AP : వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం దిగజారుడు వ్యాఖ్యలు: వైవీ సుబ్బారెడ్డి వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టును ఎవరు పూర్తి చేశారనేది ప్రజలందరికీ తెలుసన్నారు. ఈవీఎంలపై అనుమానం ఉండడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. By Jyoshna Sappogula 21 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ ఒంగోలు New Update షేర్ చేయండి YV Subba Reddy : వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project) పై ప్రభుత్వం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుందని వైసీపీ (YCP) రీజనల్ కో-ఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టును ఎవరు పూర్తి చేశారన్నేది ప్రజలందరికి తెలుసు అన్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ..సార్వత్రిక ఎన్నికల్లో EVMలపై తమకు మొదటి నుంచి అనుమానం ఉందన్నారు. Also Read: ‘మా నాన్నను జైల్లో వేయండి’.. ఓ ఐదేళ్ల బుడ్డోడి ఫిర్యాదు..! ఈవీఎంలపై గతంలో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అనుమానం వ్యక్తం చేశారని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. 2019లో టీడీపీ ఓటమి తరువాత ఈవీఎంలపై చంద్రబాబు మాట్లాడారన్నారు. ఈ క్రమంలోనే ఈవీఎంలపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామన్నారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు. #ap-tdp #ap-ycp #yv-subba-reddy సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి