Ambani Wedding: అంబానీ ఇంట అంబరాన్నంటుతున్న పెళ్లి సంబరాలు.. తరలివచ్చిన తారాలోకం!

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి. అనంత్-రాధికల వివాహం ఈ రోజు రాత్రి 9.30కు ముంబై జియో వరల్డ్‌ సెంటర్‌లో కన్నుల పండువగా జరగనుంది. ఈ వేడుకకు ప్రపంచ నలుమూలలనుంచి ప్రముఖులు తరలివస్తున్నారు.

New Update
Ambani Wedding: అంబానీ ఇంట అంబరాన్నంటుతున్న పెళ్లి సంబరాలు.. తరలివచ్చిన తారాలోకం!

Anant Ambani-Radhika Merchant Wedding: అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంటి పెళ్లి సంబరాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ముఖేష్ చిన్న కొడుకు అనంత్‌ అంబానీ-రాధికల మ్యారేజ్‌ల మ్యారేజ్ ఈ రోజు రాత్రి 9.30కు ముంబై జియో వరల్డ్‌ సెంటర్‌లో జరగనుండగా కాసేపట్లో ఊరేగింపుగా జియోవరల్డ్‌ సెంటర్‌కు వధూవరులు వెళ్లనున్నారు. ఇక ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న ఈ వేడుకకోసం ప్రపంచ నలుమూలలనుంచి బడా వ్యాపార, రాజకీయ వేత్తలు, సినీ తారలతోపాటు ప్రముఖులు ముంబైకి తరలివచ్చారు.

ఈ క్రమంలో ముంబై ఎయిర్ పోర్టు దగ్గర టాలీవుడ్‌, బాలీవుడ్‌, హాలీవుడ్‌ తారల కోలాహలం నెలకొంది. ఈ పెళ్లి వేడుకకు టాలీవుడ్ నటుడు మహేష్ బాబు న్యూలుక్‌లో దర్శనమివ్వగా.. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, విక్కీ కౌశల్, షాహిద్ కపూర్, అలియా భట్, రణబీర్ కపూర్ కూడా అనంత్ రాధికల వివాహానికి హాజరవుతున్నారు.

అలాగే బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ముంబైకి చేరుకోగా.. ఏపీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్‌, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌, పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. ఇక క్రీడా ప్రపంచం నుంచి డేవిడ్ బెక్‌హామ్, కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీలు కూడా ఈ వివాహానికి హాజరై పెళ్లి వేడుకలో సందడి చేయనున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Stock Market: నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..

ట్రంప్ టారీఫ్ ల దెబ్బతో కుదేలైపోయిన స్టాక్ మార్కెట్ ఈరోజు కాస్త కోలుకుంది. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయం నుంచే లాభాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 1100  పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతున్నాయి.

New Update
stock market

stock market

 స్టాక్ మార్కెట్లో ఇంతలా డైనమిక్ ఛేంజ్ లు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరేమో. నిన్న మార్కెట్లు అధ:పాతాళానికి వెళ్ళి కోట్ల రూపాయలు కరిగిపోయాయి. భారత స్టాక్ మార్కెట్ ఈ ఏడాదిలో రెండవ అతిపెద్ద పతనాన్ని చూసింది. సెన్సెక్స్ 2226 పాయింట్లు (2.95%) పడిపోయి 73,137 వద్ద ముగిసింది. నిఫ్టీ 742 పాయింట్లు (3.24%) పడిపోయి 22,161 వద్ద ముగిసింది. అంతకుముందు జూన్ 4వ తేదీ 2024లో మార్కెట్ 5.74% పడిపోయింది. మరోవైపు ప్రపంచ మార్కెట్ పరిస్థితి కూడా అలానే ఉంది. 

Also Read :  మియాపూర్‌లో లారీ బీభత్సం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి.. మరో ఇద్దరికి సీరియస్!

Also Read :  అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. కాళ్లు, చేతులకు గాయాలు!

ఆసియా మార్కెట్లలో వృద్ధి..

కానీ ఈరోజు ఉదయానికి పరిస్థితి అంతా మారిపోయింది. నష్టాల్లో ఉన్న సూచీలు ఈరోజు మార్కెట్ ప్రారంభం నుంచే లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 1100 (1.60%) పాయింట్లకు పైగా లాభంతో 74,300 స్థాయిలో ట్రేడవుతోంది. అదే సమయంలో, నిఫ్టీ కూడా దాదాపు 400 (1.70%) పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లోని అన్ని స్టాక్స్ అంటే  30 స్టాక్స్ లాభాల్లో పయనిస్తున్నాయి. ముఖ్యంగా మెటల్, ఆటో షేర్లు బాగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆసియా మార్కెట్లలో పెరుగుదల వల్లనే భారతీయ మార్కెట్ లాభాలు చూస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఆసియా మార్కెట్లలో.. జపాన్ నిక్కీ ఇండెక్స్ దాదాపు 6% పెరిగింది. అలాగే హాంకాంగ్ ఇండెక్స్ కూడా 2% పెరిగింది. వీటితో పాటూ NSE అంతర్జాతీయ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడవుతున్న నిఫ్టీ కూడా 1.5% పెరిగింది. ఇది మార్కెట్లో అప్‌ట్రెండ్‌ను సూచిస్తుంది.  అలాగే నిఫ్టీ 50, సెన్సెక్స్ చార్టులు ఓవర్‌సోల్డ్ RSI స్థాయిలను చూపుతున్నాయి. ఇది షార్ట్-కవరింగ్ , కొత్త కొనుగోళ్లకు దారితీస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Also Read: Bengaluru: బెంగళూరులో లైంగిక వేధింపులు కామన్..హోంమంత్రి పరమేశ్వర వివాదాస్పద కామెంట్స్!

Also Read: Trump Tariffs: ట్రంప్ సుంకాల దెబ్బకు పడిపోయిన చమురు ధరలు..కంగారులో రష్యా

 

nifty | sensex | today-latest-news-in-telugu | Stock Market Today | business news telugu | telugu business news | telugu-news | latest-telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment