Ambati Rayudu: అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చా..అంబటి రాయుడి వివరణ!

ప్రొఫెషనల్‌ ఆటకు , రాజకీయాలకు సంబంధం ఉండకూడదు కాబట్టే నేను వైసీపీకి గుడ్‌ బై చెప్పినట్లు క్రికెటర్‌ అంబటి రాయుడు పేర్కొన్నారు. వైసీపీలో చేరిన పది రోజులకే పార్టీని విడడంతో వైసీపీ మీద ఇతర పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

New Update
Ambati Rayudu: అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చా..అంబటి రాయుడి వివరణ!

Ambati Rayudu: వైసీపీ (YCP) లో చేరిన వారం రోజులకే పార్టీ నుంచి బయటకు వెళ్లారు క్రికెటర్‌(Cricketer) అంబటి రాయుడు(Ambati Rayudu). ఈ క్రమంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిన తరువాత అంబటి ఓ ఆసక్తికర ట్వీట్‌ చేశారు.

సంబంధం ఉండకూడదనే..

ఆ ట్వీట్‌ లో '' నేను అంబటి రాయుడిని..జనవరి 20 నుంచి దుబాయ్‌ వేదికగా జరిగే ఐఎల్టీ 20 లో ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.ప్రొఫెషనల్‌ ఆటలో ఆడేందుకు నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదు'' అని పేర్కొన్నారు. అంబటి రాయుడు వైసీపీలో గత వారం చేరగా..నిన్న పార్టీకి గుడ్‌ బై చెప్పి బయటకు వచ్చేశారు. వైసీపీ విడిచిపెడుతున్నానని, కొన్నాళ్లు పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

అతి త్వరలోనే తన తరువాత ప్లానింగ్ ఏంటనేది తెలియజేస్తానని రాయుడు ట్వీట్‌ చేశారు. పార్టీలో చేరిన వారం రోజుల్లోనే రాయుడు పార్టీని విడటం గురించి టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీలో కనీసం వారం రోజుల పాటు కూడా పార్టీలో మనుగడ కొనసాగించలేకపోతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

పది రోజులకే..

దీనికి కారణం ఆ పార్టీలోని ప్రతికూల పరిస్థితులే అంటూ టీడీపీ ఆరోపణలు చేసింది. కానీ అంటి ట్వీట్‌ ఆ విమర్శల పై క్లారిటీ ఇచ్చింది. డిసెంబర్ 28న తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పిన సీఎం జగన్‌ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు.

రాజకీయాలతో తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తున్నట్లు రాయుడు వారం క్రితం ప్రకటించారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరటం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని.. ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు.

అంతలోనే పార్టీ నుంచి బయటకు వెళ్తున్నట్లు ట్వీట్‌ చేసి రాయుడు అందరికీ షాక్‌ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి ట్వీట్‌ ద్వారా తాను ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చాను అనే దాని మీద క్లారిటీ ఇచ్చాడు.

Also read: టమోటాకి ,పొటాటొకి తేడా తెలియని ముఖ్యమంత్రి జగన్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఏపీ సర్కార్ మైనరిటీల కోసం కొత్త పథకం తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. చిన్నతరహా యూనిట్ల ఏర్పాటుకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకూ సబ్సిడీపై రుణాలు పొందవచ్చు. ఈ నెల 25 నుంచి దరఖాస్తు ప్రారంభం అయ్యింది.

New Update
cm chandra babu

cm chandra babu

ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. మైనారిటీల అభివృద్ధే ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలను అందిస్తుంది. వ్యవసాయం, రవాణా, అనుబంధ రంగాలు, సేవా, వ్యాపార, పరిశ్రమ రంగాలలో స్వయం ఉపాధి పథకాల కోసం రుణాలు అందిస్తుంది. 

Also Read: ఏపీలో పాకిస్తాన్‌ కాలనీ.. ఆ పేరు ఎలా వచ్చింది - షాకింగ్ ఫ్యాక్ట్స్!

ఈ పథకం ద్వారా మైనారిటీ నిరుద్యోగ యువతకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు రుణం ఇస్తారు. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా మైనారిటీ సంక్షమ శాఖ రిలీజ్ చేసింది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, కార్పెంటరీ వంటి వాటిలో కూడా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఇటీవల కూటమి ప్రభుత్వం ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.173.57 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 

Also Read: చైనా సహాయం కోరిన పాక్.. భారత్తో ఏ క్షణమైనా యుద్దం!

మైనారిటీ నిరుద్యోగ యువతకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఈ నిధులను అందించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఏప్రిల్ 25 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా వచ్చే నెల అంటే మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Also Read :  అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌.. ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్

అర్హతలు

ఆసక్తిగల దరఖాస్తు దారుడు మైనారిటీ వర్గానికి (ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు) చెందినవాడై ఉండాలి. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి అయి ఉండాలి.

21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.

Also Read :  ప్రియుడిని ఇంటికి పిలిచి.. భర్తను ఉరేసి లేపేసింది!

వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతంలో ఏడాదికి రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాలలో రూ.1,50,000 ఉండాలి. 

ఎవరైతే ఈ పథకానికి అప్లై చేయాలనుకుంటున్నారో.. స్వయం ఉపాధి పథకాల రవాణా రంగానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

జనరిక్ ఫార్మసీ పథకాలకు డి.ఫార్మసీ / బి.ఫార్మసీ / ఎం.ఫార్మసీ అర్హత కలిగి ఉండాలి.

https://apobmms.apcfss.in/  లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాలి. https://apobmms.apcfss.in/RegistrationForm రిజిస్ట్రేషన్ ఫామ్‌లో డీటెయిల్స్ నింపాలి.

andhra-pradesh | cm-chandra-babu | ap-govt | ap-govt-schemes

Advertisment
Advertisment
Advertisment