Food poison: యూనివర్సిటీ హాస్టల్‌ లో ఫుడ్‌ పాయిజినింగ్‌..300 మంది విద్యార్థినులకు అస్వస్థత!

అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌(Muslim university campus)  లోని లేడీస్‌ హాస్టల్‌ లో మంగళవారం రాత్రి భోజనం చేసిన తరువాత వాంతులు, ఇతర అనారోగ్య కారణాలతో 300 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

New Update
Food poison: యూనివర్సిటీ హాస్టల్‌ లో ఫుడ్‌ పాయిజినింగ్‌..300 మంది విద్యార్థినులకు అస్వస్థత!

లక్నోలోని ఓ యూనివర్సిటీ హాస్టల్‌ లో ఫుడ్‌ పాయిజనింగ్‌ (Food poison) జరగడంతో 300 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లని అలీగఢ్‌లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌(Muslim university campus)  లోని లేడీస్‌ హాస్టల్‌ లో మంగళవారం రాత్రి భోజనం చేసిన తరువాత వాంతులు, ఇతర అనారోగ్య కారణాలతో 300 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

అలీఘడ్‌ లోని ముస్లిం యూనివర్సిటీ లేడీస్‌ హాస్టల్ లో సుమారు 1500 మంది విద్యార్థినులు ఉన్నారు. ఎప్పటిలాగానే గత రాత్రి కూడా వారంతా భోజనం చేసి హాస్టల్‌ కి వెళ్లి పోయారు.కొద్ది సేపటి తరువాత విద్యార్థినులు అందరూ ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు.

Also read: నాసాను తోసి..రోదసీలో ఇస్రో జెండా పాతేంగే..రానున్న 20 ఏళ్ల లక్ష్యాలివే..!!

క్రమక్రమంగా వారి సంఖ్య పెరిగి 300 కి చేరుకుంది. వాంతులు బాగా అవ్వడంతో వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించడం జరిగింది. యూనివర్సిటీలోని విద్యార్థినులు చికిత్స కోసం మెడికల్‌ కాలేజీకి చేరుకున్నారన్న సమచారం ఆరోగ్య శాఖ అధికారులకు యూనివర్సిటీ అధికారులు సమాచారం అందించారు.

దీంతో వారు హుటాహుటిన హాస్టల్‌ మెస్‌ కు చేరుకున్నారు. వారు విద్యార్థినులు తిన్న భోజనం, డైనింగ్‌ హాల్‌ నుంచి కొన్ని ఆహార నమూనాలను సేకరించి పరీక్ష కోసం ల్యాబ్‌ కి పంపారు. ఈ సంఘటన గురించి విచారణ చేపట్టినట్లు యూనివర్సిటీ ప్రతినిధి తెలిపారు.
దీని గురించి ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు.

యూనివర్సిటీలోని ప్రొఫెసర్లతో సమావేశం కూడా నిర్వహించినట్లు వారు వెల్లడించారు. యూనివర్సిటీ హాస్టల్ కోసం ఆహార పదార్థాల కొనుగోలులో అక్రమాలు, నాసిరకం పదార్థాల సరఫరా వల్లే ఇలా జరిగినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు జరగడం పరిపాటిగా మారింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్

రన్నింగ్ ట్రైన్‌లో ప్యాసింజర్ ఫోన్ కొట్టేయాలనుకున్న దొంగని కి.మీ ఈడ్చుకెళ్లారు. ఇది బీహార్ భాగల్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర జరగ్గా.. సోషల్ మీడియాలో వీడియో వైరలవుతోంది. కిటికీలోంచి ఫోన్ లాక్కొని పారిపోదామని చూసిన దొంగ చేయి ప్యాసింజర్ గట్టిగా పట్టుకున్నాడు.

New Update
running train theft

కదులుతున్న రైల్లో దొంగతనం చేసి సీజీగా తప్పించుకోవచ్చని చాలామంది కేటుగాళ్లు భావిస్తున్నారు. దీంతో స్టేషన్ నుంచి ట్రైన్ మూవ్ కాగానే.. ప్యాసింజర్ల ఫోన్లు, బంగారు ఆభరణాలు లాక్కొని ఉడాయిస్తు్న్నారు. ఇటీవల ఇలాంటి దొంగతనం కేసులు చాలా జరుగుతున్నాయి. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకే ప్రయత్నం ప్యాసింజర్ చేయడనే ధైర్యంతో చైన్ స్నాచర్లు, 420లు ఇలా చేస్తున్నారు. కదులుతున్న ట్రైన్‌లో ప్రయాణికుడి ఫోన్ కొట్టేయాలని ట్రై చేసిన ఓ దొంగ దొరికిపోయాడు. కిటికీలోంచి దొంగని గట్టిగా అలానే పట్టుకొని కిలోమీటర్ వరకు అలానే లాక్కెల్లారు. ఈ ఘటన బీహార్ భాగల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

Also read: Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)

Also read: Rafale Marine jets: ఫ్రాన్స్ నుంచి భారత్‌ మరో 26 రఫెల్ ఫెటర్ జెట్లు!

రన్నింగ్ ట్రైన్‌లో ప్యాసింజర్ ఫోన్ వాడుతున్నాడు. దానిపై కన్నేసిన దొంగ కిటికీలోచ్చి ఫోన్ లాక్కొని పారిపోవాలని ప్లాన్ వేసుకున్నాడు. ప్రయాణికుడు అప్రమత్తంగా ఉండటంతో దొంగ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. తన ఫోన్‌తోపాటు దొంగ చేయి కూడా వదలకుండా గట్టిగా ఉడం పట్టు పట్టినట్లు పట్టుకున్నాడు. గజేంద్రమోక్షంలో ఏనుగు కాలు నోట కరుచుకున్న మొసలిలా ప్రయాణికుడు దొంగ చేయి పట్టుకొని కిలో మీటర్ వరకు రన్నింగ్ ట్రైన్‌లో ఈడ్చుకెళ్లాడు. తలపై రెండుమూడు దెబ్బలు కూడా తగిలించారు తోటి ప్రయాణీకులు. దీంతో దొంగ చేయి కిటికీలోపల, తల, కాళ్లు, బాడీ ట్రైన్ బయట ఉంది. గిలిగిలా కొట్టుకుంటూ దొంగ కదులుతున్న ట్రైన్‌లో కిలో మీటర్ దూరం వెళ్లాడు. దీన్ని అదే బోగీలో కూర్చున్న ఇతర ప్రయాణికులు వీడియో తీశారు. ఆ విడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
Advertisment