షావర్మా తినడం వల్ల మరణించిన యువకుడు..ఎక్కడంటే!

షావర్మా తినడం వల్ల ఓ 24 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది. బుధవారం రాత్రి రాహుల్‌ పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. ఈ విషయం గురించి ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ..ఆయన మీద విష ప్రయోగం జరిగిందనే విషయం స్పష్టమైనట్లు తెలుస్తుంది. అయితే అది షావర్మా తినడం వల్ల జరిగిందా..లేక ఇంకా ఏదైనా దాని వల్ల జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

New Update
షావర్మా తినడం వల్ల మరణించిన యువకుడు..ఎక్కడంటే!

షావర్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్ద వారు వరకు ఇష్టంగా తింటుంటారు. కానీ షావర్మా తినడం వల్ల ఓ 24 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్‌ 18న కొట్టాయం వాసి రాహుల్‌ నాయర్‌ లే హయత్‌ రెస్టారెంట్‌ నుంచి షావర్మా ఆర్డర్‌ చేసుకున్నాడు.

దానిని తిన్న తరువాత ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దాంతో ఆయన అక్టోబర్ 19న కక్కనాడ్‌ లోని సన్‌ రైజ్‌ ఆసుపత్రిలో చేరాడు. హాస్పిటల్‌ లో చేరిన తరువాత ఆయన అదే రోజు ఇంటికి వచ్చాడు. అయితే మళ్లీ రెండు రోజుల తరువాత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు.

Also read: హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్

అయితే బుధవారం రాత్రి రాహుల్‌ పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. ఈ విషయం గురించి ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ..ఆయన మీద విష ప్రయోగం జరిగిందనే విషయం స్పష్టమైనట్లు తెలుస్తుంది. అయితే అది షావర్మా తినడం వల్ల జరిగిందా..లేక ఇంకా ఏదైనా దాని వల్ల జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.

రాహుల్‌ తిన్న షావర్మా లో ఏమైనా విషం కలిసిందా అనే అనుమానాలతో..రాహుల్‌ షావర్మా తెప్పించుకున్న హోటల్ యజమాని పై త్రిక్కకర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెస్టారెంట్‌ నుంచి కొన్ని నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్‌ కి పంపినట్లు పోలీసులు తెలిపారు.

రాహుల్‌ కిడ్నీ, కాలేయం పాడవ్వడంతో పాటు గుండెపోటుకు గురైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రాహుల్‌ హస్పిటల్‌ లో ఉన్న అన్ని రోజులు కూడా అతన్ని వెంటిలేటర్‌ సపోర్ట్‌ పై పెట్టినట్లు వైద్యులు వివరించారు.

Also read: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి..వైద్యులు ఏమన్నారంటే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

యువతిపై దాడి.. నిందితుడు అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

విజయనగరం జిల్లా శివారం గ్రామంలో అఖిల అనే యువతిపై దాడి చేసిన  నిందితుడు ఆదినారాయణను (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు

New Update
a young women

a young women

విజయనగరం జిల్లా శివారం గ్రామంలో అఖిల అనే యువతిపై దాడి చేసిన  నిందితుడు ఆదినారాయణను (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ వెల్లడించారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా వెల్లడించారు. నిందితుడు దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అఖిల సోదరుడికి నిందితుడు ఆదినారాయణస్నేహితుడు. ఆమె కుటుంబ సభ్యులతోనూ ఆదినారాయణ సన్నిహితంగా ఉండేవాడు. 

Also read :  డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇద్దరి మధ్య వాగ్వాదం

అయితే ఇటీవల ఆమెకు అసభ్య సందేశాలు పంపడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇదే విషయమై అతడిని యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. దీంతో కక్ష పెంచుకున్న ఆదినారాయణ అఖిలపై కత్తితో దాడికి దిగాడు.  శనివారం ఇంటి ముందు బాధితురాలు బట్టలు ఉతుకుతున్న టైమ్ లో   కత్తితో పొడిచి పరారయ్యాడు. యువతికి పొట్టలో బలంగా కత్తిపోట్లు దిగడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.  

Also Read :  దేశానికి స్ఫూర్తినిచ్చిన పోరాటం..ఆ భూములపై కేటీఆర్ బహిరంగ లేఖ

వెంటనే చుట్టు పక్కల వారు గమనించి 108కి ఫోన్‌ చేశారు. ఆమెను చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్పృహలోకి రావడంతో  ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Also Read : Ramnavami: రామాలయంలో అపశృతి.. టెంట్లు కూలీ భక్తుల తలలు పలిగాయి

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment