Alleti Maheshwar Reddy: రేవంత్ పాలనలో చీకటి జీవోలు, చీకటి ఒప్పందాల: ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి

TG: చీకటి జీవోలు, చీకటి ఒప్పందాలతో సీఎం రేవంత్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ప్రాజెక్టులన్నీ ఏపీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా? అని ప్రశ్నించారు.

New Update
Alleti Maheshwar Reddy: రేవంత్ పాలనలో చీకటి జీవోలు, చీకటి ఒప్పందాల: ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి

Alleti Maheshwar Reddy: అవినీతి టెండర్లను రద్దు చేసి, గ్లోబల్‌ టెండర్లను పిలవాలని డిమాండ్‌ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి. రాష్ట్రంలో దొంగలు పడ్డారు, పట్టపగలే దోచుకుంటున్నారని కాంగ్రెస్ (Congress) ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు తెలియకుండా దొంగ జీవోలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. పనులన్నీ ఏపీ గుత్తేదారులకు ఇస్తున్నారని గతంలో రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) విమర్శించారని అన్నారు. ఈ ప్రభుత్వం కూడా అన్నీ ఏపీ గుత్తేదారులకే అప్పగిస్తోందని అన్నారు. తెలంగాణలో కాంట్రాక్టర్లు లేరా అని.. సీఎంను ప్రశ్నించారు. చీకటి జీవోలు, చీకటి ఒప్పందాలతో దోచుకుంటున్నారని మండిపడ్డారు. దొంగలు పోయి.. గజదొంగలు వచ్చినట్లుగా తెలంగాణలో పరిస్థితి తయారైందని అన్నారు.

Also Read: జాబ్ క్యాలెండర్ పై రేవంత్ కీలక ప్రకటన.. పరీక్షల వాయిదాలపై ఏమన్నారంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు