US Gun Fire:చికాగో కాల్పులు..ఎనిమిది మంది మృతి

అమెరికా అంటే గన్ కల్చర్ అన్నట్టు తయారైంది. ఈమధ్య మరీ ఎక్కవు అయిపోతోంది..తుపాకుల మోత మోగిస్తున్నారు. తాజాగా చికాగో ఓ ఉన్మిది రెచ్చిపోయాడు. మొత్తం మూడు చోట కాల్పులు జరిపాడు. ఇందులో మొత్తం 8మంది మరణించారు.

New Update
US Gun Fire:చికాగో కాల్పులు..ఎనిమిది మంది మృతి

Chicago:అమెరికాలో గన్ కల్చర్‌కు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. అదేదో ఆట వస్తువు అన్నట్టు వాడుతున్నారు. ముఖ్యంగా యువత దీన్ని తెగ మిస్ యూజ్ చేస్తున్నారు. ఆత్మరక్షణ కోసం పెట్టిన చట్టాన్ని తమ స్వార్ధాల కోసం వాడుకుంటూ రెచ్చిపోతున్నారు. అమెరికాలో మరోసారి గన్ కల్యర్ తన పంజా విసిరింది. నిన్న చికాగోలో మూడు చోట్ జరిపిన కాల్పుల్లో మొత్తం 8 మంది మృతి చెందారు. మూడు చోట్లా ఒకే వ్యక్తి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం కాల్పులుల జరిపిన ఉన్మాది పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.

Also Read:ఇక కాస్కోండి తమ్ముళ్లు… షర్మిల రాజకీయ పోరాట యాత్ర వైపే అందరిచూపు..!

అక్కడిక్కడే చనిపోయిన మృతులు...

అమెరికాలో అతి పెద్ద నగరాల్లో ఒకటైన చికాగోలో జోలియట్ ప్రాంతంలోని 2200 బ్లాక్ ఆఫ్ వెస్ట్ ఏకర్స్ రోడ్‌లో ఈ ఘోరం జరిగింది. తున్మాది తుపాకీలు తీసుకులు ఇద్దరి ఇళ్ళల్లోకి చొరబడి కాల్పలుకు తెగబడ్డాడు. ఈ దాడిలో రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది అక్కడిక్కడే మరణించారు. సడెన్‌గా నిందితుడు ఇంట్లోకి చొరబడి కాల్పులు జరపడంతో ఎవరూ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. మృతులు ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసులు చెప్పారు.

23 ఏళ్ళ రోమియో నాన్స్..

ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి పేరు రోమియో నాన్స్. ఇతనికి 23 ఏళ్ళు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. బాధిత కుటుంబాలకు, నిందితుడికి ఇంతకు ముందే పరిచయం ఉందని తెలుస్తోంది. వారితో అతనికి ఏదో వైరం ఉందని...అందుకే కాల్పులు జరిపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాల్పుల తర్వాత యువకుడు పరారయ్యాడు. అయితే నిందితుడు మరిన్ని కాల్పులు జరపకముందే అతన్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

పహల్గామ్‌ ఉగ్రదాడి.. ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా!

పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 27 మంది మృతి చెందిన ఘటన తెలిసిందే. కేవలం పర్యాటకులనే టార్గెట్‌ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం అడగడంతో పాటు మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు.

New Update
PahalgamTerroristAttack

PahalgamTerroristAttack

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్‌లో టూరిస్ట్‌లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌‌లో 27 మంది మృతి చెందిన ఘటన తెలిసిందే. కేవలం పర్యాటకులనే టార్గెట్‌ చేసి అటాక్ చేశారు. టూరిస్టులను వరుసగా నిల్చోని పెట్టి పేరు, మతం ఏంటని అడిగి టెర్రరిస్టులు కాల్చి చంపారు. ఈ ఉగ్రదాడిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే కొందరు అబద్ధం చెబుతారు ఏమోనని మగవాళ్ల ప్యాంట్లు విప్పించి మరీ దారుణంగా చంపారు. మరికొందరి ఐడీ కార్డులు చెక్ చేసి హతమార్చారు. సమ్మర్ వెకేషన్, హనీమూన్‌కి వెళ్లిన వారు ఈ ఉగ్రదాడికి బలి అయ్యారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

ఇద్దరు తెలుగు వాసులు

ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి చెందారు. కశ్మీర్‌ నరమేథంలో రిటైర్డ్ బ్యాంక్‌ ఉద్యోగి చంద్రమౌళి ప్రాణాలు కోల్పోయారు. చంద్రమౌళి పారిపోతున్నా.. ఉగ్రవాదులు ఆయనను వెంటాడి మరీ చంపారు. చంపొద్దని వేడుకున్నా ఉగ్రమూకలు కనికరించలేదు. వెళ్లి మీ ప్రధాని మోడీకి చెప్పుకోండి అంటూ చంద్రమౌళిపై విచక్షణారహితంగా ఉగ్రవాదుల కాల్పులు జరిపినట్లు సమాచారం. కాల్పులు జరిపిన 3 గంటల తర్వాత చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!

నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్‌ అనే తెలుగు వ్యక్తి కూడా ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. మధుసూదన్‌ బెంగూళురులో స్థిరపడినట్లు తెలుస్తుంది.కుటుంబంతో కలిసి ఆయన కశ్మీర్‌యాత్రకు వెళ్లారు.ఇంతలోనే ఈ ఘోరం జరిగింది.హైదరాబాద్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మనీశ్‌ రంజన్‌ మృతి చెందారు. కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కార్యాలయంలో సెక్షన్‌ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్‌ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు.

ఇది కూడా చూడండి: Ap Weather Report:ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల ప్రజలు జర జాగ్రత్త మరి!

Advertisment
Advertisment
Advertisment