IPL 2024 : ధోని మళ్ళీ ఐపీఎల్ ఆడటం వాళ్ళ చేతుల్లోనే ఉంది : అంబటి రాయుడు

ఐపీఎల్ లేటెస్ట్ సీజన్ లో చెన్నైప్లే ఆఫ్స్ కి వెళ్ళకపోవడం నేపథ్యంలో నెక్స్ట్ సీజన్ లో మళ్ళీ ధోని ఆడటం చూస్తామా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవ్వగా.. అంబటి రాయుడు మాత్రం కచ్చితంగా ధోని ఆటను మళ్ళీ చూస్తామని, కాకపోతే అది BCCI చేతుల్లోనే ఉందని చెప్పాడు.

New Update
IPL 2024 : ధోని మళ్ళీ ఐపీఎల్ ఆడటం వాళ్ళ చేతుల్లోనే ఉంది : అంబటి రాయుడు

Ambati Rayudu About MS Dhoni : ఐపీఎల్ (IPL 2024) లేటెస్ట్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్లే ఆఫ్స్ కి వెళ్ళకపోవడం ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ విషయంలో బాగా డిసప్పాయింట్ అయిన వారిలో మాజీ చెన్నై ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) కూడా ఉన్నాడు. ఆ మ్యాచ్ ఓడిపోవడంతో రాయుడు భావోద్వేగానికి సైతం లోనయ్యాడు.

అయితే చెన్నై ఓడిపోయిన నేపథ్యంలో నెక్స్ట్ సీజన్ లో మళ్ళీ ధోని ఆడటం చూస్తామా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవ్వగా.. రాయుడు మాత్రం కచ్చితంగా ధోని (Dhoni) ఆటను మళ్ళీ చూస్తామని, కాకపోతే అది BCCI చేతుల్లోనే ఉందని చెప్పడం గమనార్హం.

Also Read : బెంగ‌ళూరు, చెన్నై మ్యాచ్‌లో డ్యాన్స్ తో అదరగొట్టిన అందాల భామ.!

ధోని వచ్చే సీజన్ లో కచ్చితంగా ఆడతాడు.. కానీ?

" ధోనికి ఇది లాస్ట్ మ్యాచ్ అని నే అనుకోవడం లేదు. ఆయన క్రికెట్ కి ముగింపు పలకకూడదని గట్టిగా కోరుకుంటున్నా.. RCB తో మ్యాచ్ ఎండింగ్ లో అవుట్ అవ్వడంతో ధోని కాస్త నిరుత్సాహానికి లోనయ్యాడు. గతంలో అతన్ని అలా ఎప్పుడూ చూడలేదు.

ధోని గురించి మీకెవ్వరికీ తెలీదు. కచ్చితంగా నెక్స్ట్ సీజన్ లో గ్రౌండ్ లోకి దిగుతాడు. ఇంపాక్ట్ రూల్ తో అతఃని ఆటను మళ్ళీ చూసే ఛాన్స్ ఉంది. అయితే ఈ రూల్ ను BCCI కొనసాగిస్తేనే అది జరుగుతుంది. మేమంతా ధోని ఆటను మళ్ళీ చూడాలని కోరుకుంటున్నాం. కాబట్టి అది ఇప్పడు BCCI నిర్ణయంపైనే ఆధారపడి ఉంది" అని తెలిపాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam attack: మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలి.. కాల్పుల ముందు టెర్రరిస్ట్ మాటలు (VIDEO)

జమ్మూ కాశ్మీర్‌‌లో పర్యటకులపై ఫైరింగ్ ముందు టెర్రరిస్టులు వారితో మాట్లాడారు. పేరు, మతం అడిగి మహిళ కళ్లముందే ఆమె భర్తని చంపారు. అయితే ఆమెని కూడా చంపమని టెర్రరిస్ట్‌ను అడిగింది. జరిగింది మోదీకి చెప్పడానికి నువ్వు బతికుండాలని ఉగ్రవాది అన్నట్లు తెలుస్తోంది.

New Update
Pahalgam attack 123

జమ్మూ కాశ్మీర్ టెర్రర్ అటాక్‌పై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాల్పులు జరిగిన సమయంలో టూరిస్టులతో ఉగ్రవాదులు మాట్లాడారు. పర్యటకులందరినీ తుపాకులతో బెదిరించి మోకాళ్లపై కూర్చోబెట్టారని ప్రత్యేక సాక్షులు మీడియాకు తెలిపారు. టూరిస్టుల పేరు, మతం అడిగి ముస్లింలు కానివారిని కాల్చి చంపారని ప్రత్యేక్ష సాక్షి పల్లవి చెబుతున్నారు. ఆమె భర్త తన పేరు మంజునాథ్ అని చేప్పగానే అతన్ని కాల్చి చంపారని ఆమె తెలిపారు. తనని కూడా చంపమని ఆమె ఉగ్రవాదులను వేడుకుందట. ఇక్కడ జరిగిందంతా మోదీకి చెప్పడానికి నువ్వు బతికే ఉండాలని ఓ టెర్రరిస్ట్ ఆమెతో అన్నాడని తెలుస్తోంది. టెర్రిస్టులు కాల్పులకు ముందు పర్యటకులతో మాట్లాడిని సంభాషణ గురించి సోషల్ మీడియాలో వీడియోస్ వైరల్ అవుతున్నాయి.

Also read: J&K Terror Attack: ‘పేరు, మతమేంటిని అడిగి.. ముస్లింలు కానివారిని కాల్చి చంపేశారు’

అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్‌లో మంగళవారం సాయంత్రం టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 30మంది మృతి చెందారు. కాల్పుల్లో మరో 20 మంది గాయపడ్డారు. ది రెసిస్టెంట్ ఫ్రంట్(TRF) అనే ఉగ్రవాద సంస్థనే దాడి చేసినట్లు ప్రకటించింది. పక్కా ప్లాన్ ప్రకారమే ఉద్రవాదులు కాల్పులు జరిపారు. ఇండియన్ ఆర్మీ యూనిఫాంలో వచ్చి ఆకస్మాత్తుగా ఫైరింగ్ చేశారని ప్రత్యేక్ష సాక్షులు, క్షతగాత్రులు చెబుతున్నారు.

Also read: J&K Terror Attack : పాపం.. హనీమూన్కు వచ్చి కట్టుకున్న భర్తను కోల్పోయింది( Video Viral)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు