తల్లి కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసికందు..అసలు ఏం జరిగిందంటే..?

మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సంధ్య అనే గర్భిని బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందింది. అయితే, కేవలం డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే సంధ్య మృతి చెందిదంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళణ చేస్తున్నారు.

New Update
తల్లి కోసం గుక్కపట్టి ఏడుస్తున్న పసికందు..అసలు ఏం జరిగిందంటే..?

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా(Mahabubabad) తొర్రూరు మండలం అమర్ సింగ్ తండా గ్రామానికి చెందిన గుగులోతు సంధ్య(23) నిండు గర్భిణి. పురిటి నొప్పులతో బాధపడుతున్న సంధ్య తొర్రూరు పట్టణ కేంద్రంలోని పద్మావతి నర్సింగ్ హోమ్ లో డెలివరీ కోసం వచ్చింది. ఆసుపత్రిలోని డాక్టర్‌ యాదగిరి రెడ్డి సంధ్యకు ఆపరేషన్‌ చేసారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే డాక్టర్ ఆపరేషన్‌ చేస్తుండగా సంధ్య మృతి చెందింది. కానీ, ఆపరేషన్ చేసే సమయంలో మృతి చెందిన సంధ్యను ఆమె పరిస్థితి విషమించింది అని బంధువులకు తెలియజేసి..వరంగల్ అజార హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేశాడు డాక్టర్ యాదగిరి రెడ్డి.

సంధ్య మృతి చెందిందని గుర్తించిన బాధిత బంధువులు తొర్రూరులోని పద్మావతి నర్సింగ్ హోమ్ హాస్పటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. సంధ్యా మృతికి కారణం డాక్టర్ యాదగిరి రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య మృతికి నష్ట పరిహారం చెల్లించి, కారణమైన డాక్టర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే హాస్పటల్ లో ఇలాంటి ఘటన లు తరుచూ జరుగుతున్నప్పటికీ అధికారులు ఎందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు.

అసలు విషయం తెలియని ఆ పసికందు తన తల్లి కోసం గుక్కపట్టి ఏడుస్తోంది. ఆ పసిపాప ఏడుపు అందరిని కదిలిస్తోంది. పుట్టిన పసిబిడ్డను చూసి అందరూ కన్నిటి పర్యంతం చెందుతున్నారు. తన తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలియక ఆ చిన్నారి తన తల్లి ప్రేమ కోసం బోరున విలపిస్తోంది.

Also Read: టర్కీ రాజధానిలో ఆత్మాహుతి దాడి.. ఎలా జరిగిందంటే.!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మోకాళ్లపై కూర్చోబెట్టి.. దారుణంగా కాల్చేసిన ఉగ్రవాదులు

విశాఖకు చెందిన చంద్రమౌళి దంపతులు పహల్గామ్ ఉగ్రదాడి నుంచి బయటపడ్డారు. కొందరిని వీరి కళ్లముందే మోకాళ్లపై కూర్చోబెట్టి మరి దారుణంగా కాల్చి చంపారు. ప్రాణాలు అరచేత పట్టుకుని.. భయంతో చెట్ల పొదళ్లు దాక్కోని వీరు బయటపడ్డారు. 

New Update
pahalgam attack

pahalgam attack

జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో జరిగిన భారీ ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందారు. వీరిలో కొత్తగా పెళ్లయిన వారు కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులతో ఎంతో సరదాగా గడుపుదామని వెళ్లిన కుటుంబాలు ఉగ్రదాడికి బలి అయ్యాయి. సహచరులను కళ్ల ముందే కోల్పోవడంతో కొందరు భయానికి గురయ్యారు. అయితే వీరిలో కొంత మంది ప్రాణాలతో బయటపడ్డారు.

ఇది కూడా చూడండి: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

ప్రాణాలు అరచేత పట్టుకుని..

అందులో విశాఖకు చెందిన చంద్రమౌళి దంపతులు ఒకరు. వీరితో పాటు మరో రెండు జంటలు జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లాయి. అక్కడ వీరి కళ్లముందే మోకాళ్లపై కూర్చోబెట్టి మరి దారుణంగా కాల్చి చంపారు. ప్రాణాలు అరచేత పట్టుకుని.. భయంతో చెట్ల పొదళ్లు దాక్కోని ఉగ్రదాడి నుంచి బయటపడినట్లు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

ఇదిలా ఉండగా.. బాధితులు కాళ్లు పట్టుకుని, చేతులెత్తి దండం పెట్టిన వదల్లేదు. ఈ ఉగ్రదాడిలో 35 ఏళ్ల భరత్ భూషణ్ తన ప్రాణాలు  కోల్పోయాడు. అందరినీ కాల్చేస్తూ ఓ ఉగ్రవాది తమ వద్దకు రాగా.. తనకు మూడేళ్ల చిన్నారి ఉన్నందున విడిచిపెట్టాలని భరత్‌ భూషణ్‌ వారిని కోరినా పట్టించుకోకుండా తన భర్తను మూడు నిమిషాల పాటు అతి దారుణంగా  కాల్చేశాడని భరత్ భార్య సుజాత వాపోయింది. భరత్ భూషణ్ భార్య సుజాత భూషణ్ ప్రముఖ డాక్టర్. ఈ దంపతులకు మూడేళ్ల చిన్నారి ఉంది. బెంగళూరులో స్థిరపడిన వీరంతా 2025 ఏప్రిల్ 18న విహారయాత్ర కోసమని కశ్మీర్ వెళ్లారు.

ఇది కూడా చూడండి: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

ఏప్రిల్ 23న బెంగళూరుకు తిరిగి వెళ్లాల్సి ఉండగా.. మంగళవారం మధ్యాహ్నం పహల్గాం సమీప ప్రాంతానికి వెళ్లి అక్కడ సరదాగా తమ చిన్నారితో గడిపారు.  అప్పుడు అకస్మాత్తుగా  కాల్పలు శబ్ధాలు రావడంతో వెంటనే  ముగ్గురం పక్కనే ఉన్న గుడారాల వెనుక దాక్కున్నారు. ఇది గమనించిన ఓ ఉగ్రవాది తమ దగ్గరికి వచ్చాడని సుజాత తెలిపారు. తన  భర్త ఆ ఉగ్రవాదిని ‘‘నాకు ఒక బిడ్డ ఉంది. దయచేసి నన్ను వదిలేయండి’ అని అడిగాడు. అయినప్పటికీ ఆ ఉగ్రవాది కనికరించలేదు. తన భర్త తలపై కాల్చి చంపి వెళ్లిపోయాడంటూ సుజాత కన్నీటి పర్యాంతమైంది.  

ఇది కూడా చూడండి: New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Advertisment
Advertisment
Advertisment