Lemon : ఈ నిమ్మకాయను కొనే డబ్బులతో ఏకంగా కారునే కొనొచ్చు.. ధర ఎన్ని లక్షలో తెలుసా?

ఇంగ్లండులోని న్యూపోర్టులో 285ఏళ్లనాటి నిమ్మకాయ దొరికింది. తాజాగా యూకేలో జరిగిన ఓ వేలంలో ఎవరూ ఊహించని ధరకు అమ్ముడుపోయింది. ఈ నిమ్మకాయ ఏకంగా 1.4లక్షలు పలికింది. ఈ నిమ్మకాయను తన ప్రేమకు గుర్తుగా ఆ కాలంలో ఒక వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయికి బహుకరించినట్లు తెలుస్తోంది.

New Update
Lemon : ఈ నిమ్మకాయను కొనే డబ్బులతో  ఏకంగా కారునే కొనొచ్చు.. ధర ఎన్ని లక్షలో తెలుసా?

Lemon : చాలా మందికి పురాతన వస్తువులు, విశేషాలపై ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఏళ్లనాటి అరుదైన వస్తువులను చూసేందుకు మ్యూజియంకు వెళ్తుంటారు. అదే ఇంకొందరికి మాత్రం పురాతన వస్తువులను సేకరించే అలవాటు కూడా ఉంటుంది. వివిధ సంస్థలు నిర్వహించే వేలంలో పాల్గొని భారీగా డబ్బులు చెల్లించి మరీ పురాతన వస్తువులను కొంటుంటారు. అయితే ఇంగ్లండులోని న్యూపోర్టులో 285ఏళ్ల కాలం నాటి నిమ్మకాయ దొరికింది. దానిని యూకేలో జరిగిన ఓ వేలంలో భారీ ధరకు అమ్మారు. ఎవరూ ఊహించని విధంగా వేలంలో రూ. 1.4లక్షలు పలికింది. వేలంలో భారీ ధర పలికిన ఈ అరుదైన నిమ్మకాయ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

అల్మారాలో 285 ఏళ్ల నిమ్మకాయ దొరికింది:
ఒక నిపుణుడు వేలానికి ఉంచిన అల్మారా ఫోటోలు తీస్తున్నప్పుడు, డ్రాయర్ వెనుక ఉన్న ఈ నిమ్మకాయ గుర్తించారు. నిమ్మకాయను చూడగానే దానిపై ప్రత్యేక సందేశం రాసి ఉంది కనిపించింది. సందేశం ఇలా ఉంది - 'మిస్టర్. పి. లౌ ఫ్రాంచినీ మిస్ ఇ. బాక్స్టర్‌కి 4 నవంబర్ 1739న ప్రజెంట్ చేశారు అని రాసి ఉంది. అంటే ఈ మెసేజ్ ను బట్టి ఆ కాలంలో ఒక వ్యక్తి తాను ప్రేమించిన అమ్మాయికి బహుకరించినట్లు తెలుస్తోంది. ఈ నిమ్మకాయ వయస్సు 285 సంవత్సరాలు అని తేలింది. నిమ్మకాయ దొరికిన తర్వాత వేలం సంస్థ ఈ నిమ్మకాయను వేలానికి పెట్టింది. ఎవరైనా అందులో 40 నుంచి 60 పౌండ్లు అంటే రూ.4200 పలుకుతుందని ఊహించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా భారీ డబ్బుకు ఈ నిమ్మకాయ అమ్ముడుపోయింది.

ఈ నిమ్మకాయను వేలంలో 1416 పౌండ్లకు (1.48 లక్షల రూపాయలు) విక్రయించారు. కాగా ఈ నిమ్మకాయ దొరికిన అల్మారా కేవలం 40 డాలర్లకు అంటే రూ.3319 పలికింది. అల్మారాను వేలానికి ఇచ్చిన కుటుంబీకులు వేలం హౌస్‌కు చేరుకునే వరకు అల్మారాలో ఈ నిమ్మకాయ ఉన్న విషయం తెలియదు. నిమ్మకాయ 2 అంగుళాల వెడల్పు, పూర్తిగా ఎండిపోయినప్పటికీ తాజా నిమ్మకాయ ఆకారంలోనే ఉంటుంది. నిమ్మకాయను ఇన్ని రోజులు బాగా భద్రపరిచారు.

ఇది కూడా చదవండి: రాంచరణ్ కూతురును చూసుకునే కేర్ టేకర్ జీతమెంతో తెలుస్తే షాక్ అవుతారు.!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు