యాఖ్యానించారు మంత్రి రోజా.

మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై గురువారం కూడా మంత్రి రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబుది 420 విజన్ అని, చంద్రబాబుకు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఏనాడు లేదని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారంటూ మంత్రి ఆర్కే రోజా మండిపడిన విషయం విదితమే.

ప్రజలకు ఉపయోగపడే విజన్ ఏ నాడైన కనిపెట్టారా.. అమ్మఒడి , రైతు భరోసా, నేతన్న నేస్తం మీ పాలనలో ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. సీఎం జగనన్న తండ్రికి మించిన తనయుడిగా ప్రజాదరణ అందుకుంటున్నారని.. పాదయాత్రలో ప్రజలు కష్టాలు దగ్గర నుంచి చూసి, అధికారంలో రాగానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.

కాగా కేంద్రం ప్రకటించిన డేటా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 2019 నుండి 2021 మధ్య 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపారు. 2019లో 2,186 మంది బాలికలు, 6,252 మంది మహిళలు, 2020లో 3,374 మంది బాలికలు, 7,057 మంది మహిళలు, 2021లో 3,358 మంది బాలికలు, 8,869 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు