Lemon Auction: రూ.35 వేలు పలికిన నిమ్మకాయ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

తమిళనాడులో ఓ నిమ్మకాయ ధర రూ.35 వేలు పలకడం చర్చనీయాంశమైంది. శివరాత్రినాడు శివుడికి నైవేద్యంగా సమర్పించిన పలు వస్తువులను శివగిరి గ్రామం ఆలయ కమిటీ వేలం వేసింది. 15మంది నిమ్మకాయకోసమే పోటీపడటం విశేషం. దీనిని దక్కించుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని స్థానికుల విశ్వాసం.

New Update
Lemon Auction: రూ.35 వేలు పలికిన నిమ్మకాయ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!

Lemon: వేసవి కాలంలో నిమ్మకాయలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు లెమన్ తో తయారు చేసిన రకరకాల సోడాలు, పానీయాలు సేవిస్తుంటారు జనాలు. దీంతో సాధారణంగా మూడు, నాలుగు రూపాయలు పలికే నిమ్మకాయ ఒక్కోసారి రూ.10లు దాటుతుంది. దీంతో నిమ్మకాయ కొనాలంటే పలికితే జనాలు బెంబేలెత్తిపోతారు. అయితే తమిళనాడులో ఓ నిమ్మకాయ రూ.35 వేలు ధర పలకడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

శివుడికి నైవేద్యంగా..
ఈ మేరకు పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు (Tamil Nadu)లో నిర్వహించిన వేలం (Lemon Auction)లో నిమ్మకాయ భారీ ధర పలికింది. ఈరోడ్‌ జిల్లా శివగిరి గ్రామం సమీపాన ఉన్న ఓ ఆలయంలో నిర్వహించిన వేలంలో ఈ ధరకు నిమ్మకాయను ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. ఆ ఆలయంలో ఇటీవల మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేడుకలను నిర్వహించారు. ప్రత్యేక పూజల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం నిమ్మ, ఇతర ఫలాలు, సామగ్రిని శివుడికి నైవేద్యంగా సమర్పించారు.

ఇది కూడా చదవండి: Indiramma Indlu : ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం.. వారికే ఇస్తామన్న రేవంత్!

వేలంలో 15 మంది పోటీ..
అయితే పూజల అనంతరం ఆ సామగ్రిని వేలం వేశారు. ఈ వేలంలో మొత్తం 15 మంది పాల్గొన్నగా.. ఈరోడ్‌కు చెందిన ఓ భక్తుడు రూ.35 వేలకు నిమ్మకాయను దక్కించుకున్నాడు. దీన్ని దక్కించుకున్నవారికి ఆరోగ్యం, ఐశ్వర్యం సిద్ధిస్తుందని స్థానికుల విశ్వాసం. కాగా వందలాది భక్తుల సమక్షంలో పూజలు నిర్వహించిన అనంతరం అతడికి అందజేసినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. ఇదిలావుంటే.. ఇటీవల బ్రిటన్‌ కళాఖండాల వేలంలో 285 ఏళ్ల నాటి ఒక నిమ్మకాయ ఏకంగా రూ.1.45 లక్షలు రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణ సమయంలో బ్రిటిష్ ఫోటోగ్రాఫర్ దీనిని కనుగొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vijayashanthi Vs Revanth: రేవంత్ రెడ్డికి షాకిచ్చిన విజయశాంతి.. సంచలన ట్వీట్!

మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు.. అంటూ ధరిత్రి దినోత్సవం సందర్భంగా విజయశాంతి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. HCU భూముల విషయంలో రేవంత్ టార్గెట్ గా ఆమె ఈ పోస్ట్ చేశారన్న చర్చ సాగుతోంది.

New Update

ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా ఈ నెల 22న సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి చేసిన పోస్ట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది. అనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే.. మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా.. సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ.. మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు. పరిశ్రమల పేరుతో.. గాలి, నీటిని కాలుష్యంలో ముంచెత్తుతున్నాడు. సహజ వనరుల్ని అవసరానికి మించి వినియోగిస్తున్నాడు.

తన స్వార్థంతో మొత్తం ప్రకృతి స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ఇంత చేస్తుంటే.. ప్రకృతి ఊరుకుంటుందా..? భూకంపాలు, సునామీలు, వరదలు, కరువులతో హెచ్చరికలు చేస్తూనే ఉంది. కొన్ని సార్లు.. వైరస్‌ల రూపంలోనూ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో భూమి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తోంది.. ఇకనైనా మారుదాం.. ప్రకృతి వనరుల్ని కాపాడుకుందాం. అందరికీ ప్రపంచ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ తన X ఖాతాలో విజయశాంతి పోస్ట్ పెట్టారు.

అయితే... విజయశాంతి ట్వీట్‌ పై తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. HCU వివాదం నేపథ్యంలో రేవంత్‌కు విజయశాంతి గట్టి కౌంటర్‌ ఇచ్చారని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ ఇన్‌ఛార్జ్‌ కూడా HCU భూములపై రియాక్ట్‌ కాగా.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ కూడా రేవంత్‌ చర్యలు సరికావని ఇన్‌డైరెక్ట్‌గా విమర్శిస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

కాంగ్రెస్‌ నేతలు మాత్రం... పచ్చకామెర్ల రోగికి అన్నీ పచ్చగా కన్పించినట్లు.. గులాబీ నేతలకు పవరే కాదు... బుర్రలో చిప్‌ కూడా దొబ్బిందని ఘాటుగా స్పందిస్తున్నారు. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్నట్లుగా.. ప్రతీ దానికి రేవంత్‌కు ముడిపెట్టడం... కామన్‌ అయిపోయిందని విమర్శిస్తున్నారు. 

(vijayashanthi | telugu-news | telugu breaking news | hcu land )

Advertisment
Advertisment
Advertisment