Food Poison : ట్రైన్‌ లో బిర్యానీ తిని అస్వస్థతకు గురైన ప్రయాణీకులు..ఆసుపత్రికి తరలింపు!

విశాఖ రైల్వే స్టేషన్ లో కొనుగోలు చేసిన బిర్యానీ తిని 9 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిని రైల్వే సిబ్బంది, పోలీసులు రాజమండ్రి జీజీహెచ్‌ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణపాయం లేకపోయినప్పటికీ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు వైద్యులు తెలిపారు.

New Update
Food Poison : ట్రైన్‌ లో బిర్యానీ తిని అస్వస్థతకు గురైన ప్రయాణీకులు..ఆసుపత్రికి తరలింపు!

Biryani Effect : ట్రైన్‌ జర్నీ(Train Journey) మొదలైనప్పటి నుంచి కూడా ఎన్నో రకాల తినుబండారాలను అమ్మడానికి వస్తుంటారు. టీ, కాఫీలు, వాటర్‌ బాటిళ్లు, బిస్కెట్లు, టిఫిన్లు, బిర్యానీలు కూడా అమ్మకానికి వస్తుంటాయి. దూర ప్రయాణాలు చేసే వారు కచ్చితంగా ఎక్కువ సేపు రైలులో ఉండాలి కాబట్టి వారి అవసరాన్ని బట్టి తినుబండారాలు కొనుగోలు చేస్తుంటారు.

మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవారు అయితే ఏదోక తినుబండారాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే అలా కొని తినడం మంచిది కాదని తాజాగా రెండు సంఘటనలు తెలియజెప్పాయి. విశాఖ రైల్వే స్టేషన(Vishakhapatnam Railway Station) తో పాటు రైలులో కొనుగోలు చేసిన బిర్యానీ(Biryani) తిని సుమారు 10 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

అస్వస్థతకు గురైన ప్రయాణికులను సిబ్బంది రాజమహేంద్ర వరంలోని జీజీహెచ్‌ కు తరలించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం లేదు. కానీ అస్వస్థతకు గురైన ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పట్నా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ లో సేలంకు వెళ్తున్న 15 మంది కార్మికులు విశాఖ రైల్వే స్టేషన్ లో బిర్యానీ కొని తిన్నారు. అది తిన్న అరగంట తరువాత నుంచి వారిలో ఐదుగురు వాంతులు, విరేచనాలతో తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దీంతో రైలు మదద్‌ యాప్‌ లో తోటి ప్రయాణికులు దీని గురించి సమాచారం ఇవ్వడంతో సాయంత్రం 6 గంటలకు వారిని రాజమండ్రి రైల్వే స్టేషన్‌ లో రైల్వే సిబ్బంది, పోలీసులు వారిని రాజమండ్రి జీజీహెచ్‌ కు తరలించారు.

ఇదిలా ఉంటే దిబ్రూగడ్‌- కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌ లో పాలక్కడ్‌ కు వెళ్తున్న ఏడుగురు ప్రయాణికులు విశాఖ రైల్వే స్టేషన్‌ దాటిన తరువాత ఎగ్‌ బిర్యానీలు కొనుగోలు చేసి తిన్నారు. వారికి కూడా అదే పరిస్థితి ఎదురౌంది. వారిలో నలుగురిని రాజమండ్రి స్టేషన్‌ లో దించి ఆసుపత్రికి తరలించారు.

ఇలా ఒక్కరోజులోనే రైళ్లలో బిర్యానీ తిని సుమారు 9 మంది ఆసుపత్రిలో చేరారు. దీంతో వైద్యులు ఎక్కడపడితే అక్కడ ఆహారాన్ని కొనుగోలు చేసి లేనిపోని జబ్బులు కొని తెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.

Also read: కుటుంబంతో విదేశాలకు వెళ్తున్న సూపర్‌ స్టార్‌ మహేష్‌..ఎందుకంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment