Teacher jobs: స్పెషల్ బీఈడీ చేసిన వారికి లక్కీ ఛాన్స్.. వారికోసం ఎన్ని పోస్టులంటే?

తెలంగాణలో రాబోయే మెగా డీఎస్సీలో స్పెషల్ ఎడ్యూకేషన్ అభ్యర్థులకు పోస్టులు కేటాయించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ టీచర్ పోస్టులు స్కూల్‌ అసిస్టెంట్‌, సెకండరీ గ్రైడ్‌ టీచర్‌ తోపాటు తోపాటు నాన్ టీచింగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

New Update
Teacher jobs: స్పెషల్ బీఈడీ చేసిన వారికి లక్కీ ఛాన్స్.. వారికోసం ఎన్ని పోస్టులంటే?

Telangana Dsc: తెలంగాణలో గత ప్రభుత్వం విడుదలచేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ మరిన్ని పోస్టులను జతచేస్తూ 11062లకు గానూ కొత్త నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. అయితే జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య పెంచగా స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్ పండిట్, ఉపాధ్యాయులు, ఎస్జీటీ పోస్టులతో పాటు ఈసారి కొత్తగా స్పెషల్‌ ఎడ్యూకేషన్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు.

స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్‌..
ఈ మేరకు మంచిర్యాల జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 70, లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టులు 16, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు 3, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు 176 ఉన్నాయి. మొత్తం 265 సాధారణ టీచర్‌ పోస్టులతో పాటు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 5, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ సెకండరీ గ్రైడ్‌ టీచర్‌ పోస్టులు 18, రెండు విభాగాల్లో కలిపి 23 పోస్టులున్నాయి. అన్ని టీచర్‌ పోస్టులు కలిపి జిల్లాలో 288 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజ్ చేశారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు బీఈడీ, ఎస్‌జీటీ పోస్టుకు టీటీసీ, లాంగ్వేజ్‌ పండిట్‌ పోస్టులకు టీపీటీ, హెచ్‌పీటీ ఉత్తీర్ణత తోపాటు టెట్‌ అర్హత తప్పనిసరి. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తిచేసి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: TS DSC: 4 లక్షల మంది బీఈడీ అభ్యర్థులకు నిరాశ!

అలాగే ఈసారి అభ్యర్థుల వయసు మరో రెండేళ్లు పొడగించగా పోటీదారుల సంఖ్య పెరగనుంది. డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే వారి నిర్ధిష్ట వయస్సును 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచారు. అంతేకుండా ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్యా బోధన చేసేందుకు కొత్తగా పోస్టులను ప్రవేశ పెట్టారు. దీంతో బీఈడీ, డీఈడీ స్పెషల్‌ ఎడ్యూకేషన్‌ కోర్సు చేసిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. పాత నోటిఫికేషన్‌లో ప్రకటించిన పోస్టులకు తోడు మరిన్ని పోస్టులను కలిపి నోటిఫికేషన్‌ జారీ చేయడంతో అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓసీ అభ్యర్థులకు 46 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 51 ఏళ్లు, దివ్యాంగులకు 56 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TGPSC : గ్రూప్-1పై ఆరోపణలు.. బీఆర్ఎస్ నేతకు TGPSC నోటీసులు

బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్‌ రెడ్డికి టీజీపీఎస్సీ పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 ఫలితాల విషయంతో తప్పుడు ఆరోపణలు చేశారని రాకేశ్‌రెడ్డికి కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. వారంలో రోజుల్లో సమాధానమిచ్చి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

New Update
TGPSC notices to BRS leader

TGPSC notices to BRS leader

భారతరాష్ట్రసమితి (బీఆర్ఎస్) నాయకుడు ఏనుగుల రాకేష్‌ రెడ్డికి టీజీపీఎస్సీ(TGPSC) పరువునష్టం దావా నోటీసులు జారీ చేసింది. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల విషయంతో తప్పుడు ఆరోపణలు చేశారని రాకేశ్‌రెడ్డికి ఈ మేరకు కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. వారంలో రోజుల్లో సమాధానమిచ్చి క్షమాపణలు చెప్పాలని కమిషన్ డిమాండ్ చేసింది. లేదంటే పరువునష్టం, క్రిమినల్‌ కేసులు బుక్‌ చేస్తామని హెచ్చరించింది. ఇకపై భవిష్యత్తులో టీజీపీఎస్సీపై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని ఆంక్షలు విధించింది.

Also Read: మహేష్ హీరోయిన్ పై కన్నేసిన బన్నీ..!

TGPSC Notices To BRS Leader

కాగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో గోల్ మాల్ జరిగిందని, గ్రూప్ 1 పేపర్లను పదో తరగతి, ఇంటర్ పేపర్ల కంటే అధ్వాన్నంగా దిద్దారో విశ్లేషిస్తూ ఏనుగుల రాకేష్ రెడ్డ ఒక పత్రికలో ఆర్టికల్ రాశారు.రాసిన ఆర్టికల్ ను సోషల్ మీడియాలో ఫోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. అంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TGPSC) ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో అనేక అవకతవకలు జరిగాయని రాకేశ్ రెడ్డి  తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు రాసిన వారిలో 40% మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారని, కాని వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకులో ఎందుకు లేరని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెయిన్స్ పరీక్షలు మొత్తం 46 కేంద్రాల్లో జరగగా కేవలం 2 కేంద్రాల్లోనే 72 మంది ఎలా టాప్ ర్యాంక్ పొందారో చెప్పాలని కమిషన్ ను డిమాండ్ చేశారు. అలాగే 25 సెంటర్ల నుంచి ఒక్కరు కూడా టాప్ లో లేకపోవడం వెనుక గల మతలబు ఏమిటో చెప్పాలని నిలదీశారు.

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందని ఆధారాలను సైతం సేకరించి అభ్యర్థులు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్‌ నేత ఏనుగుల రాకేశ్‌ రెడ్డి మండిపడ్డారు. రిజర్వేషన్ క్యాటగిరీల్లో మొదట 33 మందిని భర్తీ చేసినప్పుడు జాతీయ స్థాయి క్రీడల్లో రాణించిన అనేక మంది అభ్యర్థులను కాదని ఎటువంటి ప్రతిభ చూపకుండా దొంగ సర్టిఫికెట్లు పెట్టినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వచ్చినా, ఫిర్యాదులు చేసినా మూడు సార్లు సర్టిఫికెట్లు పరిశీలించి కూడా ఇప్పటికీ ఆ నివేదికను ప్రభుత్వం బయట పెట్టడం లేదని విమర్శించారు. కాగా రాకేశ్ రెడ్డి ఆరోపణలను ఖండించిన టీజీపీఎస్సీ ఆయనకు నోటీసులు జారీ చేసింది . వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే కేసు పెడుతామని హెచ్చరించింది.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read: 'మంగపతి' గెటప్‌లో శివాజీ స్పెషల్ వీడియో వైరల్

 

anugula-rakesh-reddy | tgpsc latest news | tgpsc-group-1-exam | tgpsc-group-1 | telangana-jobs | latest-telugu-news | telugu-news | today-news-in-telugu

Advertisment
Advertisment
Advertisment