Lucknow Crime:వచ్చారు..కాల్చారు..పోయారు..సీసీ టీవీలో రికార్డు అయిన దారుణం!

లక్నో లో దారుణం ఘటన జరిగింది. ఓ చిన్న భూ తగాదా ముగ్గురి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. నిందితులు జీపులో వచ్చి ముగ్గురు కుటుంబ సభ్యులను కాల్చి చంపారు. ఈ దారుణం అంతా ఇంటి ముందు అమర్చిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.

New Update
Lucknow Crime:వచ్చారు..కాల్చారు..పోయారు..సీసీ టీవీలో రికార్డు అయిన దారుణం!

Uttar Pradesh: చిన్న భూ వివాదం ఒకే ఇంటిలోని ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. భూ తగాదా ఉన్నవారు తమకు తగాదా ఉన్న కుటుంబ సభ్యులును జీపులో వచ్చి తుపాకులతో కాల్చి చంపిన దారుణ ఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లోని లక్నో (Lucknow) లో చోటు చేసుకుంది. యోగి ఆదిత్య నాథ్‌ పాలనలో ఉన్న రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.

ఈ దారుణానికి సంబంధించిన సంఘటన అంతా కూడా ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో (CC Camera) రికార్డు అయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూపీలోని లక్నో జిల్లా మలిహాబాద్‌ లో ఈ దారుణ ఘటన జరిగింది. మునీర్‌ ఖాన్‌, అతని భార్య ఫర్హీన్‌ గత కొంత కాలంగా ఓ భూమి విషయంలో కొందరితో తగాదాలు ఉన్నాయి.

అయితే కొంతకాలం క్రితం వీరు తమతో తగాదా ఉన్నవారిని దూషించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు ప్రత్యర్థి వర్గం జీపులో నేరుగా మునీర్‌ ఖాన్ ఇంటిలోనికి దూసుకుని వచ్చారు. ఆ సమయంలో ఇంటి ముందు మునీర్‌ ఖాన్‌ ఉన్నారు. నిందితులు అతనితో కాసేపు మాట్లాడారు.

ఆ సమయంలో ఒక్కసారిగా గొడవ పెద్దది కావడంతో వారి వెంట తెచ్చుకున్న తుపాకీతో అతనిని కాల్చి చంపారు. అక్కడితో ఆగకుండా ఇంటి లోపల ఉన్న మునీర్‌ భార్య ను, అతని కుమారుడు హంజాలా ను కూడా తుపాకీతో కాల్చేశారు. వారు ముగ్గురు చనిపోయారు అని నిర్థారించుకున్న తరువాత నిందితులు అక్కడి నుంచి అదే జీపులో పరారయ్యారు.

ఈ దారుణానికి సంబంధించిన ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అవ్వడంతో పోలీసులు జీపు డ్రైవర్‌ ను అరెస్ట్‌ చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన ప్రధాన నిందితుడు లల్లన్‌ ఖాన్‌ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. యూపీలో నిందితులను యోగీ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. మరీ ఈ ట్రిపుల్‌ మర్డర్‌ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని అందరూ వేచి చూస్తున్నారు.

మూడు మృతదేహాలను శుక్రవారం పోస్టుమార్టానికి పంపనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Also read: అందుతున్న ద్రాక్షను రోజూ తినడం వల్ల ఈ వ్యాధులన్ని దూరం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

డాక్టర్ల నిర్లక్ష్యం.. సగం కాన్పు చేయడంతో..?

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ పసికందు తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన వనపర్తిలో జరిగింది. ఓ మహిళకు డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి ఆ తర్వాత ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విఫలం కావడంతో పసికందును రెండు భాగాలుగా కోసి బయటకు తీశారు.

New Update
Wanaparthy crime

Wanaparthy crime Photograph: (Wanaparthy crime)

ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఓ పసికందు తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. తల్లి ప్రాణాలను కాపాడేందుకు చివరకు ప‌సికందు త‌ల‌, మొండెంను వేరు చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రఘడ్ గ్రామానికి చెందిన అనిత అనే గర్భిణీకి నెల‌లు నిండాయి.

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!

ప్రసవం చేస్తుండగా ఆరోగ్యం క్షీణించి..

ఈ క్రమంలో ఆమెను అమ‌ర‌చింత ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అయితే అక్కడ డాక్టర్లు లేకపోవడంతో స్టాఫ్ న‌ర్సు డెలివరీ చేయడానికి ప్రయత్నించగా విఫలమైంది. దీంతో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రసవం చేస్తుండగా.. పిండం వెనుక భాగం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇది కూడా చూడండి: USA-China: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..

దీంతో డాక్టర్లు చేతులు ఎత్తేశారు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తల్లిని కాపాడే ప్రయత్నంలో ప్రైవేట్ వైద్యులు పసికందు తల మొండెం రెండు భాగాలుగా కోసి బయటకు తీశారు. తల్లి కడుపులోనే ప్రాణాలు కోల్పోయిన పసికందును చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. 

ఇది కూడా చూడండి: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా వైద్యులు సరిగ్గా పనిచేస్తే ఇలా జరిగేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment