Breaking: మరో 50 మంది ఎంపీలు ఔట్.. స్పీకర్ సంచలన నిర్ణయం!

పార్లమెంట్‌ లో ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతుంది. సోమవారం నాడు 79 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా..మంగళవారం నాడు 50 మంది ఎంపీలను సభ సస్పెండ్‌ చేసింది.

New Update
Lok Sabha : లోక్ సభ ను రద్దు చేస్తూ తీర్మానం

పార్లమెంట్‌ లో ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతుంది. సోమవారం నాడు 79 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా..మంగళవారం నాడు 50 మంది ఎంపీలను సభ సస్పెండ్‌ చేసింది.ఈరోజు సస్పెండ్ అయిన వారిలో సీనియర్ నేత శశిథరూర్‌, సుప్రియా సూలే ఉన్నారు.

గతవారం లోక్‌ సభలో జరిగిన భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో నిరసనలు చేపట్టారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లోక్‌సభ ఛాంబర్‌ లోనికి ప్రవేశించి , స్మోక్‌ బాంబులను ప్రయోగించడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ భద్రతా వైఫల్యం గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడాలని వెంటనే వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

దీంతో ఎంపీలు సభ నియామాలు ఉల్లంఘించి సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించడంతో రెండు సెషన్లు కలిపి మొత్తం 92 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఇరు సభల సభాపతులు వివరించారు. సోమవారం నాడు మొత్తంగా 79 మంది ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు.

మంగళవారం కూడా అదే పరంపర కొనసాగింది. ఈరోజు 50 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేసినట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో ఇరు సభల నుంచి మొత్తం 139 మంది ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు. సస్పెండ్‌ అయిన వారిలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ నేతలు శశి థరూర్‌, కార్తీ చిదంబర్‌, ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే, సమాజ్‌ వాది పార్టీకి చెందిన డింపుల్‌ యాదవ్‌ లు ఉన్నట్లు సమాచారం.

Also read: త్వరలో 14 వేల ఉద్యోగాలకు ప్రకటన.. మంత్రి సీతక్క శుభవార్త!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: నా బావ జైలులో నన్ను వేసేయండి.. బోరున ఏడ్చేసిన వర్షిణీ

అఘోరీ అరెస్టు తర్వాత శ్రీవర్షిణి బోరున ఏడ్చేసింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

New Update

అఘోరీ, శ్రీవర్షిణీ లవ్‌కు బ్రేక్ పడింది. ప్రస్తుతం అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశాలతో 14 రోజుల పాటు చంచల్‌గూడ జైల్లోకి పంపారు. అయితే అఘోరీని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో.. ఆ తర్వాత శ్రీవర్షిణీ సంచలన వ్యాఖ్యలు చేసింది. అఘోరీతో పాటే తనను కూడా అరెస్టు చేయాలని కోరింది. తన బావ జైలులోనే తనను కూడా ఉంచండి అంటూ రచ్చ రచ్చ చేసింది. 

Also read :  పహల్గాంలో భయంకరమైన కాల్పుల లైవ్ వీడియోలు.. చూశారంటే గజగజ వణకాల్సిందే!

బోరున ఏడ్చేసిన వర్షిణి

అంతేకాకుడా తనను పంపిస్తే.. జైలుకు పంపించండి లేదా అత్త మామల దగ్గరకి పంపించండి అంటూ బోరున ఏడ్చేసింది. పోలీసులు ఎంత చెప్పినా వర్షిణీ అస్సలు వినిపించుకోలేదు. అఘోరీని జైలుకు పంపిన తర్వాత వర్షిణీకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వర్షిణికి పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఆమె వినిపించుకోలేదు. తాను మైనర్‌ని కాదని.. మేజర్‌నని.. ఎక్కడైనా ఉండే హక్కు తనకు ఉందని వర్షిణి అంటోంది. తాను కావాలనుకున్న చోటుకే తనను వదిలేయాలని చెబుతోంది. అంతేకాని తన తల్లిదండ్రుల వద్దకు పంపించొద్దని పేర్కొంది.

Also Read :  ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

 

ఇందులో భాగంగానే వర్షిణికి పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూన్నా ఆమె మాత్రం ఎవ్వరి మాట వినడం లేదు. అయితే పోలీసులు దాదాపు 15 రోజుల పాటు వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వర్షిణి తల్లిదండ్రులు తమ కూతురిని తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. అఘోరీ మాయమాటలకు వర్షిణి లోబడిందని.. తమ కూతురిని తామే ఇంటికి తీసుకెల్లిపోతామని అంటున్నారు.   

aghori sri varshini | lady aghori sri varshini relation | Lady Aghori Sri Varshini Marriage | Lady Aghori Sri Varshini Love Story | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు