Crime: మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని..నోట్లో పొగాకు కుక్కి!

మూడోసారి కూడా ఆడపిల్లే (Baby Girl) పుట్టడంతో ఆ కన్నతండ్రి మనసు కర్కశంగా తయారైంది. పుట్టి ఎనిమిది రోజులు అయినా కాకముందే..ఆ బిడ్డ నోటిలో పొగాకు కుక్కి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు.

New Update
Crime: మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందని..నోట్లో పొగాకు కుక్కి!

మూడోసారి కూడా ఆడపిల్లే (Baby Girl) పుట్టడంతో ఆ కన్నతండ్రి మనసు కర్కశంగా తయారైంది. పుట్టి ఎనిమిది రోజులు అయినా కాకముందే..ఆ బిడ్డ నోటిలో పొగాకు కుక్కి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆ బిడ్డని ఖననం కూడా చేశాడు. ఆశా కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే..మహారాష్ట్ర (Maharashtra) లోని జల్‌గావ్‌ జిల్లాలోని హరినగర్‌ తండాలో గోకుల్ జాదవ్‌ (30) అనే వ్యక్తికి ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే అతని భార్య మరోసారి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అది నచ్చని గోకుల్‌ ఎలాగైనా ఆ పాపని వదిలించుకోవాలనుకున్నాడు.

అనుకున్నదే తడవుగా..ఆ బిడ్డను చంపేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. 8 రోజుల బిడ్డ, కన్న బిడ్డ అనే కనికరం లేకుండా పాప నోట్లో పొగాకు (Tobaco) కుక్కాడు. దీంతో ఊపిరి ఆడక పాప చనిపోయింది. దీంతో పాపని తీసుకుని వెళ్లి ఖననం చేశాడు. గోకుల్‌ దంపతులకు బిడ్డ పుట్టిన విషయం తెలుసుకున్న స్థానిక ఆశావర్కర్‌ బిడ్డ జనన వివరాలు నమోదు చేసుకునేందుకు నిందితుల ఇంటికి వెళ్లింది.

అయితే బిడ్డ చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పాప ఎలా చనిపోయిందని ఆరా తీయగా..అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుని ఇంటి వద్దకు చేరుకొని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు.

పోలీసులు నిందితుడ్ని అరెస్ట్‌ చేసి స్థానిక పోలీసు స్టేషన్‌ కు తరలించారు. పాప శరీరాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అంతరిక్షంలోని అణువణువు తెలుసుకుంటున్న కాలంలో కూడా ఆడపిల్ల పుట్టిందని చంపేయడం దారుణమైన విషయం. అన్ని రంగాల్లో ఆడ మగ సమానం అంటున్నప్పటికీ కూడా ఇలాంటి దారుణ ఘటనలు చోటు చేసుకోవడం సిగ్గు చేటు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

New Update
father killed

Warangal Father kills son

TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కోడలితో అసభ్య ప్రవర్తన..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్‌, ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

father | killed | son | today telugu news

Advertisment
Advertisment
Advertisment