Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. స్కూల్ బస్ కిందపడిన 2ఏళ్ల పాప

హైదరాబాద్ హబ్సిగూడలోని రవీంద్రనగర్ లో దారుణం జరిగింది. రెండేళ్ల పాప స్కూల్ బస్ కింద పడి చనిపోయిన ఘటన స్థానికులను కలిచివేసింది. గురువారం ఉదయం బడికి బయలుదేరిన తన సోదరుడిని బస్ ఎక్కించేందుకు వచ్చిన బాలిక.. కదులుతున్న బస్ కింద పడి అక్కడికక్కడే మరణించింది.

New Update
Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. స్కూల్ బస్ కిందపడిన 2ఏళ్ల పాప

Hyderabad: స్కూల్ బస్ కింద పడి మరో చిన్నారి తన తండ్రి ముందే మరణించిన భయంకరమైన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. స్కూల్‌ బస్సు ప్రమాదంలో ఇటీవలే జవహార్ నగర్ లో ఓ చిన్నారి, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో నాలుగేళ్ల పాప మరణించిన విషాద ఘటనలు మరవకముందే ఈ దారుణం చోటుచేసుకుంది.

హైదరాబాద్ హబ్సిగూడ (Habsiguda)లోని రవీంద్రనగర్ (Ravindranagar) లో దారుణం జరిగింది. రెండేళ్ల పాప స్కూల్ బస్ (school bus) కింద పడి చనిపోయిన ఘటన స్థానికులను కలిచివేసింది. గురువారం ఉదయం బడికి బయలుదేరిన తన సోదరుడిని బస్ ఎక్కించేందుకు వచ్చిన బాలిక.. తండ్రి దగ్గరకు వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తున్న క్రమంలో కదులుతున్న బస్ కింద పడింది. వెంటనే అప్రమత్తమైన తండ్రి, స్థానికులు ఆమెను దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ తీవ్ర గాయలైన పాప అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి : EX Model Murder: హోటల్‌ లో మాజీ మోడల్‌ హత్య..మృతదేహంతో పారిపోయిన నిందితుడు!

ఇదిలావుంటే.. హైదరాబాద్ జవహర్ నగర్ లో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందింది. ఉదయం స్కూల్ కు వెళ్తున్న అన్నకు తోడుగా బస్సు వరకు వెళ్లింది చిన్నారి భవిష్య. బస్సు ముందు నిలబడింది. అయితే చిన్నారి బస్సు ముందు ఉన్నది చూసుకోకుండానే డ్రైవర్ బస్సును నడిపాడు. దీంతో చిన్నారి భవిష్య (3) స్కూల్ బస్సు ముందు టైర్ కింద పడి మృతి చెందింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే పాప చనిపోయిందని స్థానికులు, పేరెంట్స్ ఆరోపిచంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని నడికూడి మండలం రాయపర్తి గ్రామంలో ఎస్వీ స్కూల్ వ్యాన్ కింద పడి మూడు సంవత్సరాల పాప మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా ఇలాంటి ప్రమాదాలు రెగ్యూలర్ జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై స్కూల్ యాజమాన్యంతోపాటు తల్లి దండ్రులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పాపం.. దోమల కాయిల్‌కు పసి బాలుడు బలి

రంగారెడ్డి జిల్లాలో దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు పరుపుకి దగ్గరగా కాయిల్ పెట్టారు. దీనికి కాయిల్ అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించి ఊపిరాడక నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

New Update
MOSQUITO COIL

MOSQUITO COIL

రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌కు నాలుగేళ్ల బాలుడు బలి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హయత్ నగర్‌లో ఓ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు కాయిల్ వెలిగించారు. అది కూడా దూరంగా పెట్టకుండా పిల్లలు పడుకున్న పరుపుకి దగ్గరగానే పెట్టారు. ఆ కాయిల్ పిల్లల పరుపుకు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఆ నాలుగేళ్ల బాలుడు ఊపిరాడక మృతి చెందాడు. మరో ఐదేళ్ల బాలిక పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Pahalgam Terror Attack : పహల్గాం దాడిపై ఉగ్రవాద సంస్థ సంచలన ప్రకటన.. టీఆర్‌ఎఫ్‌ యూ టర్న్

అదుపు తప్పిన వ్యాన్..

ఇదిలా ఉండగా ఇటీవల హర్యానా ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఘోరం జరిగింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య  కార్మికులపైకి వ్యాన్‌ దూసుకెళ్లింది. ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపు తప్పింది. ఈ సంఘటనలో ఏడుగురు కార్మికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం భయంకరంగా మారింది.

ఇది కూడా చూడండి: SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్‌కు మూడు నెలలు బ్రేక్‌!

యాక్సిడెంట్ తర్వాత వ్యాన్‌ డ్రైవర్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ దుర్ఘటన శనివారం ఉదయం 10 గంటలకు చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వే మీద కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్‌ చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్‌లో పాకిస్తానీయులు.. పోలీసులు సంచలన నిర్ణయం

 

Advertisment
Advertisment
Advertisment