AP : పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత!

పిఠాపురంలో మరోసారి కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 17 కోట్ల విలువైన వస్తువులను సీజ్‌ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు.

New Update
AP : పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత!

Pithapuram : పిఠాపురంలో మరోసారి కోట్ల విలువైన బంగారాన్ని(Gold) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారానికి సరైన బిల్లులు కానీ, తీసుకుని వెళ్తున్న వ్యక్తుల వివరాలు కానీ సరిగా లేకపోవడంతో పాటు దానిని ఆక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఎస్‌ఎస్‌టీ(SST) అధికారులు పట్టుకున్నారు. ఆ వాహనంలో సుమారు రూ. 17 కోట్ల విలువైన వస్తువులను సీజ్‌ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద ఎస్‌ఎస్‌టీ బృందం తనిఖీలు చేపట్టింది. ఆ సమయంలో విశాఖ నుంచి కాకినాడ వస్తున్న సీక్వెల్‌ లాజిస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(Sequel Logistic Pvt. Ltd) సంస్థకు చెందిన వాహనం అనుమానస్పదంగా అనిపించింఇ.

వెంటనే వాహనాన్ని ఆపి తనిఖీలు చేపట్టగా.. అందులో బంగారు, వెండి(Silver) వస్తువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారానికి సరైన కాగితాలు కానీ, తరలించే వ్యక్తులు పేర్లు కానీ సరి లేకపోవడంతో అధికారులు బంగారంతో పాటు వాహనాన్ని కూడా సీజ్‌ చేశారు. ఏప్రిల్‌ 13న కూడా ఇదే తరహాలో రూ. 3 కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also read: ఈ కాలంలో హీట్ స్ట్రోక్‌ కేసులే కాదు..బ్రెయిన్‌ స్ట్రోక్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి..జాగ్రత్త సుమా!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Chandrababu: గురుకులాన్ని సందర్శించిన చంద్రబాబు.. స్టూడెంట్స్ తో ముచ్చట్లు!

ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నియోజకవర్గం, ముప్పాళ్లలోని బాలికల గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని, పాఠశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడారు. వంటశాల, భోజనశాలలో పరిశుభ్రతను, సరుకులను పరిశీలించారు.

New Update
Chandrababu Nandigama Tour

Chandrababu Nandigama Tour

Advertisment
Advertisment
Advertisment