తండ్రిపై అల్లు అర్జున్ సంచలన ఆరోపణలు.. ఆ సినిమా డబ్బులివ్వలేదంటూ

అల్లు అర్జున్ తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్ తో ఫైనాన్సియల్ రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిరంజీవి ‘విజేత’ సినిమాతో బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బన్నీ.. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన అల్లు అరవింద్ తనకు రెమ్యూనరేషన్ ఇవ్వలేదన్నారు.

New Update
తండ్రిపై అల్లు అర్జున్ సంచలన ఆరోపణలు.. ఆ సినిమా డబ్బులివ్వలేదంటూ

Allu Aravind : పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) తో తనకున్న ఫైనాన్సియల్ రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం 'పుష్ప 2' మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ విరామ సమయాల్లో సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలకరిస్తూ పలు అప్ డేట్ లతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన చిన్న నాటి ఓ బ్యూటిఫుల్ ఫొటోను ఇన్ స్టా వేదికగా షేర్ చేసి అభిమానులను ఫిదా చేశారు. అంతేకాదు ఈ ఫొటోకు సంబంధించి ఓ ప్రత్యేక స్టోరీని కూడా వెల్లడించారు.

ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చిరంజీవి(Chiru) హీరోగా వచ్చిన ‘విజేత’(Vijetha) సినిమాకు సంబంధించి తన క్యారెక్టర్ ఫొటోను పంచుకున్న బన్నీ.. ఇందులో బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలిపాడు. అయితే దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాని అల్లు అరవింద్‌ నిర్మించగా.. సినిమాకుగాను తనకు తండ్రి అరవింద్ రెమ్యునరేషన్‌ ఇవ్వలేదంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ‘మా నాన్న నాకు రెమ్యునరేషన్‌ ఇవ్వలేదు’ అని ఫోటోకు క్యాప్షన్ రాసుకొచ్చారు. దీనికి స్మైలీ ఎమోజీ జోడించగా ఇందులో ‘విజేత’ 100 రోజుల జ్ఞాపికతోపాటు అరవింద్‌ నవ్వుతూ కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్ తెగ వైరల్ అవుతుండగా మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. బన్నీ గతాన్ని ఇప్పుడు పోలుస్తూ పొగిడేస్తున్నారు. అలాగే బన్నీ, అరవింద్ మధ్య ఉన్న తండ్రికోడుకుల బంధం గురించి చర్చిస్తున్నారు. ఇదిలావుంటే.. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా బన్నీ నటించిన రెండో సినిమా ‘స్వాతిముత్యం’. మరోవైపు, హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు ‘డాడీ’లో అతిథి పాత్రలో కనిపించారు.

ఇది కూడా చదవండి : ఓటీటీలోకి ‘యానిమల్‌’.. మరో 9 నిమిషాల నిడివి పెంచుతున్న డైరెక్టర్!

ఇక సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న 'పుష్ప' సీక్వెల్ 2024 ఆగస్టు 15న విడుదల కానుంది. ఇక మొదటిపార్ట్ పాన్ ఇండియా రేంజ్ లో భారీ హిట్ సాధించగా.. బాక్సాఫీస్ వద్ద దండిగా వసూళ్లు రాబట్టింది. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా సమంత ఐటమ్ సాంగ్ లో మెరిసి కుర్రాళ్లను ఊపేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు